WPL: ఉత్కంఠ పోరులో దిల్లీదే గెలుపు.. ఆర్సీబీకి ఐదో ఓటమి
డబ్ల్యూపీఎల్ (WPL)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఓటమి. పేలవ ఆటతీరుతో ఆర్సీబీ వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది.
ముంబయి: డబ్ల్యూపీఎల్ (WPL)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఓటమి. పేలవ ఆటతీరుతో ఆర్సీబీ వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది. బెంగళూరుపై దిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని దిల్లీ 4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించింది. దిల్లీ బ్యాటర్లలో క్యాప్సీ (38; 24 బంతుల్లో 8 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (32; 28 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. మరిజేన్ కాప్ (32; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), జొనాసెన్ (29; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో ధాటిగా ఆడారు. బెంగళూరు బౌలర్లలో ఆశా శోభన రెండు, మేఘన్ స్కట్, ప్రీతి తలో వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్లో దిల్లీ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం అయ్యాయి. మొదటి రెండు బంతుల్లో రెండు పరుగులు రాగా.. మూడో బంతికి జొనాసెన్ సిక్సర్ బాదడంతో స్కోర్లు సమం అయ్యాయి. నాలుగో బంతికి ఫోర్ కొట్టడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లలో ఎల్లీస్ పెర్రీ (67; 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ శతకంతో మెరవగా.. రిచా ఘోష్ (37; 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడింది. కెప్టెన్ స్మృతి మంధాన (8), హెథర్ నైట్ (11) నిరాశపర్చగా.. సోఫీ డివైన్ (21) ఫర్వాలేదనిపించింది. శ్రేయంకా పాటిల్ (4*) పరుగులు చేసింది. దిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. తారా నోరిస్ ఒక వికెట్ను ఖాతాలో వేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి