INDw vs AUSw : అమ్మాయిలూ... ప్రతీకారం తీర్చుకోవాలి.. పసిడి పట్టేయాలి!
CWG 2022: కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్ విభాగంలో టీమ్ఇండియా పతకం ఖాయం చేసుకుంది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాతో ...
భారత్, ఆసీస్ మధ్య కామన్వెల్త్ మహిళల క్రికెట్ ఫైనల్
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్ విభాగంలో టీమ్ఇండియా పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గ్రూప్స్టేజ్లో ఓడించిన ఆసీస్ను ఢీకొట్టి స్వర్ణం గెలవాలంటే టీమ్ఇండియా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదు. ఇవాళ రాత్రి 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో భారత్, ఆసీస్ జట్ల బలాలు.. అనుకూలతలు ఏంటో చూద్దాం..
ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీస్లో ఇంగ్లాండ్పై భారత్ అద్భుత విజయం సాధించింది. మరోవైపు రెండో సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ మీద గెలిచి ఆస్ట్రేలియా తుదిపోరుకు సిద్ధమైంది. గ్రూప్ స్టేజ్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలైన భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. నాకౌట్ దశలో ఆసీస్ను తక్కువగా అంచనా వేయకూడదు. ఎలాంటి దశలోనైనా మ్యాచ్ను మలుపు తిప్పగల ప్లేయర్లు ఆ జట్టు సొంతం. ఒత్తిడిలో ప్రత్యర్థిపై పట్టు సాధిచంగలరు.
తొలి మ్యాచ్ గుణపాఠం నేర్చుకోవాలి..
(ఫొటో సోర్స్: ఆసీస్ మహిళా క్రికెట్ ట్విటర్)
బ్యాటింగ్లో తొమ్మిదో స్థానం వరకు పరుగులు రాబట్టే సత్తా ఆసీస్ క్రీడాకారిణులకు ఉంది. దానికి ఉదాహరణ భారత్తో జరిగిన తొలి మ్యాచే. టాప్ ఆర్డర్ను త్వరగానే పెవిలియన్కు చేర్చిన టీమ్ఇండియా కాస్త పట్టు విడవడంతో లోయర్ఆర్డర్ బ్యాటర్లు తమ జట్టును గెలిపించుకున్నారు. ఆ మ్యాచ్లో భారత్ 154/8 స్కోరు సాధించగా.. లక్ష్య ఛేదనలో ఆసీస్ 110 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అటువంటి స్థితి నుంచి మ్యాచ్ గెలవడం సాధారణ విషయం కాదు. గార్డెనర్ (52*) చివరి వరకు క్రీజ్లో ఉండి ఆసీస్ను గెలిపించింది. అందుకే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఓటమి ముప్పు తప్పదని మొదటి మ్యాచ్లోనే తేలింది.
బ్యాటింగ్, బౌలింగ్ ఫర్వాలేదు కానీ..
(ఫొటో సోర్స్: భారత మహిళా క్రికెట్ ట్విటర్)
భారత బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తున్నప్పటికీ.. ఎప్పుడు ఎలా ఆడతారో అంతుచిక్కని విధంగా ఉంది. గత సెమీస్ మ్యాచ్లోనూ ఓ దశలో ఓటమిబాట పడతారేమోనని అనిపించింది. అయితే కీలక సమయాల్లో ఓ నాలుగు ఓవర్లను కట్టుదిట్టంగా వేయడంతో ఇంగ్లాండ్ను ఓడించగలిగింది. అటు బ్యాటింగ్లోనూ ఓపెనర్ స్మృతీ మంధాన దూకుడు చూస్తే టీమ్ఇండియా స్కోరు 200కి చేరువగా వస్తుందని అంతా భావించారు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లు చేజార్చుకోవడంతో ఓ మోస్తరు (164) స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. స్వర్ణం గెలవాలంటే మాత్రం ప్రస్తుత ప్రదర్శన కంటే దూకుడైన గేమ్ను ఆడాల్సిందే. అటువైపు ప్రత్యర్థి ఆసీస్.. వారికి కాస్త పట్టు జారవిడిస్తే కోలుకోని లేనివిధంగా దెబ్బ కొడతారు. మంధానతోపాటు షఫాలీ, హర్మన్ప్రీత్, రోడ్రిగ్స్, తానియా భాటియా/యస్తికా భాటియా.. టాప్ ఆర్డర్ రాణించి ఆసీస్ ఎదుట భారీ లక్ష్యం నిర్దేశించాలి. కనీసం 180కిపైగా టార్గెట్ ఉంటే మాత్రం ఆసీస్ను నిలువరించడం భారత బౌలర్లకు తేలికవుతుంది.
మరోసారి రేణుక మ్యాజిక్ స్పెల్ కావాలి
(ఫొటో సోర్స్: భారత మహిళా క్రికెట్ ట్విటర్)
గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన స్వింగ్ బౌలర్ రేణుకా సింగ్ సెమీస్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. మూడు ఓవర్లు వేసిన రేణుక 31 పరుగులు సమర్పించి ఒక్క వికెట్టూ తీయలేకపోయింది. అయితే ఫైనల్లో ఆరంభంలోనే వికెట్ తీసి భారత్కు బ్రేక్ ఇవ్వాలి. మరోసారి స్వింగ్ మ్యాజిక్ను ప్రదర్శించాలి. మరోవైపు కరోనా నుంచి కోలుకుని వచ్చిన ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా సెమీస్లో తన స్థాయి ఆటను మాత్రం ఆడలేదు. బౌలింగ్లోనూ వికెట్ తీయలేదు. అద్భుతంగా బంతులను సంధిస్తున్న దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్ మరోసారి తమ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను ఆసీస్పై చూపించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు