IPL 2024: ఐపీఎల్ విజేత ఆ జట్టేనా? గత ఆరు సీజన్లను గమనిస్తే..!
ఐపీఎల్ 17వ సీజన్ నాకౌట్ దశ సాగుతోంది. ఇప్పటికే తొలి క్వాలిఫయర్లో గెలిచిన కోల్కతా ఫైనల్కు దూసుకెళ్లింది. మరోవైపు సన్రైజర్స్కు రెండో క్వాలిఫయర్ రూపంలో మరో అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ముగిసింది. హైదరాబాద్ను చిత్తు చేసి కోల్కతా నేరుగా ఫైనల్కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్లో సన్రైజర్స్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కేకేఆర్ ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఐపీఎల్ టైటిల్ను నెగ్గింది. చివరిగా 2014లో విజేతగా నిలిచింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్గా నిలిచే అవకాశం ముంగిట ఉంది. కచ్చితంగా తమ జట్టే ఫైనల్లోనూ విజేతగా నిలుస్తుందని కేకేఆర్ ఫ్యాన్స్ ఘంటాపథంగా చెబుతున్నారు. దానికి తమ వద్ద ఓ లెక్క ఉందని అంటున్నారు. 2018 సీజన్ నుంచి తొలి క్వాలిఫయర్గా గెలిచిన జట్టే టైటిల్ను దక్కించుకుందనేది వారి వాదన. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆ గణాంకాలు ఏంటో చూసేద్దాం..
2018లో..: సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన చేసిన సీజన్. హేమాహేమీ జట్లను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ప్లేఆఫ్స్కు చేరుకుంది. రెండో స్థానంలో సీఎస్కే ఉంది. వీరి మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్లో చెన్నైనే విజయం వరించింది. ఇక రెండో క్వాలిఫయర్లో గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, అక్కడా చెన్నై చేతిలో చుక్కెదురైంది.
2019లో..: ఈసారి కూడా తొలి క్వాలిఫయర్లో పోటీపడిన జట్లే ఫైనల్కు వచ్చాయి. అక్కడ గెలిచిన టీ ఛాంపియన్గా నిలవడం గమనార్హం. ముంబయి - చెన్నై మధ్య ఫైనల్ హోరాహోరీగా సాగింది. కేవలం ఒక్క పరుగు తేడాతోనే సీఎస్కేపై ముంబయి గెలిచింది.
2020లో..: ఈ సీజన్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ముంబయి - దిల్లీ జట్ల మధ్య జరిగింది. ముంబయి భారీ విజయంతో ఫైనల్కు చేరింది. రెండో క్వాలిఫయర్లో సన్రైజర్స్ను ఓడించిన దిల్లీ తుది పోరుకు వచ్చింది. కానీ, మరోసారి ముంబయి ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిచింది.
2021లో..: దిల్లీతో జరిగిన తొలి క్వాలిఫయర్లో చెన్నై విజేతగా నిలిచి ఫైనల్కు చేరుకుంది. పాయింట్ల పట్టికలో డీసీదే అగ్రస్థానం అయినప్పటికీ.. సీఎస్కే తుది పోరుకు చేరింది. ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2లో కోల్కతా గెలిచి ఫైనల్కు వచ్చింది. అక్కడ కేకేఆర్ను ఓడించిన చెన్నై ఛాంపియన్ అయింది.
2022లో: తొలిసారి అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్ విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది. కెప్టెన్ పాండ్య నాయకత్వంలో జీటీ ఛాంపియన్గా అవతరించింది. తొలి క్వాలిఫయర్లో రాజస్థాన్తో (18) గుజరాత్ (20) తలపడింది. ఫైనల్లోనూ వీరి మధ్య పోరు. కానీ, జీటీ గెలిచి టైటిల్ను ఎగరేసుకుపోయింది.
2023లో..: చెన్నై సూపర్ కింగ్స్ 2023 సీజన్ విజేతగా నిలిచింది. పాయింట్ల పట్టికలో గుజరాత్ (20), చెన్నై (17) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. తొలి క్వాలిఫయర్లో జీటీపై సీఎస్కే గెలిచింది. మళ్లీ ఫైనల్ వీరి మధ్య పడినపప్పటికీ.. చెన్నై విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..