MS Dhoni: ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
ధోనీ ఒంటి చేత్తో సిక్స్లు కొట్టి మ్యాచ్లను ఎన్నోసార్లు గెలిపించాడు. అయితే.. ఆర్సీబీతో కీలకమైన మ్యాచ్లో అతడు కొట్టిన ఓ భారీ సిక్సే ఆ జట్టు ఓటమికి దారి తీసిందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఐపీఎల్ సీజన్లో.. ఆర్సీబీ vs చెన్నై మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫైనల్ను తలపించేలా సాగిన ఈ పోరులో చివరికి బెంగళూరు విజయం సాధించి.. ప్లేఆఫ్స్లోకి అగుడుపెట్టింది. దీంతో ఐదు సార్లు టైటిల్ గెలిచిన జట్టు.. ఈ సారి టాప్ 4లోకి చేరకుండానే వెనుదిరిగింది. అయితే.. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుపు, చెన్నై ఓటమికి మధ్య ఓ ఆసక్తికర అంశం చర్చలోకి వచ్చింది.
20వ ఓవర్లో ధోని కొట్టిన సిక్స్ కారణంగానే బెంగళూరు గెలిచిందా..? అంటే పలువురు అవుననే అంటున్నారు. మహీ సిక్స్ కొడితే మ్యాచ్ గెలవాలి.. కానీ ఓటమికి కారణమేంటని అనుకుంటున్నారా.. ఇక్కడే ఓ విషయం ఉంది. చెన్నై క్వాలిఫై కావడానికి ఆఖరి ఓవర్లో 17 పరుగులు కొట్టాలి. చివరి ఓవర్ను యశ్ దయాల్ వేశాడు. తొలి బంతిని యార్కర్ వేయడానికి ప్రయత్నించాడు. అయితే బంతి తడిగా ఉండటంతో అది లోఫుల్టాస్గా పడింది. ధోనీ తన బలాన్నంతా ఉపయోగించి దానిని 110 మీటర్ల భారీ సిక్స్గా మలిచాడు. అది ఫైన్లెగ్లో స్టేడియం రూఫ్టాప్పైకి వెళ్లింది. దీంతో మరో బంతితో ఓవర్ను కొనసాగించారు.
ఇదే ఆర్సీబీకి మేలు చేసింది. ఆ బంతి డ్రైగా ఉండటంతో యశ్ దయాల్కు పట్టు దొరికింది. మొదటి బంతికంటే మెరుగ్గా ఆ తర్వాత బాల్స్ సంధించగలిగాడు. దీంతో రెండో బంతికే ధోనీ వికెట్ దక్కింది. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడంతో.. చెన్నై 191 వద్దే ఆగిపోయింది. విజయం బెంగళూరు వైపు నిలిచింది.
ఇదే అంశంపై మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో దినేశ్ కార్తిక్ స్పందించాడు. ‘ధోని స్టేడియం ఆవలకు కొట్టిన సిక్సే ఈ మ్యాచ్లో గొప్ప విషయం. ఆ కారణంగానే మేం కొత్త బంతిని పొందాం. మెరుగ్గా బంతులు వేశాం’’ అంటూ వెల్లడించాడు. ఇక టోర్నీ మొదట్లో ప్లేఆఫ్స్పై ఎలాంటి ఆశలు లేని బెంగళూరు.. చివర్లో పుంజుకుని అనూహ్యంగా టాప్ 4లోకి చేరడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
క్లాసికల్ చెస్లో ప్రపంచ నంబరు 2 ఫాబియానో కరువానాను భారత యువ సంచలనం ప్రజ్ఞానంద ఓడించాడు. ఈ విజయంతో అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (FIDE) ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ 10లో స్థానం సంపాదించాడు. -
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగడమే తనకు తెలుసునని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
యూఎస్ఏ పిచ్లు.. హవా స్పిన్నర్లదా? పేసర్లదా?
టీ20 సందడి మళ్లీ మొదలైంది. ఈసారి ప్రపంచ సంగ్రామం. 20 దేశాలు కప్ కోసం తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. వార్మప్ మ్యాచ్లు అయిపోయి ఇప్పటికే తొలి పోరుకు ముగిసింది. ఈ క్రమంలో పిచ్లు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనే దానిపై ఓ లుక్కేద్దాం. -
కెనడాను చిత్తు చేసిన యూఎస్ఏ.. టీ20ల్లో రికార్డు విజయం
టీ20 ప్రపంచ కప్ సంగ్రామం ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య యూఎస్ఏ రికార్డు ఛేదన చేసి విజయం నమోదు చేసింది. -
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
రెండోసారి టైటిల్ను నెగ్గాలనే లక్ష్యంతో టీమ్ఇండియా టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగింది. జూన్ 5న తొలి మ్యాచ్లో ఆడనుంది. -
ప్రపంచకప్ కోసం 15 కిలోలు తగ్గి
టీ20 ప్రపంచకప్ కోసం ఉత్సాహంగా సిద్ధమైన టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) మునుపెన్నడూ లేనంత ఫిట్గా కనిపిస్తున్నాడు. -
గంభీర్ మంచి కోచ్ అవుతాడు: గంగూలీ
దరఖాస్తు చేసుకుని ఉంటే టీమ్ఇండియాకు గౌతమ్ గంభీర్ మంచి కోచ్ కాగలడని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
పడిపోదాం పొట్టి కప్పు మాయలో!
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఆకర్షణీయ టోర్నీకి రంగం సిద్ధమైంది. అభిమానులు ఎంతో ఇష్టపడే టీ20 ఫార్మాట్లో ప్రపంచకప్ ఆదివారమే శ్రీకారం చుట్టుకోనుంది. -
వార్మప్ భలే..
టీ20 ప్రపంచకప్లో అసలు పోరుకు ముందు టీమ్ఇండియాకు చక్కటి ప్రాక్టీస్ లభించింది. ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్లో శనివారం రోహిత్ సేన 62 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. -
కార్తీక్ గుడ్బై చెప్పేశాడు
అన్ని రకాల పోటీ క్రికెట్కు టీమ్ఇండియా వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అధికారికంగా గుడ్బై చెప్పేశాడు. శనివారం తన 39వ పుట్టిన రోజు సందర్భంగా రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికాడు. -
ఒలింపిక్స్ కోటాకు అడుగు దూరంలో
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాలను సొంతం చేసుకునేందుకు భారత బాక్సర్లు జైస్మిన్, సచిన్ అడుగు దూరంలో నిలిచారు. శనివారం మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ క్వార్టర్స్ చేరింది. -
భారత్ 3.. జర్మనీ 0
ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్ లండన్ అంచెను భారత్ విజయంతో ఆరంభించింది. శనివారం 3-0తో ప్రపంచ ఛాంపియన్ జర్మనీని ఓడించింది. -
సబలెంక జోరు
ఫ్రెంచ్ ఓపెన్లో రెండోసీడ్ సబలెంక జోరు మీదుంది. ఆ బెలారస్ అమ్మాయి ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. శనివారం మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సబలెంక 7-5, 6-1తో పౌలా బదోసా (స్పెయిన్)ను ఓడించింది. -
గాయత్రి జోడీ ఓటమి
సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ అద్భుత పోరాటానికి తెరపడింది. -
టీ20 ప్రపంచకప్.. బంగ్లాతో వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం
టీ20 ప్రపంచకప్నకు ముందు శనివారం బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
-
అరుణాచల్లో మళ్లీ భాజపా సర్కార్.. ఎస్కేఎందే సిక్కిం..
-
పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు