Suraj Randiv : ధోనీతో ఆడాడు.. సెహ్వాగ్కు నిరాశ మిగిల్చాడు.. ఇప్పుడు బస్ డ్రైవర్గా మారాడు
ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అని పెద్దలు ఊరికే అనలేదు. విధిరాత ఎలా రాసిపెట్టి ఉందో ఎవరికి తెలుసు. నిన్నటి వరకు...
ఇదీ శ్రీలంక మాజీ ఆటగాడు సూరజ్ రణ్దివ్ పరిస్థితి
(ఫొటో సోర్స్: సూరజ్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అని పెద్దలు ఊరికే అనలేదు. విధిరాత ఎలా రాసిపెట్టి ఉందో ఎవరికి తెలుసు. ముందు క్షణం వరకూ రాజులా ఓ వెలుగు వెలిగినవారే .. మరుక్షణమే బికారి అవుతారని ఎవరన్నా ఊహించగలరా..? అందుకే విధి ఆడే వింతనాటకంలో మనమంతా పావులం అని కవులు చెబుతుంటారు. ఇంతకీ ఇదంతా ఎందుకో అని అడుగుతారా..? అయితే అదేంటో తెలియాలంటే మాత్రం ఇది చదవాల్సిందే..
ప్రతి క్రికెటర్కూ గుణపాఠం..
(ఫొటో సోర్స్: సూరజ్ ట్విటర్)
క్రికెట్లో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అయితే కేవలం ఆయా బోర్డులు ఇచ్చే భత్యాలపైనే ఆధారపడాల్సి ఉండేది. కానీ, ఎప్పుడైతే భారత టీ20 లీగ్ వచ్చిందో సెలెక్ట్ అయిన ఆటగాళ్లకు కాసులపంటే పండుతోంది. ఒక్క మ్యాచ్ ఆడినా లక్షల్లో దక్కుతున్నాయి. ఆటకు వీడ్కోలు పలికితే వ్యాఖ్యాతగా మారొచ్చు. ఏదైనా లీగ్ల్లో సహాయక సిబ్బందిగా చేరే ఛాన్స్లు వస్తుంటాయి. లేకపోతే క్రికెట్ ట్రైనింగ్ ఇస్తూనైనా సంపాదించవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కొందరి పరిస్థతి మాత్రం దుర్భరంగా మారిందనేదానికి ఈ మాజీ ఆటగాడే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం తన కుటుంబం కోసం డ్రైవర్గా మారిపోయిన ఆ మాజీ క్రికెటర్ శ్రీలంకకు చెందిన సూరజ్ రణ్దివ్. లంక తరఫున 12 టెస్టులు, 31 వన్డేలు, ఏడు టీ20లు ఆడాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో దాదాపు 85 వికెట్లు పడగొట్టాడు. భారత టీ20 లీగ్లోనూ ఆడటం విశేషం. ఆకాశం ఎత్తుకు ఎదిగిన ఆటగాడు ఒక్క ఉదుటన కిందికి పడిపోయిన సూరజ్ జీవితం ప్రతి క్రికెటర్కు గుణపాఠంలాంటిదే. అతడి జీవితం ఎందుకు ఇలా మారిందో కారణాలు తెలియదు కానీ.. ప్రస్తుత తరం ఆటగాళ్లు మాత్రం పక్కాగా లైఫ్ను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ధోనీ నాయకత్వంలో..
(ఫొటో సోర్స్: సూరజ్ ట్విటర్)
2009లో లంక జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన సూరజ్ కేవలం ఏడేళ్లకే తన కెరీర్ను ముగించాల్సి వచ్చింది. 2011 వరల్డ్ కప్లో పాల్గొన్న లంక జట్టులో సభ్యుడు. అయితే ధోనీ కెప్టెన్సీలో భారత్ 2011 ప్రపంచకప్ ఫైనల్లో లంకను ఓడించి మరీ నెగ్గిన విషయం తెలిసిందే. తుదిపోరులో సూరజ్ పెద్దగా రాణించలేదనే చెప్పాలి. అయితే కేవలం రెండేళ్లకే జాతీయ జట్టులోకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకతను చాటుకొన్నాడు. దీంతో భారత టీ20 లీగ్లోకి అడుగుపెట్టే అవకాశం దక్కింది. అదీనూ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టులో స్థానం సంపాదించాడు. అయితే 2011 సీజన్లో కేవలం ఎనిమిది మ్యాచ్లను మాత్రమే ఆడాడు. ఆరు వికెట్లను తీశాడు. ఇక తర్వాతి సీజన్ నుంచి భారత టీ20 లీగ్లో మళ్లీ కనిపించలేదు.
సెహ్వాగ్కు సెంచరీ దక్కకుండా..
(ఫొటో సోర్స్: సూరజ్ ట్విటర్)
చాలా మంది క్రికెటర్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. వారు ఏ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించినా అభిమానం తగ్గదు. ఎందుకంటే మైదానంలో ఆయా క్రికెటర్ల వ్యవహారధోరణి కూడా అందుకు కారణం. కానీ కొంతమంది మాత్రం తమ దూకుడైన ప్రవర్తనతోపాటు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు ఏదైనా రికార్డు సాధిస్తే మాత్రం తట్టుకోలేనితనం ప్రదర్శిస్తే అప్రతిష్ఠపాలవుతారు. ఇలాంటి వ్యవహారమే భారత అభిమానుల ఆగ్రహానికి సూరజ్ గురయ్యేలా చేసింది. 2010లో భారత్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో ట్రైసిరీస్ జరిగింది. లీగ్ దశలో లంకను 170 పరుగులకే టీమ్ఇండియా ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (99*) అద్భుతంగా ఆడాడు. కేవలం 34.3 ఓవర్లలోనే 171 పరుగులు చేసిన భారత్ విజయం సాధించింది. అయితే ఇక్కేడ సూరజ్ అభిమానుల కోపాగ్నికి బలయ్యాడు. సెహ్వాగ్ సెంచరీకి, భారత్ విజయానికి కేవలం ఒక్క పరుగు అవసరమైన క్రమంలో సూరజ్ కుటిల నీతిని ప్రదర్శించాడనే చెప్పాలి. అప్పటికీ సెహ్వాగ్ స్ట్రైకింగ్లో ఉన్నాడు. ఈ క్రమంలో సూరజ్ బంతిని నోబాల్ వేసి సెహ్వాగ్కు శతకం పూర్తి కాకుండా చేశాడు. ఆ బంతిని సిక్స్గా మలిచిన్నప్పటికీ.. నోబాల్తో ఫలితం తేలిపోయింది. ఈ క్రమంలో సూరజ్ తీరు వివాదాస్పదంగా మారింది. సూరజ్ భారత్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అపకీర్తిపాలయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్