T20 World Cup 2024: రోహిత్తో ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం అతడికే: మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ మరో నాలుగున్నర నెలల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లన్నీ తమ ఆటగాళ్లను సిద్ధం చేసుకొనే పనిలో పడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ముందు టీమ్ఇండియా చివరి అంతర్జాతీయ పొట్టి సిరీస్ను ఆడేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ బాధ్యతలు చేపట్టి జట్టును విజయపథంలో నడిపించాడు. అతడికి జోడీగా యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ బరిలోకి దిగారు. జూన్ నుంచి మొదలయ్యే ప్రపంచ కప్ ముందు భారత్ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడనున్నారు. ఇప్పటికే జట్టులోని 10 స్థానాలపై ఓ అవగాహనకు వచ్చినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే, అతడితో కలిసి మెగా సమరంలో ఎవరు ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారనేది ఆసక్తికరంగా మారింది. యశస్వి, గిల్తోపాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘యశస్వి జైస్వాల్ అందరికంటే ముందున్నాడు. శుభ్మన్ గిల్ ఇటీవల ఫామ్ను చూస్తే గొప్పగా లేదు. అందుకే యశస్వి కంటే గిల్ వెనుకబడిపోయాడు. అఫ్గాన్తో తొలి మ్యాచ్లో ఆడిన గిల్ను తర్వాతి రెండు టీ20లకు బెంచ్కే పరిమితం చేశారు. యశస్వి జైస్వాల్ రెండు మ్యాచుల్లో ఓపెనర్గా వచ్చాడు. సూపర్ ఓవర్లోనూ ఆడాడు. అతడి బ్యాటింగ్ విధానం అతడిని పక్కన పెట్టేలా లేదు. ఇందౌర్లో అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే, అతడిని జట్టు నుంచి తప్పించడం కష్టంగా మారింది’’ అని చెప్పాడు.
నేనైతే వారిద్దరిని తీసుకుంటా..
‘‘యువరాజ్ సింగ్ను శివమ్ దూబె గుర్తు చేశాడు. అతడి బ్యాటింగ్ తీరు అలా ఉంది. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించడం అద్భుతం. అఫ్గాన్తో సిరీస్లో శివమ్ ఆట తీరు చూశాం. అతడిని ఇదే స్థానంలో బ్యాటింగ్కు పంపిస్తే మంచి ప్రదర్శన చేస్తాడు. తొలి రెండు మ్యాచుల్లో క్లిష్ట సమయాల్లోనూ సూపర్ సిక్స్లు కొట్టాడు. నేనైతే ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యతోపాటు శివమ్ దూబెను ఎంపిక చేస్తా. ఐపీఎల్లో అతడి ప్రదర్శన మెరుగ్గా ఉంటే తప్పకుండా ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కించుకుంటాడు’’ అని చోప్రా అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కమలా.. మా మద్దతు మీకే
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి