GT vs CSK: ‘1’ వారిది.. ‘71’ ఎవరిది..? ఫైనల్కు చేరే తొలి జట్టు ఏదో?
మంగళవారం నుంచి ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) ప్లేఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. తొలి క్వాలిఫయర్లో గుజరాత్, చెన్నై జట్లు (GT vs CSK) తలపడతాయి. చెపాక్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకరేమో డిఫెండింగ్ ఛాంపియన్.. మరొకరు నాలుగుసార్లు విజేతగా నిలిచిన టీమ్. ఐపీఎల్ 2023 సీజన్ (IPL 2023) కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్తోనే ప్రారంభమైంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇరు జట్లూ ఒక్కసారి కూడా తలపడే పరిస్థితి రాలేదు. దాదాపు 54 రోజుల తర్వాత మరోసారి ‘71’వ మ్యాచ్లో ఢీకొనేందుకు సిద్ధమవుతున్నాయి. అదీనూ ఫైనల్కు దూసుకెళ్లే తొలి టీమ్గా మారే అవకాశం ఉన్న మ్యాచ్ కావడం విశేషం. అయితే, ఇందులో ఓడిన జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. ఆ జట్లు ఏవి..? ఆ కీలక మ్యాచ్ ఏంటనేది...?
ఐపీఎల్ 2023 సీజన్లో (IPL 2023) ప్లేఆఫ్స్కు రంగం సిద్ధమైంది. టాప్-2లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) మధ్య చెపాక్ వేదికగా మే 23న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. సొంతమైదానం కావడంతో చెన్నై విజయం సాధించాలని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, గుజరాత్ టైటాన్స్ను ఓడించడం అంత సులువేం కాదు. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో చెన్నైపై గుజరాత్ విజయం సాధించింది.
అన్ని విభాగాల్లోనూ గుజరాత్ టాప్
హార్దిక్ పాండ్య నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ అత్యంత బలమైన జట్లలో ఒకటి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తిరుగులేని స్టార్లు ఆ జట్టు సొంతం. ఎనిమిదో స్థానం వరకు హార్డ్ హిట్టింగ్ చేసే బ్యాటర్లు ఉన్నారు. శుభ్మన్ గిల్ శతకాలు సాధిస్తూ మంచి ఫామ్లో ఉండగా.. గతంలో త్రీడీ ప్లేయర్ అంటూ విమర్శలపాలైన విజయ్ శంకర్ కూడా ఈసారి తన బ్యాట్ను ఝుళిపిస్తున్నాడు. మిడిలార్డర్లో హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా జట్టు భారం మోసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లోనూ రషీద్ఖాన్ ప్రత్యర్థులను హడలెత్తించాడు. షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, రషీద్ బౌలింగ్ దళం రాణిస్తే మరోసారి గుజరాత్కు తిరుగుండదు.
బ్యాటింగ్ ఓకే కానీ.. బౌలింగ్లోనే కాస్త..
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్లోకి చేరడానికి ప్రధాన కారణం ఎంఎస్ ధోనీ సారథ్యం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ జట్టును ఇక్కడికి తీసుకొచ్చాడు. యువ బౌలర్లతోనే అద్భుతాలు సాధిస్తున్న ధోనీ నాయకత్వంలో ఐదో టైటిల్ను అందుకోవడం చూడాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ధోనీకి చివరి సీజన్గా భావిస్తున్న వేళ.. మిగతా సహచరులు తమ శక్తిమేర రాణించాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యం కావాలంటే మాత్రం చెన్నై నాకౌట్ దశలో మరింత మెరుగ్గా రాణించాలి. గత మ్యాచ్లో (దిల్లీపై) అదరగొట్టిన ఓపెనర్లు ఈసారి కూడా దూకుడుగా ఆడాలి. అప్పుడే మిగతా బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యం ఉంటే బౌలర్లూ కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. ధోనీ ‘ఫినిషింగ్’ టచ్ ఇస్తే చెన్నై ఫైనల్కు చేరుకోవడం పెద్ద కష్టమేం కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?