Virat Kohli : నాపై వచ్చే విమర్శలను పట్టించుకోను.. : విరాట్ కోహ్లీ
ఉప్పల్ మైదానంలో కోహ్లీ(Virat Kohli) సెంచరీ మోత మోగించాడు. దీంతో ఐపీఎల్లో ఆరు శతకాలు బాది గేల్ రికార్డును సమం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్ : తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్(SRH vs RCB)లో కింగ్ కోహ్లీ(Virat Kohli) ఉప్పల్ మైదానంలో చెలరేగి ఆడాడు. సన్రైజర్స్(Sunrisers Hyderabad) బౌలర్లను ఊచకోత కోస్తూ.. అద్భుత సెంచరీని నమోదు చేశాడు. అత్యవసరమైన విజయాన్ని అందించి జట్టు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే, ఇప్పటి వరకూ వచ్చిన విమర్శలపై మ్యాచ్ అనంతరం కోహ్లీ స్పందించాడు. బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశాడు.
‘గతంలోని గణాంకాలను నేను పట్టించుకోను. ఇది నా ఆరో ఐపీఎల్ శతకం. నేను ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నందుకు కొన్ని సార్లు నాకు నేను తగినంత క్రెడిట్ ఇచ్చుకోను. అలాగే ఇతరులు బయట నుంచి చేసే విమర్శలను నేను పట్టించుకోను. అది వారి అభిప్రాయం మాత్రమే. ఇక పరిస్థితులకు తగ్గట్లు ఆడటం గర్వంగా ఉంటుంది’ అని కోహ్లీ అన్నాడు.
ఇక మిడిల్ ఓవర్లలో నెమ్మదిస్తున్నాడన్న విమర్శలపై కోహ్లీ స్పందిస్తూ.. ఫ్యాన్సీ షాట్లు ఆడకుండా ఉండాలని.. టెక్నిక్ కట్టుబడి ఆడాలని వివరించాడు. ‘నేను ఎప్పుడూ ఫ్యాన్సీ షాట్లు ఆడే వ్యక్తిని కాను. మేం ఏడాదిలో 12 నెలలు ఆడాల్సి ఉంటుంది. ఫ్యాన్సీ షాట్లు ఆడి వికెట్ సమర్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఐపీఎల్ తర్వాత టెస్టు క్రికెట్(WTC Final) రానుంది. నా టెక్నిక్కు కట్టబడి ఉండి.. జట్టుకు విజయాలనందించడానికి మార్గాలను అన్వేషించాలి’ అని కోహ్లీ వివరించాడు.
ఇక ఈ మ్యాచ్లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో సన్రైజర్స్పై విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో తన ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి