ENG vs IND: ఆ ‘తుపాన్’ మన మీదకొస్తే..!
ఒకదాని తరవాత మరొక ఇన్నింగ్స్..అలా క్రీజ్లోకి వచ్చి ఎడాపెడా బౌండరీలు బాదేయడం..స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం ..అలవోకగా శతకం పూర్తిచేయడం..ఇది వన్డే మ్యాచో, టీ20నో కాదు..సుదీర్ఘంగా ఆట సాగే టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో బ్యాటింగ్ శైలి.
ఒకదాని తరవాత మరొక ఇన్నింగ్స్..అలా క్రీజ్లోకి వచ్చి ఎడాపెడా బౌండరీలు బాదేయడం..స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం ..అలవోకగా శతకం పూర్తిచేయడం..ఇది వన్డే మ్యాచో, టీ20నో కాదు..సుదీర్ఘంగా ఆట సాగే టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో బ్యాటింగ్ శైలి.
అన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లే...
టెస్టు క్రికెట్లో 50 స్ట్రెక్రేట్ ఉండటమే గొప్ప విషయం. అలాంటిది బెయిర్ స్టో 100కి పైగా స్ట్రెక్రేట్తో పరుగులు చేస్తున్నాడు. వాస్తవానికి టెస్టు క్రికెట్లో బ్యాటర్ క్రీజ్లో కుదురుకుంటేనే రన్స్ చేయగలడు. కానీ బెయిర్స్టో స్టైల్ వేరు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అతడి ఇన్నింగ్స్లే దీనికి నిదర్శనం. లీడ్స్లోని హెడింగ్లే వేదికగా మూడో టెస్ట్లో తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసి 329 పరుగులు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 55పరుగులకే 6వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక అప్పుడు బ్యాటింగ్కు వచ్చిన జానీ బెయిర్ స్టో బౌండరీలు బాదుతూ న్యూజిలాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. జేమీ ఓవర్టన్ (97పరుగులు)తో కలిసి ఇంగ్లాండ్ స్కోరు 360పరుగులకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే జానీ 162 (24 ఫోర్లు) భారీ స్కోరు సాధించాడు.
44 బంతుల్లో 71
రెండో ఇన్నింగ్స్లో 296పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగో రోజు 39ఓవర్లకు 2వికెట్లు 183పరుగులు చేసింది. ఇంకా 113పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గెలుస్తుంది. ఈ దశలో చివరి రోజు వర్షం కారణంగా లంచ్ తర్వాత ఆట ప్రారంభమైంది. పోప్ ఔటయినా.. తరవాత జానీ షో మొదలైంది. జానీ (44 బంతుల్లో 9ఫోర్లు ,3సిక్సర్లు 71నాటౌట్) చెలరేగడంతో ఇంగ్లాండ్ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది.
92 బంతుల్లో 136
న్యూజిలాండ్తో జరిగిన రెండోటెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ లక్ష్యం 300 పరుగులు. 93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఐదో రోజు ఆటలో ఇంగ్లాండ్కు పరాభవం ఖాయం అనుకున్నారు. గట్టిగా పోరాడితే డ్రా అవుతుంది. ఇదే అందరి ఆలోచన. అయితే అప్పుడే మొదలైంది బెయిర్ ‘స్ట్రోమ్’.. 92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 136 పరుగులు చేసి డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ను అనూహ్యంగా గెలిపించాడు.
ఈ తుపాన్ మనపై విరుచుకుపడితే...
120.12 స్ట్రెక్రేట్తో 3 మ్యాచ్ల్లో 394 పరుగులు. ఇవి న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో బెయిర్ స్టో గణాంకాలు. ఈ క్యాలెండర్ ఇయర్లో జానీ 4 సెంచరీలు చేసి సూపర్ ఫామ్లో ఉన్నాడు. టీమ్ఇండియా జులై 1 నుంచి ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్తో కీలక మ్యాచ్ ఆడుతుంది. ఇటువంటి ఆటగాడిని భారత్ నిలువరించకపోతే క్షణాల్లో మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాడు. భారత్కు చారిత్రక సిరీస్ దక్కకుండా పోతుంది.
భారత్పై బెయిర్ స్టో ప్రదర్శన ( 30 ఇన్నింగ్స్లలో 803 పరుగులు , అత్యధిక స్కోరు 93). గత సిరీస్లో ఇంగ్లాండ్పై భారత బౌలర్లు బుమ్రా, షమీ, సిరాజ్ ఆధిపత్యం, బెయిర్స్టోకు భారత్ మీద రికార్డు చూస్తే ఆ తుపాను మనల్ని ఏమీ చేయలేదు అనుకోవచ్చు. ఇది గతం. అయితే బెయిర్స్టోని ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేం. వేస్తే అంతే సంగతులు. న్యూజిలాండ్ను 3-0 ఇంగ్లాండ్ క్లీన్స్వీప్ చేసిదంటే ..దానికి కారణం బెయిర్ స్టో విధ్వంసాలే.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ