INDw vs ENGw: ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరీస్.. తొలి మ్యాచ్లో ఓడిన భారత్
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత్ 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ముంబయి: ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ను భారత్ పేలవంగా ఆరంభించింది. ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్పై ఇంగ్లాండ్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో షఫాలీ వర్మ (52; 42 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించగా, హర్మన్ప్రీత్ కౌర్ (26), రిచా ఘోష్ (21) పరుగులు చేశారు. స్మృతి మంధాన (6), జెమీమా రోడ్రిగ్స్ (4) తీవ్ర నిరాశపర్చారు. కనికా అహుజా (15), పుజా వస్త్రాకర్ (11*) పరుగులు చేశారు. సోఫీ ఎకిల్స్టోన్ (3/15) భారత్ను గట్టిదెబ్బ కొట్టింది. నాట్ సీవర్, సారా గ్లెన్, ఫ్రెయా కెంప్లకు తలో వికెట్ దక్కింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే సోఫియా డంక్లీ (1), కాప్సీ (0)ని రేణుకా సింగ్ వరుస బంతుల్లో పెవిలియన్కు పంపింది. రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా.. డేనియల్ వ్యాట్ (75; 47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు), నాట్ సీవర్ (77; 53 బంతుల్లో 13 ఫోర్లు) అర్ధ శతకాలతో విరుచుకుపడి ఇంగ్లాండ్కు భారీ స్కోరు అందించారు. చివర్లో అమీ జోన్స్ (23; 9 బంతుల్లో 1 సిక్స్, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ (3/27) అద్భుతంగా బౌలింగ్ చేయగా, శ్రేయాంక పాటిల్ 2, సైకా ఇషాక్ ఒక వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం