MS Dhoni: ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
ధోనీ ఒంటి చేత్తో సిక్స్లు కొట్టి మ్యాచ్లను ఎన్నోసార్లు గెలిపించాడు. అయితే.. ఆర్సీబీతో కీలకమైన మ్యాచ్లో అతడు కొట్టిన ఓ భారీ సిక్సే ఆ జట్టు ఓటమికి దారి తీసిందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఐపీఎల్ సీజన్లో.. ఆర్సీబీ vs చెన్నై మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫైనల్ను తలపించేలా సాగిన ఈ పోరులో చివరికి బెంగళూరు విజయం సాధించి.. ప్లేఆఫ్స్లోకి అగుడుపెట్టింది. దీంతో ఐదు సార్లు టైటిల్ గెలిచిన జట్టు.. ఈ సారి టాప్ 4లోకి చేరకుండానే వెనుదిరిగింది. అయితే.. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుపు, చెన్నై ఓటమికి మధ్య ఓ ఆసక్తికర అంశం చర్చలోకి వచ్చింది.
20వ ఓవర్లో ధోని కొట్టిన సిక్స్ కారణంగానే బెంగళూరు గెలిచిందా..? అంటే పలువురు అవుననే అంటున్నారు. మహీ సిక్స్ కొడితే మ్యాచ్ గెలవాలి.. కానీ ఓటమికి కారణమేంటని అనుకుంటున్నారా.. ఇక్కడే ఓ విషయం ఉంది. చెన్నై క్వాలిఫై కావడానికి ఆఖరి ఓవర్లో 17 పరుగులు కొట్టాలి. చివరి ఓవర్ను యశ్ దయాల్ వేశాడు. తొలి బంతిని యార్కర్ వేయడానికి ప్రయత్నించాడు. అయితే బంతి తడిగా ఉండటంతో అది లోఫుల్టాస్గా పడింది. ధోనీ తన బలాన్నంతా ఉపయోగించి దానిని 110 మీటర్ల భారీ సిక్స్గా మలిచాడు. అది ఫైన్లెగ్లో స్టేడియం రూఫ్టాప్పైకి వెళ్లింది. దీంతో మరో బంతితో ఓవర్ను కొనసాగించారు.
ఇదే ఆర్సీబీకి మేలు చేసింది. ఆ బంతి డ్రైగా ఉండటంతో యశ్ దయాల్కు పట్టు దొరికింది. మొదటి బంతికంటే మెరుగ్గా ఆ తర్వాత బాల్స్ సంధించగలిగాడు. దీంతో రెండో బంతికే ధోనీ వికెట్ దక్కింది. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడంతో.. చెన్నై 191 వద్దే ఆగిపోయింది. విజయం బెంగళూరు వైపు నిలిచింది.
ఇదే అంశంపై మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో దినేశ్ కార్తిక్ స్పందించాడు. ‘ధోని స్టేడియం ఆవలకు కొట్టిన సిక్సే ఈ మ్యాచ్లో గొప్ప విషయం. ఆ కారణంగానే మేం కొత్త బంతిని పొందాం. మెరుగ్గా బంతులు వేశాం’’ అంటూ వెల్లడించాడు. ఇక టోర్నీ మొదట్లో ప్లేఆఫ్స్పై ఎలాంటి ఆశలు లేని బెంగళూరు.. చివర్లో పుంజుకుని అనూహ్యంగా టాప్ 4లోకి చేరడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్