Virat-Gambhir: విరాట్-గంభీర్ మధ్య తేడా అదే.. నా బెస్ట్ కెప్టెన్ అతడే: పార్థివ్ పటేల్
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ (Virat Kohli - Gautam Gambhir) మైదానంలో దూకుడుగా ఉంటారు. తమ జట్టు విజయం కోసం తుది వరకు పోరాడతారు. కానీ, వీరిద్దరిలో ఓ వ్యత్యాసం ఉందంటాడు మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్.
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీకి చెందిన ఇద్దరు బ్యాటర్లు టీమ్ఇండియాలో కలిసి ఆడారు. ఒకరు ఆటకు వీడ్కోలు పలికేసిన గౌతమ్ గంభీర్ కాగా.. మరొకరు కింగ్ విరాట్ కోహ్లీ. గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వీరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గంభీర్-విరాట్ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటో వివరించాడు. అలాగే బెస్ట్ కెప్టెన్ ఎవరనేది తెలిపాడు.
‘‘విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ గౌరవంగా ప్రవర్తించేవారే. అయితే, మైదానంలోకి దిగిన తర్వాత మాత్రం వీరు తమ జట్టు గెలవాలని బలంగా కోరుకుంటారు. దేశం కోసం ఆడేటప్పుడూ వారిలో చాలా దూకుడు కనిపిస్తుంది. అయితే, విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకొనే విధానం నచ్చుతుంది. సహచరుల్లో స్ఫూర్తి నింపుతాడు. నేను విరాట్తో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనూ ఆడా. అలాగే గంభీర్తో కలిసి చాలా ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడా. వారిద్దరిని దగ్గర నుండి గమనించా. గంభీర్ కంటే విరాట్ ఇంకాస్త ఎక్కువ దూకుడుగా ఉంటాడు’’ అని పార్థివ్ వ్యాఖ్యానించాడు.
ధోనీ అద్భుతం.. కానీ, గంగూలీనే నాకు బెస్ట్
ధోనీ నాయకత్వంలో భారత్ జట్టుకు, సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన పార్థివ్ పటేల్.. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టింది మాత్రం సౌరభ్ గంగూలీ కెప్టెన్సీలోనే. ధోనీ సారథ్యం అద్భుతమని కొనియాడుతూనే గంగూలీ కెప్టెన్సీకే పార్థివ్ మొగ్గు చూపాడు. ‘‘ఇప్పటికీ నా అత్యుత్తమ కెప్టెన్ గంగూలీనే. మనకు ధోనీ, విరాట్ కూడా విజయవంతమైన కెప్టెన్లే. ధోనీ సారథ్యం అద్భుతం. కానీ, నా తొలి సారథి అంటే కాస్త అధిక ప్రేమ ఉండటం సహజమే కదా. అందుకే, ధోనీని కాకుండా గంగూలీ వైపు మొగ్గు చూపా. సీఎస్కేలో మూడేళ్లు ఆడా. నా టెస్టు, వన్డే అరంగేట్రం గంగూలీ సారథ్యంలో చేశా. నా ఆటతీరు బాగుండటంతో ధోనీ సీఎస్కే జట్టులోకి తీసుకున్నాడు’’ అని పార్థివ్ తెలిపాడు. పార్థివ్ పటేల్ 2002లో 17 ఏళ్ల వయసులో భారత జట్టులోకి వచ్చాడు. గంగూలీ నాయకత్వంలో 15 టెస్టులు, 10 వన్డేలు ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.