IND vs AUS: ఇలాగే కొనసాగితే.. వారిద్దరి భవిష్యత్తు ప్రమాదంలో పడ్డట్లే: హాగ్
సీనియర్లు అనుభవంతో జట్టుకు అండగా నిలవాలి. కానీ, భారత క్రికెటర్లు పుజారా, విరాట్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతో వారి టెస్టు క్రికెట్ భవిష్యత్పై నీలినీడలు అలుముకున్నట్లేనని ఆసీస్ మాజీ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం జరుగుతున్న భారత్ - ఆసీస్ (IND vs AUS) టెస్టు సిరీస్ బ్యాటర్లకు ఏమాత్రం కలిసిరాలేదు. అయితే, భారత సీనియర్లు విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. పుజారా అయినా ఓ మ్యాచ్లో అర్ధశతకం సాధించాడు. కానీ, విరాట్ (Virat Kohli) మాత్రం పూర్తిగా విఫలం కావడం గమనార్హం. ఈ క్రమంలో వీరి టెస్టు భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. యువ బ్యాటర్లు తమ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వేళ కీలక ఇన్నింగ్స్లు ఆడితేనే స్థానంపై భరోసా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కూడా ఇదే రకంగా స్పందించాడు. వీరిద్దరిపై జట్టు మేనేజ్మెంట్ నిఘా పెట్టి ఉండే ఉంటుందని వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లవుతోంది. అయితే, ఐపీఎల్ 2023 16వ సీజన్ తర్వాత విరాట్ తన మునుపటి ఫామ్లోకి వస్తాడని హాగ్ తెలిపాడు.
‘‘ప్రస్తుతం భారత క్రికెట్లో ప్రతిభకు కొదవ లేదు. అయితే, సీనియర్లు పుజారా (Pujara), విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. వన్డేలు, టీ20ల్లో రాణించినప్పటికీ.. టెస్టుల్లో శతకం కోసం విరాట్కు నిరీక్షణ తప్పడంలేదు. ఇక పుజారా కూడా గొప్ప ఫామ్లో లేడు. భారీ స్కోర్లను మలచడంలో విఫలమవుతున్నాడు. అయితే, వీరిద్దరూ అద్భుతమైన టాలెంట్ ఉండి అనుభవం కలిగిన ఆటగాళ్లు. ఐపీఎల్ సీజన్ తర్వాత విరాట్ పుంజుకుంటాడని భావిస్తున్నా’’
‘‘ఒకవేళ విరాట్, పుజారా ఫామ్ అందుకోలేకపోతే తప్పకుండా వారి స్థానాల్లో యువ క్రికెటర్లకు అవకాశం రావచ్చు. ఇటీవల దేశీయ క్రికెట్లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ను జట్టులోకి తీసుకుంటారని అనుకుంటున్నా. కానీ, ఇప్పటికే చోటు కోసం ఎదురు చూస్తున్న సూర్యకుమార్ యాదవ్నే (Surya Kumar Yadav) తొలుత తీసుకునేందుకు అవకాశం ఉంది. సర్ఫరాజ్ అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, అతడు ఇంకా తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దేశీయ క్రికెట్లో రాణించాడు. అలాగే ఐపీఎల్లోనూ తన సత్తా ఏంటో చూపిస్తే జట్టులో స్థానం దక్కడం మరింత సులభమవుతుంది’’ అని హాగ్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?