MS Dhoni: అప్పుడు జట్టులో ధోనీ ఉండాలని గంగూలీకి చెప్పాను.. కానీ : సబా కరీమ్
మహేంద్ర సింగ్ ధోని గురించి భారత మాజీ కీపర్ సబా కరీమ్ ఆస్తకికరమైన విషయాలు పంచుకున్నాడు.
ఇంటర్నెనెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni). జార్ఖండ్ డైనమైట్, ‘కెప్టెన్ కూల్’, ది ఫినిషర్గా గుర్తింపు పొందిన ధోనీ టీమ్ఇండియాకు రెండు ప్రపంచకప్లను అందించాడు. ఇలా ప్రతి అభిమాని మదిలో నిలిచిపోయాడు. ధోనీ గురించి బీసీసీఐ మాజీ సెలెక్టర్ సబా కరీమ్ (Saba Karim) తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అతడిని తొలిసారి రంజీ మ్యాచ్ (Ranji Trophy) సందర్భంగా కలిసినట్లు గుర్తు చేసుకున్నాడు. అతడి నైపుణ్యాలను చూసి అబ్బురపడినట్లు పేర్కొన్నాడు.
‘‘ధోని తన 15 సంవత్సరాల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్లో చెరగని ముద్ర వేశాడు. కెప్టెన్ కూల్.. ద ఫినిషర్గా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మలుపు ఉంటుంది. మొదటిసారిగా ధోనిని రంజీ ట్రోఫీ సందర్భంగా కలిశా. బిహార్కు రెండో ఏడాది ఆడుతున్న సమయంలో మొదటిసారి అతడిని కలిశా. రంజీ ట్రోఫీ ఆడే సమయంలో అతడు బ్యాటింగ్, కీపింగ్ చేయడం చూశాను. అతడు ఆడే తీరులో నాకు బాగా నచ్చే అంశం లాఫ్టెడ్ షాట్లు. అది స్పిన్నర్, పేసర్ ఎవరైనా సరే అద్భుతంగా భారీ షాట్లను కొట్టేవాడు. వికెట్ కీపింగ్లో అతడి నైపుణ్యాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆ సమయంలో మేమిద్దరం ఎన్నో విషయాలపై చర్చించుకునేవాళ్లం. ఇప్పటికీ ధోనీ ఆ విషయాలను గుర్తు పెట్టుకున్నాడు.
ధోనీ కెరీర్లో తొలి టర్నింగ్ పాయింట్ అక్కడే మొదలైంది. అతడి పవర్ఫుల్ బ్యాటింగ్తో వేగంగా పరుగులు రాబట్టేవాడు. ఇక ఆ ప్రదర్శనతో భారత్ A జట్టులోకి అడుగు పెట్టిన ధోనీ కెన్యా, పాకిస్థాన్తో ఆడే అవకాశాలు దక్కించుకున్నాడు. దినేశ్ కార్తీక్ ( Dinesh Karthik)కు జాతీయ జట్టులో అవకాశం రావడంతో ధోనీ ఆ స్థానంలోకి వచ్చాడు. వికెట్ల వెనుక ఎంతో చురుగ్గా ఉండే మహీ బ్యాటింగ్లోనూ రాణించాడు. ఇక అప్పటి నుంచి జాతీయ జట్టు కోసం పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభమైంది. 2004లో పాకిస్థాన్ పర్యటనకు ఎంపికయ్యే అవకాశం వచ్చినా కాస్తలో చేజారింది. అప్పుడు కెప్టెన్గా ఉన్న గంగూలీకి (Sourav Ganguly) ధోనీ గురించి చెప్పా. వికెట్ కీపర్ - బ్యాటర్గా ధోనీ సరిగ్గా సరిపోతాడని వివరించా. అయితే, గంగూలీ మాత్రం ధోనీ ఆటను చూడకపోవడంతో పాకిస్థాన్ (Pakistan) పర్యటనకు ఎంపిక కాలేకపోయాడు. అయితే, ఆ తర్వాత మాత్రం భారత్ జట్టులోకి వచ్చి సంచనాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే’’ అని సబా కరీమ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ