INDw vs AUSw : అమ్మాయిలూ... ప్రతీకారం తీర్చుకోవాలి.. పసిడి పట్టేయాలి!
CWG 2022: కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్ విభాగంలో టీమ్ఇండియా పతకం ఖాయం చేసుకుంది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాతో ...
భారత్, ఆసీస్ మధ్య కామన్వెల్త్ మహిళల క్రికెట్ ఫైనల్
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్ విభాగంలో టీమ్ఇండియా పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గ్రూప్స్టేజ్లో ఓడించిన ఆసీస్ను ఢీకొట్టి స్వర్ణం గెలవాలంటే టీమ్ఇండియా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదు. ఇవాళ రాత్రి 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో భారత్, ఆసీస్ జట్ల బలాలు.. అనుకూలతలు ఏంటో చూద్దాం..
ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీస్లో ఇంగ్లాండ్పై భారత్ అద్భుత విజయం సాధించింది. మరోవైపు రెండో సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ మీద గెలిచి ఆస్ట్రేలియా తుదిపోరుకు సిద్ధమైంది. గ్రూప్ స్టేజ్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైన భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. నాకౌట్ దశలో ఆసీస్ను తక్కువగా అంచనా వేయకూడదు. ఎలాంటి దశలోనైనా మ్యాచ్ను మలుపు తిప్పగల ప్లేయర్లు ఆ జట్టు సొంతం. ఒత్తిడిలో ప్రత్యర్థిపై పట్టు సాధిచంగలరు.
తొలి మ్యాచ్ గుణపాఠం నేర్చుకోవాలి..
(ఫొటో సోర్స్: ఆసీస్ మహిళా క్రికెట్ ట్విటర్)
బ్యాటింగ్లో తొమ్మిదో స్థానం వరకు పరుగులు రాబట్టే సత్తా ఆసీస్ క్రీడాకారిణులకు ఉంది. దానికి ఉదాహరణ భారత్తో జరిగిన తొలి మ్యాచే. టాప్ ఆర్డర్ను త్వరగానే పెవిలియన్కు చేర్చిన టీమ్ఇండియా కాస్త పట్టు విడవడంతో లోయర్ఆర్డర్ బ్యాటర్లు తమ జట్టును గెలిపించుకున్నారు. ఆ మ్యాచ్లో భారత్ 154/8 స్కోరు సాధించగా.. లక్ష్య ఛేదనలో ఆసీస్ 110 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అటువంటి స్థితి నుంచి మ్యాచ్ గెలవడం సాధారణ విషయం కాదు. గార్డెనర్ (52*) చివరి వరకు క్రీజ్లో ఉండి ఆసీస్ను గెలిపించింది. అందుకే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఓటమి ముప్పు తప్పదని మొదటి మ్యాచ్లోనే తేలింది.
బ్యాటింగ్, బౌలింగ్ ఫర్వాలేదు కానీ..
(ఫొటో సోర్స్: భారత మహిళా క్రికెట్ ట్విటర్)
భారత బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తున్నప్పటికీ.. ఎప్పుడు ఎలా ఆడతారో అంతుచిక్కని విధంగా ఉంది. గత సెమీస్ మ్యాచ్లోనూ ఓ దశలో ఓటమిబాట పడతారేమోనని అనిపించింది. అయితే కీలక సమయాల్లో ఓ నాలుగు ఓవర్లను కట్టుదిట్టంగా వేయడంతో ఇంగ్లాండ్ను ఓడించగలిగింది. అటు బ్యాటింగ్లోనూ ఓపెనర్ స్మృతీ మంధాన దూకుడు చూస్తే టీమ్ఇండియా స్కోరు 200కి చేరువగా వస్తుందని అంతా భావించారు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లు చేజార్చుకోవడంతో ఓ మోస్తరు (164) స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. స్వర్ణం గెలవాలంటే మాత్రం ప్రస్తుత ప్రదర్శన కంటే దూకుడైన గేమ్ను ఆడాల్సిందే. అటువైపు ప్రత్యర్థి ఆసీస్.. వారికి కాస్త పట్టు జారవిడిస్తే కోలుకోని లేనివిధంగా దెబ్బ కొడతారు. మంధానతోపాటు షఫాలీ, హర్మన్ప్రీత్, రోడ్రిగ్స్, తానియా భాటియా/యస్తికా భాటియా.. టాప్ ఆర్డర్ రాణించి ఆసీస్ ఎదుట భారీ లక్ష్యం నిర్దేశించాలి. కనీసం 180కిపైగా టార్గెట్ ఉంటే మాత్రం ఆసీస్ను నిలువరించడం భారత బౌలర్లకు తేలికవుతుంది.
మరోసారి రేణుక మ్యాజిక్ స్పెల్ కావాలి
(ఫొటో సోర్స్: భారత మహిళా క్రికెట్ ట్విటర్)
గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన స్వింగ్ బౌలర్ రేణుకా సింగ్ సెమీస్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. మూడు ఓవర్లు వేసిన రేణుక 31 పరుగులు సమర్పించి ఒక్క వికెట్టూ తీయలేకపోయింది. అయితే ఫైనల్లో ఆరంభంలోనే వికెట్ తీసి భారత్కు బ్రేక్ ఇవ్వాలి. మరోసారి స్వింగ్ మ్యాజిక్ను ప్రదర్శించాలి. మరోవైపు కరోనా నుంచి కోలుకుని వచ్చిన ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా సెమీస్లో తన స్థాయి ఆటను మాత్రం ఆడలేదు. బౌలింగ్లోనూ వికెట్ తీయలేదు. అద్భుతంగా బంతులను సంధిస్తున్న దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్ మరోసారి తమ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను ఆసీస్పై చూపించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా