Suraj Randiv : ధోనీతో ఆడాడు.. సెహ్వాగ్కు నిరాశ మిగిల్చాడు.. ఇప్పుడు బస్ డ్రైవర్గా మారాడు
ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అని పెద్దలు ఊరికే అనలేదు. విధిరాత ఎలా రాసిపెట్టి ఉందో ఎవరికి తెలుసు. నిన్నటి వరకు...
ఇదీ శ్రీలంక మాజీ ఆటగాడు సూరజ్ రణ్దివ్ పరిస్థితి
(ఫొటో సోర్స్: సూరజ్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అని పెద్దలు ఊరికే అనలేదు. విధిరాత ఎలా రాసిపెట్టి ఉందో ఎవరికి తెలుసు. ముందు క్షణం వరకూ రాజులా ఓ వెలుగు వెలిగినవారే .. మరుక్షణమే బికారి అవుతారని ఎవరన్నా ఊహించగలరా..? అందుకే విధి ఆడే వింతనాటకంలో మనమంతా పావులం అని కవులు చెబుతుంటారు. ఇంతకీ ఇదంతా ఎందుకో అని అడుగుతారా..? అయితే అదేంటో తెలియాలంటే మాత్రం ఇది చదవాల్సిందే..
ప్రతి క్రికెటర్కూ గుణపాఠం..
(ఫొటో సోర్స్: సూరజ్ ట్విటర్)
క్రికెట్లో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అయితే కేవలం ఆయా బోర్డులు ఇచ్చే భత్యాలపైనే ఆధారపడాల్సి ఉండేది. కానీ, ఎప్పుడైతే భారత టీ20 లీగ్ వచ్చిందో సెలెక్ట్ అయిన ఆటగాళ్లకు కాసులపంటే పండుతోంది. ఒక్క మ్యాచ్ ఆడినా లక్షల్లో దక్కుతున్నాయి. ఆటకు వీడ్కోలు పలికితే వ్యాఖ్యాతగా మారొచ్చు. ఏదైనా లీగ్ల్లో సహాయక సిబ్బందిగా చేరే ఛాన్స్లు వస్తుంటాయి. లేకపోతే క్రికెట్ ట్రైనింగ్ ఇస్తూనైనా సంపాదించవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కొందరి పరిస్థతి మాత్రం దుర్భరంగా మారిందనేదానికి ఈ మాజీ ఆటగాడే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం తన కుటుంబం కోసం డ్రైవర్గా మారిపోయిన ఆ మాజీ క్రికెటర్ శ్రీలంకకు చెందిన సూరజ్ రణ్దివ్. లంక తరఫున 12 టెస్టులు, 31 వన్డేలు, ఏడు టీ20లు ఆడాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో దాదాపు 85 వికెట్లు పడగొట్టాడు. భారత టీ20 లీగ్లోనూ ఆడటం విశేషం. ఆకాశం ఎత్తుకు ఎదిగిన ఆటగాడు ఒక్క ఉదుటన కిందికి పడిపోయిన సూరజ్ జీవితం ప్రతి క్రికెటర్కు గుణపాఠంలాంటిదే. అతడి జీవితం ఎందుకు ఇలా మారిందో కారణాలు తెలియదు కానీ.. ప్రస్తుత తరం ఆటగాళ్లు మాత్రం పక్కాగా లైఫ్ను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ధోనీ నాయకత్వంలో..
(ఫొటో సోర్స్: సూరజ్ ట్విటర్)
2009లో లంక జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన సూరజ్ కేవలం ఏడేళ్లకే తన కెరీర్ను ముగించాల్సి వచ్చింది. 2011 వరల్డ్ కప్లో పాల్గొన్న లంక జట్టులో సభ్యుడు. అయితే ధోనీ కెప్టెన్సీలో భారత్ 2011 ప్రపంచకప్ ఫైనల్లో లంకను ఓడించి మరీ నెగ్గిన విషయం తెలిసిందే. తుదిపోరులో సూరజ్ పెద్దగా రాణించలేదనే చెప్పాలి. అయితే కేవలం రెండేళ్లకే జాతీయ జట్టులోకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకతను చాటుకొన్నాడు. దీంతో భారత టీ20 లీగ్లోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది. అదీనూ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టులో స్థానం సంపాదించాడు. అయితే 2011 సీజన్లో కేవలం ఎనిమిది మ్యాచ్లను మాత్రమే ఆడాడు. ఆరు వికెట్లను తీశాడు. ఇక తర్వాతి సీజన్ నుంచి భారత టీ20 లీగ్లో మళ్లీ కనిపించలేదు.
సెహ్వాగ్కు సెంచరీ దక్కకుండా..
(ఫొటో సోర్స్: సూరజ్ ట్విటర్)
చాలా మంది క్రికెటర్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. వారు ఏ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించినా అభిమానం తగ్గదు. ఎందుకంటే మైదానంలో ఆయా క్రికెటర్ల వ్యవహారధోరణి కూడా అందుకు కారణం. కానీ కొంతమంది మాత్రం తమ దూకుడైన ప్రవర్తనతోపాటు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు ఏదైనా రికార్డు సాధిస్తే మాత్రం తట్టుకోలేనితనం ప్రదర్శిస్తే అప్రతిష్ఠపాలవుతారు. ఇలాంటి వ్యవహారమే భారత అభిమానుల ఆగ్రహానికి సూరజ్ గురయ్యేలా చేసింది. 2010లో భారత్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో ట్రైసిరీస్ జరిగింది. లీగ్ దశలో లంకను 170 పరుగులకే టీమ్ఇండియా ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (99*) అద్భుతంగా ఆడాడు. కేవలం 34.3 ఓవర్లలోనే 171 పరుగులు చేసిన భారత్ విజయం సాధించింది. అయితే ఇక్కేడ సూరజ్ అభిమానుల కోపాగ్నికి బలయ్యాడు. సెహ్వాగ్ సెంచరీకి, భారత్ విజయానికి కేవలం ఒక్క పరుగు అవసరమైన క్రమంలో సూరజ్ కుటిల నీతిని ప్రదర్శించాడనే చెప్పాలి. అప్పటికీ సెహ్వాగ్ స్ట్రైకింగ్లో ఉన్నాడు. ఈ క్రమంలో సూరజ్ బంతిని నోబాల్ వేసి సెహ్వాగ్కు శతకం పూర్తి కాకుండా చేశాడు. ఆ బంతిని సిక్స్గా మలిచిన్నప్పటికీ.. నోబాల్తో ఫలితం తేలిపోయింది. ఈ క్రమంలో సూరజ్ తీరు వివాదాస్పదంగా మారింది. సూరజ్ భారత్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అపకీర్తిపాలయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు