Virat-Gambhir: విరాట్-గంభీర్ మధ్య తేడా అదే.. నా బెస్ట్ కెప్టెన్ అతడే: పార్థివ్ పటేల్
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ (Virat Kohli - Gautam Gambhir) మైదానంలో దూకుడుగా ఉంటారు. తమ జట్టు విజయం కోసం తుది వరకు పోరాడతారు. కానీ, వీరిద్దరిలో ఓ వ్యత్యాసం ఉందంటాడు మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్.
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీకి చెందిన ఇద్దరు బ్యాటర్లు టీమ్ఇండియాలో కలిసి ఆడారు. ఒకరు ఆటకు వీడ్కోలు పలికేసిన గౌతమ్ గంభీర్ కాగా.. మరొకరు కింగ్ విరాట్ కోహ్లీ. గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వీరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గంభీర్-విరాట్ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటో వివరించాడు. అలాగే బెస్ట్ కెప్టెన్ ఎవరనేది తెలిపాడు.
‘‘విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ గౌరవంగా ప్రవర్తించేవారే. అయితే, మైదానంలోకి దిగిన తర్వాత మాత్రం వీరు తమ జట్టు గెలవాలని బలంగా కోరుకుంటారు. దేశం కోసం ఆడేటప్పుడూ వారిలో చాలా దూకుడు కనిపిస్తుంది. అయితే, విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకొనే విధానం నచ్చుతుంది. సహచరుల్లో స్ఫూర్తి నింపుతాడు. నేను విరాట్తో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనూ ఆడా. అలాగే గంభీర్తో కలిసి చాలా ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడా. వారిద్దరిని దగ్గర నుండి గమనించా. గంభీర్ కంటే విరాట్ ఇంకాస్త ఎక్కువ దూకుడుగా ఉంటాడు’’ అని పార్థివ్ వ్యాఖ్యానించాడు.
ధోనీ అద్భుతం.. కానీ, గంగూలీనే నాకు బెస్ట్
ధోనీ నాయకత్వంలో భారత్ జట్టుకు, సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన పార్థివ్ పటేల్.. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టింది మాత్రం సౌరభ్ గంగూలీ కెప్టెన్సీలోనే. ధోనీ సారథ్యం అద్భుతమని కొనియాడుతూనే గంగూలీ కెప్టెన్సీకే పార్థివ్ మొగ్గు చూపాడు. ‘‘ఇప్పటికీ నా అత్యుత్తమ కెప్టెన్ గంగూలీనే. మనకు ధోనీ, విరాట్ కూడా విజయవంతమైన కెప్టెన్లే. ధోనీ సారథ్యం అద్భుతం. కానీ, నా తొలి సారథి అంటే కాస్త అధిక ప్రేమ ఉండటం సహజమే కదా. అందుకే, ధోనీని కాకుండా గంగూలీ వైపు మొగ్గు చూపా. సీఎస్కేలో మూడేళ్లు ఆడా. నా టెస్టు, వన్డే అరంగేట్రం గంగూలీ సారథ్యంలో చేశా. నా ఆటతీరు బాగుండటంతో ధోనీ సీఎస్కే జట్టులోకి తీసుకున్నాడు’’ అని పార్థివ్ తెలిపాడు. పార్థివ్ పటేల్ 2002లో 17 ఏళ్ల వయసులో భారత జట్టులోకి వచ్చాడు. గంగూలీ నాయకత్వంలో 15 టెస్టులు, 10 వన్డేలు ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి