Virat Kohli: మా విజయ సంకల్పానికి ఇంధనం వారి మద్దతే: విరాట్ కోహ్లీ
రెండు వారాల్లో మెగా సమరం ప్రారంభం కానుంది. అయితే, ఆ లోపు ట్రైలర్గా ఆసీస్తో భారత్ మూడు వన్డేల సిరీస్ను ఆడనుంది. తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకొని మూడో వన్డేనాటికి విరాట్ కోహ్లీ వచ్చేస్తాడు.
ఇంటర్నెట్ డెస్క్: రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన టీమ్ఇండియా (Team India).. మరోసారి స్వదేశం వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. కపిల్ సారథ్యంలో (1983) తొలిసారి, ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2011లో మరోసారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మరో పదిహేను రోజుల్లోనే మెగా సమరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) , రవీంద్ర జడేజా (Ravindra Jadeja) వరల్డ్ కప్ క్యాంపెయిన్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచకప్ ముందు ఆసీస్తో టీమ్ఇండియా వన్డే సిరీస్ను ఆడనుంది. అయితే, తొలి రెండు వన్డేలకు విరాట్, రోహిత్, హార్దిక్కు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఇటీవలే ఆసియా కప్ను గెలిచిన ఊపులో భారత్ ఉంది.
‘‘వచ్చే వరల్డ్ కప్లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. భారత అభిమానుల పదేళ్ల ఐసీసీ టైటిల్ కలను నెరవేర్చేందుకు శ్రమిస్తాం. దాదాపు 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరగనున్న టోర్నీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ఆట పట్ల అభిరుచి కలిగిన అభిమానుల మద్దతే మా విజయ సంకల్పానికి ఇంధనం. 2011లో వరల్డ్ కప్ విజేతగా నిలవడం ఇప్పటికీ మరిచిపోలేం. తప్పకుండా అభిమానుల కోసం మరోసారి అలాంటి అనుభూతిని కల్పిస్తామనే విశ్వాసం ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక వరల్డ్ కప్ పోటీల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు’’ అని విరాట్ వ్యాఖ్యానించాడు.
అంతకంటే మరేమీ అవసరం లేదు: జడేజా
‘‘క్రికెటర్గా కోట్లమంది అభిమానులు వెనుక ఉండి మద్దతు ఇస్తే అంతకంటే వచ్చే స్ఫూర్తి మరొకటి ఉండదు. వరల్డ్ కప్ విజేతగా చూడాలనుకునే అభిమానుల కోసం మా శాయశక్తులా కృషి చేస్తాం. ఇప్పుడీ వరల్డ్ కప్ క్యాపెయిన్ కూడా అదే చెబుతోంది. మొత్తం దేశంతో కలిసి మేము ప్రారంభించే ప్రయాణం. మైదానంలో మా ప్రదర్శనలతో అభిమానులను గర్వపడేలా చేయాలని నిశ్చయించుకున్నాం’’ అని రవీంద్ర జడేజా అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.