AUS vs PAK: తొలి టెస్టులో పాక్ ఘోర పరాజయం.. ఆసీస్ను ఢీకొట్టే సత్తా టీమ్ఇండియాకే..: మైకెల్ వాన్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ (AUS vs PAK) ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ దూసుకొచ్చింది. పాక్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో (AUS vs PAK) పాకిస్థాన్ ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. 360 పరుగుల తేడాతో పాక్ను ఆసీస్ చిత్తు చేసింది. పేసర్లకు అనుకూలంగా ఉండే పెర్త్ పిచ్పై ఆసీస్ను నిలువరించడంలో పాక్ బౌలర్లు విఫలం కావడం గమనార్హం. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో ఆసీస్కు సవాల్ విసరగలిగే జట్టు భారత్ మాత్రమేనని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐపై ప్రశంసల జల్లు కురిపించాడు.
‘‘ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. నాథన్ లైయన్ 500 వికెట్ల క్లబ్లోకి చేరడం అభినందనీయం. ఆసీస్ను వారి స్వదేశంలో ఢీకొట్టగలిగే జట్టు ఏదైనా ఉందంటే అది టీమ్ఇండియానే. బీసీసీఐ నాణ్యమైన క్రికెటర్లను అందిస్తోంది’’ అని ఎక్స్ వేదికగా మైకెల్ వాన్ పోస్టు చేశాడు. దీంతో అతడు చేసిన ట్వీట్కు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు.
‘‘పోటీ అనేదానికంటే ‘ఓడించగలదు’ అనే పదం వాడితే బాగుంటుంది. గత రెండు పర్యటనల్లో ఆసీస్ను టీమ్ఇండియా చిత్తు చేసింది’’
‘‘పాక్ను ఓడించడం ఆసీస్కు కొత్తేమీ కాదు. అన్ని విభాగాల్లో పాక్పై ఆధిపత్యం ప్రదర్శించడం సర్వసాధారణం. ఇక పాక్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఆడింది’’
‘‘పాకిస్థాన్ జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వకుండా లొంగిపోయింది. ఆసీస్ అద్భుతంగా ఆడింది. మరీ ముఖ్యంగా డేవిడ్ వార్నర్ చివరి సిరీస్లో అదరగొట్టాడు’’
బాక్సింగ్ డే టెస్టుకు ఆసీస్ జట్టులో ఒక్క మార్పు
పాకిస్థాన్తో మెల్బోర్న్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు జరగనుంది. దీనిని బాక్సింగ్ డే టెస్టుగా పిలుస్తారు. ఈ మ్యాచ్ కోసం 13 మందితో కూడిన జట్టును ఆసీస్ ప్రకటించింది. తొలి టెస్టు జట్టులో ఉన్న అన్క్యాప్డ్ ప్లేయర్ లాన్స్ మోరిస్ను తప్పించింది. దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు అతడిని వదిలిపెట్టింది.
జట్టు ఇదే: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్