IPL 2024: కామెరూన్ గ్రీన్ ట్రేడింగ్.. ఆర్సీబీకి గొప్ప ఛాయిస్ కాదు: బ్రాడ్ హాగ్
కామెరూన్ గ్రీన్ను భారీ మొత్తం వెచ్చించి ముంబయి ఇండియన్స్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ను ముంబయి ఇండియన్స్ (MI) నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొనుగోలు చేసింది. దాదాపు రూ. 17.5 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకోవడం ఐపీఎల్ (IPL) వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముంబయి కూడా హార్దిక్ను తీసుకునేందుకు అవసరమైన మొత్తం కోసం గ్రీన్ను ఇచ్చేసింది. అయితే, గ్రీన్ను ఆర్సీబీ తీసుకోవడంపై ఆసీస్ మాజీ స్టార్ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. గ్రీన్ కొనుగోలు గొప్ప నిర్ణయం కాదని వ్యాఖ్యానించాడు.
‘‘గ్రీన్ అంత విలువైన ఆటగాడా? ఆర్సీబీ లైనప్ను చూస్తే వారు తీసుకున్న నిర్ణయం గొప్పదేమీ కాదు. అయితే, ఇక్కడ కామెరూన్ గ్రీన్ టాలెంట్ను తక్కువ చేయడం లేదు. ముంబయి ఇండియన్స్ తరఫున గతేడాది మంచి ప్రదర్శన చేశాడు. అయితే, ఆర్సీబీలో ఆటగాళ్ల జాబితాను తీసుకుంటే.. ఇప్పటికే బ్యాటింగ్ లైనప్ కోసం భారీగా ఖర్చు పెట్టింది. కానీ, నాణ్యమైన బౌలర్ల కోసం తగినంత నిధులు వారి వద్ద లేవు. మీరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజేతగా నిలవాలని భావిస్తే.. బౌలర్లపైనా దృష్టిపెట్టాలి. భారీ లక్ష్యాలను కాపాడుకోవాలంటే బౌలర్ల పాత్ర అత్యంత కీలకం. కామెరూన్ గ్రీన్ ఆర్సీబీకి సరిపోయే ఆటగాడు కాదనిపిస్తోంది.
ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్యను దక్కించుకొనేందుకు గ్రీన్ను వదిలేసింది. ఇదంతా సజావుగానే సాగింది. గ్రీన్ను వేలంలోకి పంపించాలని అనుకోలేదు. కాస్త ఎక్కువైనా సరే ఆల్రౌండర్ను తీసుకోవాలని బెంగళూరు భావించింది’’ అని బ్రాడ్ హాగ్ తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన కామెరూన్ 452 పరుగులు చేశాడు. ఆరు వికెట్లు పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!