MS Dhoni: అప్పుడు జట్టులో ధోనీ ఉండాలని గంగూలీకి చెప్పాను.. కానీ : సబా కరీమ్
మహేంద్ర సింగ్ ధోని గురించి భారత మాజీ కీపర్ సబా కరీమ్ ఆస్తకికరమైన విషయాలు పంచుకున్నాడు.
ఇంటర్నెనెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni). జార్ఖండ్ డైనమైట్, ‘కెప్టెన్ కూల్’, ది ఫినిషర్గా గుర్తింపు పొందిన ధోనీ టీమ్ఇండియాకు రెండు ప్రపంచకప్లను అందించాడు. ఇలా ప్రతి అభిమాని మదిలో నిలిచిపోయాడు. ధోనీ గురించి బీసీసీఐ మాజీ సెలెక్టర్ సబా కరీమ్ (Saba Karim) తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అతడిని తొలిసారి రంజీ మ్యాచ్ (Ranji Trophy) సందర్భంగా కలిసినట్లు గుర్తు చేసుకున్నాడు. అతడి నైపుణ్యాలను చూసి అబ్బురపడినట్లు పేర్కొన్నాడు.
‘‘ధోని తన 15 సంవత్సరాల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్లో చెరగని ముద్ర వేశాడు. కెప్టెన్ కూల్.. ద ఫినిషర్గా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మలుపు ఉంటుంది. మొదటిసారిగా ధోనిని రంజీ ట్రోఫీ సందర్భంగా కలిశా. బిహార్కు రెండో ఏడాది ఆడుతున్న సమయంలో మొదటిసారి అతడిని కలిశా. రంజీ ట్రోఫీ ఆడే సమయంలో అతడు బ్యాటింగ్, కీపింగ్ చేయడం చూశాను. అతడు ఆడే తీరులో నాకు బాగా నచ్చే అంశం లాఫ్టెడ్ షాట్లు. అది స్పిన్నర్, పేసర్ ఎవరైనా సరే అద్భుతంగా భారీ షాట్లను కొట్టేవాడు. వికెట్ కీపింగ్లో అతడి నైపుణ్యాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆ సమయంలో మేమిద్దరం ఎన్నో విషయాలపై చర్చించుకునేవాళ్లం. ఇప్పటికీ ధోనీ ఆ విషయాలను గుర్తు పెట్టుకున్నాడు.
ధోనీ కెరీర్లో తొలి టర్నింగ్ పాయింట్ అక్కడే మొదలైంది. అతడి పవర్ఫుల్ బ్యాటింగ్తో వేగంగా పరుగులు రాబట్టేవాడు. ఇక ఆ ప్రదర్శనతో భారత్ A జట్టులోకి అడుగు పెట్టిన ధోనీ కెన్యా, పాకిస్థాన్తో ఆడే అవకాశాలు దక్కించుకున్నాడు. దినేశ్ కార్తీక్ ( Dinesh Karthik)కు జాతీయ జట్టులో అవకాశం రావడంతో ధోనీ ఆ స్థానంలోకి వచ్చాడు. వికెట్ల వెనుక ఎంతో చురుగ్గా ఉండే మహీ బ్యాటింగ్లోనూ రాణించాడు. ఇక అప్పటి నుంచి జాతీయ జట్టు కోసం పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభమైంది. 2004లో పాకిస్థాన్ పర్యటనకు ఎంపికయ్యే అవకాశం వచ్చినా కాస్తలో చేజారింది. అప్పుడు కెప్టెన్గా ఉన్న గంగూలీకి (Sourav Ganguly) ధోనీ గురించి చెప్పా. వికెట్ కీపర్ - బ్యాటర్గా ధోనీ సరిగ్గా సరిపోతాడని వివరించా. అయితే, గంగూలీ మాత్రం ధోనీ ఆటను చూడకపోవడంతో పాకిస్థాన్ (Pakistan) పర్యటనకు ఎంపిక కాలేకపోయాడు. అయితే, ఆ తర్వాత మాత్రం భారత్ జట్టులోకి వచ్చి సంచనాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే’’ అని సబా కరీమ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం. -
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి