Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్
ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో తలపడేందుకు టీమ్ఇండియా (IND vs SA) సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది పొట్టి కప్ నేపథ్యంలో ఈ మ్యాచ్లు అత్యంత కీలకం.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2023) కోసం టీమ్ఇండియా ఇప్పటికే సమాయత్తమవుతోంది. ఆసీస్పై ఐదు టీ20ల సిరీస్ను 4-1 తేడాతో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత అఫ్గానిస్థాన్తో మరో మూడు టీ20లలో మాత్రమే తలపడనుంది. అంతర్జాతీయంగా ఆరు మ్యాచ్లనే భారత్ ఆడుతుంది. ఇక ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆటగాళ్లు ఆడతారు. అయితే, టీ20 ప్రపంచ కప్లో జట్టు కూర్పే భారత్కు ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు. ఇప్పట్నుంచే ఆటగాళ్ల షార్ట్ లిస్ట్ను సిద్ధం చేసుకోవాలని సూచించాడు.
‘‘భారత్ విషయంలో జట్టు కూర్పే నాకు అసలైన సవాల్. మరీ ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో ఈ సమస్య ఎక్కువ. ఈసారి అంతర్జాతీయంగా ఎక్కువ మ్యాచ్లు ఆడటం లేదు. ఒకవేళ అఫ్గాన్తో పొట్టి సిరీస్లో విరాట్, రోహిత్, బుమ్రా బరిలోకి దిగుతారా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. వారి ఆటతీరును పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి. అలా కాకుండా ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ, వచ్చే ఐపీఎల్ సీజన్కు మధ్యలోనే టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించాల్సి ఉంటుంది. అప్పుడు మరింత సవాల్ అవుతుంది. అఫ్గాన్తో సిరీస్కు ముందే ఎవరెవరు అందుబాటులో ఉంటారు? ఎవరిని తీసుకోవాలనే అంచనాకు బీసీసీఐ వచ్చేస్తుందని అనిపిస్తోంది.
అత్యుత్తమ టాలెంట్ కలిగిన యువకులు భారత జట్టులో చాలా మంది ఉన్నారు. ఇందులో ఎలాంటి లోటు లేదు. అయితే, టీమ్ఇండియాకు ఉన్న ఏకైక సమస్య స్క్వాడ్ ఎంపిక. సరైన కాంబినేషన్ను ఎంచుకోవడం చాలా క్లిష్టంగా మారింది. ఎలాంటి టోర్నమెంట్ అయినా.. భారత్ వ్యూహాత్మకంగా విఫలమవుతోంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లోనూ ఇదేపరిస్థితి. టీ20 ప్రపంచకప్ 2021లోనూ పాతకాలంనాటి పొట్టి క్రికెట్ను ఆడింది. ఇక 2019 వన్డే వరల్డ్ కప్లో నాలుగో స్థానం అతిపెద్ద సమస్యగా మారిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి