AUS vs PAK: తొలి టెస్టులో పాక్ ఘోర పరాజయం.. ఆసీస్ను ఢీకొట్టే సత్తా టీమ్ఇండియాకే..: మైకెల్ వాన్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ (AUS vs PAK) ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ దూసుకొచ్చింది. పాక్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో (AUS vs PAK) పాకిస్థాన్ ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. 360 పరుగుల తేడాతో పాక్ను ఆసీస్ చిత్తు చేసింది. పేసర్లకు అనుకూలంగా ఉండే పెర్త్ పిచ్పై ఆసీస్ను నిలువరించడంలో పాక్ బౌలర్లు విఫలం కావడం గమనార్హం. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో ఆసీస్కు సవాల్ విసరగలిగే జట్టు భారత్ మాత్రమేనని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐపై ప్రశంసల జల్లు కురిపించాడు.
‘‘ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. నాథన్ లైయన్ 500 వికెట్ల క్లబ్లోకి చేరడం అభినందనీయం. ఆసీస్ను వారి స్వదేశంలో ఢీకొట్టగలిగే జట్టు ఏదైనా ఉందంటే అది టీమ్ఇండియానే. బీసీసీఐ నాణ్యమైన క్రికెటర్లను అందిస్తోంది’’ అని ఎక్స్ వేదికగా మైకెల్ వాన్ పోస్టు చేశాడు. దీంతో అతడు చేసిన ట్వీట్కు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు.
‘‘పోటీ అనేదానికంటే ‘ఓడించగలదు’ అనే పదం వాడితే బాగుంటుంది. గత రెండు పర్యటనల్లో ఆసీస్ను టీమ్ఇండియా చిత్తు చేసింది’’
‘‘పాక్ను ఓడించడం ఆసీస్కు కొత్తేమీ కాదు. అన్ని విభాగాల్లో పాక్పై ఆధిపత్యం ప్రదర్శించడం సర్వసాధారణం. ఇక పాక్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఆడింది’’
‘‘పాకిస్థాన్ జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వకుండా లొంగిపోయింది. ఆసీస్ అద్భుతంగా ఆడింది. మరీ ముఖ్యంగా డేవిడ్ వార్నర్ చివరి సిరీస్లో అదరగొట్టాడు’’
బాక్సింగ్ డే టెస్టుకు ఆసీస్ జట్టులో ఒక్క మార్పు
పాకిస్థాన్తో మెల్బోర్న్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు జరగనుంది. దీనిని బాక్సింగ్ డే టెస్టుగా పిలుస్తారు. ఈ మ్యాచ్ కోసం 13 మందితో కూడిన జట్టును ఆసీస్ ప్రకటించింది. తొలి టెస్టు జట్టులో ఉన్న అన్క్యాప్డ్ ప్లేయర్ లాన్స్ మోరిస్ను తప్పించింది. దేశవాళీ క్రికెట్లో ఆడేందుకు అతడిని వదిలిపెట్టింది.
జట్టు ఇదే: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం