Virat Kohli: విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుంది. కీలకమైన పోరులో చెన్నైపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల పాయింట్లు (14) సమమైనప్పటికీ చెన్నై (+0.392) కంటే నెట్రన్రేట్ ఎక్కువగా ఉండటంతో బెంగళూరు (+0.459) నాకౌట్కు వెళ్లిపోయింది. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ (virat kohli) కొత్త రికార్డును సృష్టించాడు. సీఎస్కేపై కేవలం 29 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. ప్రస్తుతం సీజన్లో ఇప్పటి వరకు 14 మ్యాచుల్లో మొత్తం 708 పరుగులు చేసిన కోహ్లీ వద్దే ఆరెంజ్ క్యాప్ ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే రెండు సీజన్లలో 700+ స్కోర్లు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్గా అవతరించాడు. ఓవరాల్గా రెండో ఆటగాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ (Chris Gayle) మాత్రమే ఉన్నాడు. గేల్ 2012లో 733, 2013లో 708 పరుగులు చేశాడు. వరుస సీజన్లలో ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు మరెవరూ లేరు.
మరికొన్ని ఘనతలు..
- ఈ సీజన్లో 708 పరుగులు చేసిన కోహ్లీ స్ట్రైక్రేట్ 155.60. ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్రేట్ ఇదే. ప్రస్తుత సీజన్లో తన స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చినా.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా కోహ్లీ చెలరేగిపోతున్నాడు.
- 2016 ఎడిషన్లో అతడు ఏకంగా 974 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లీ స్ట్రైక్రేట్ 152. ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు.
- ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ను విరాట్ 37 సిక్స్లతో ముగించాడు. ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ అతడే. ట్రావిస్ హెడ్ (36) రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ 2016లో మొత్తం 38 సిక్స్లు కొట్టాడు. ఈసారి ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
- గతంలోనూ మే 18 నాడు జరిగిన మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ రాణించిన సందర్భాలే ఎక్కువ. అప్పుడు 56*, 27*, 113, 100 పరుగులు చేశాడు. ఈసారి కూడా 47 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఐదు ఇన్నింగ్స్ల్లో 343 పరుగులు చేశాడు.
- భారత్ వేదికగా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీనే. తాజాగా సీఎస్కేపై ఇన్నింగ్స్తో 9000+ స్కోరును నమోదు చేశాడు. అతడి తర్వాత రోహిత్ (8,008) ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
Shubman Gill: క్రికెటర్ శుభ్మన్ గిల్ను తాను పెళ్లి చేసుకోనున్నట్లు వస్తున్న వార్తలపై టీవీ నటి రిధిమా పండిత్ స్పష్టనిచ్చింది. -
మూడేళ్లు ఆడగలిగే ఫిట్నెస్ ఉన్నా.. ఐపీఎల్కు వీడ్కోలు పలికేందుకు డీకే కారణమిదే!
టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ ఐపీఎల్కు వీడ్కోలు పలికి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దానికి కారణమేంటనేది తాజాగా వెల్లడించాడు. -
ధోనీ స్క్వాడ్ అలా.. రోహిత్ సేన ఇలా..
రెండోసారి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవాలనే లక్ష్యంతో టీమ్ఇండియా బరిలోకి దిగింది. అయితే, తొలిసారి ఛాంపియన్గా నిలిచిన ఆ జట్టుకు.. ఇప్పుడు రోహిత్ సేనకు మధ్య ఉన్న పోలికలు ఏంటో ఓ లుక్కేద్దాం.. -
పాండ్య ‘బ్యాకప్’ పేసర్.. బౌలింగ్ కాంబినేషన్ అలా ఉంటే తిరుగుండదు: గావస్కర్
రెండోసారి ఛాంపియన్గా నిలిచేందుకు భారత బరిలోకి దిగింది. మరో నాలుగు రోజుల్లో తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న పాకిస్థాన్తో కీలక పోరు జరగనుంది. -
అప్పుడు వర్కౌట్ కాలేదు.. ఈసారైనా సీనియర్లు ముందుండాలి: మంజ్రేకర్
సీనియర్లపై ఉంచిన నమ్మకాన్ని ఈసారి వమ్ము కానివ్వకుండా కప్ను అందించాలని భారత మాజీ క్రికెటర్ సూచించాడు. అలాగే పాక్తో ఇద్దరిని అడ్డుకోగలిగితే మరోసారి ఆధిపత్యం ప్రదర్శించవచ్చని పేర్కొన్నాడు. -
కిక్ అంతా ఇక్కడే..
ప్రపంచకప్ ఏదైనా ఆ రెండు జట్ల మధ్య పోరు గురించే చర్చంతా! ఆ చిరకాల ప్రత్యర్థులు తలపడితే క్రికెట్ ప్రపంచమే ఊగిపోతుంది! ఇప్పుడు టీ20 ప్రపంచకప్లోనూ అందరూ ఎదురుచూస్తోంది ఆ దాయాది దేశాల మధ్య సమరం గురించే! ఆ జట్లే.. భారత్, పాకిస్థాన్. -
భారత అభిమానుల కోసం
ఐసీసీ టోర్నీలైనా, ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్లైనా అత్యధిక ఆదాయం, ఆదరణ దక్కేది భారత్ నుంచే. -
సెమీస్లో గాయత్రి జోడీ
సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోరు కొనసాగుతుంది. -
భారత్ బంగ్లాదేశ్.. ప్రాక్టీస్ మ్యాచ్ నేడు
ఐపీఎల్లో భారత ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంఛైజీలకు ఆడారు. ఆయా జట్ల తరపున రాణించారు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్కు ముందు ఈ ఆటగాళ్లంతా జట్టుగా కలిసేందుకు, సమష్టిగా సత్తాచాటేందుకు చివరి అవకాశం. -
ప్రిక్వార్టర్స్లో గాఫ్
ఫ్రెంచ్ ఓపెన్లో అమెరికా తార కొకోగాఫ్ దూసుకెళ్తోంది. ఆమె ఎక్కువగా కష్టపడకుండానే ప్రిక్వార్టర్స్ చేరింది. -
పతాకధారిని అంటే నమ్మలేకపోయా
పారిస్ ఒలింపిక్స్లో పతాకధారిని తానేనని తెలియగానే నమ్మలేకపోయానని భారత టేబుల్టెన్నిస్ స్టార్ ఆచంట శరత్కమల్ అన్నాడు. -
నిశాంత్కు పారిస్ కోటా
భారత యువ బాక్సర్ నిశాంత్ దేవ్ పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాన్ని దక్కించుకున్నాడు. -
రిషితకు ఐటీఎఫ్ టైటిల్
ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి రిషితరెడ్డి విజేతగా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
గత ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు: పొన్నం ప్రభాకర్
-
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
-
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
-
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM