T20 World Cup: టీ20 ప్రపంచకప్.. ధోనీ సేన ‘మెరుపులు’ రోహిత్ సేన మరిపించేనా..?
టీ20 ఫార్మాట్లో తొలిసారి ప్రవేశపెట్టిన ప్రపంచకప్ టైటిల్ను టీమ్ఇండియా కైవసం చేసుకొంది. ఇక ఆ తర్వాత గత టీ20 ప్రపంచకప్ వరకు ఒక్కసారి కూడానూ మన ఖాతాలో వచ్చి చేరలేదు. మరోసారి ఆసీస్ వేదికగా పొట్టి కప్ కోసం భారత్ బరిలోకి దిగింది.
టీమ్ఇండియా తొలి పొట్టి ప్రపంచకప్ను నెగ్గి 15 వసంతాలను పూర్తి చేసుకొంది. కొత్త కెప్టెన్.. కొంగొత్త ఫార్మాట్.. పదిహేను మంది సభ్యులు కలిగిన జట్టులో కేవలం ఐదుగురికి మాత్రమే కాస్త ఎక్కువ అంతర్జాతీయ అనుభవం ఉంది. కానీ అంతకుముందే జరిగిన వన్డే ప్రపంచకప్లో సచిన్-దాదా-ద్రవిడ్-లక్ష్మణ్ వంటి దిగ్గజాలతో కూడిన భారత్ ఘోర పరాభవం ఎదుర్కొంది. వాటన్నింటినీ అధిగమించి ‘కెప్టెన్ కూల్’ ధోనీ నాయకత్వంలో పాకిస్థాన్ను చిత్తు చేసి మరీ టైటిల్ను ఖాతాలో వేసుకొని భారత్ సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్రికెట్ పండగొచ్చింది. ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. 22వ తేదీ నుంచి సూపర్ 12 దశలో మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి.
ఎప్పుడో పదిహేనేళ్ల కిందట టీ20 ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత్.. తాజాగా టైటిల్ వేటలో వెనుకబడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ఇండియా ప్రపంచకప్ కోసం బరిలోకి దిగింది. తొలి మ్యాచ్ను అక్టోబర్ 23న పాకిస్థాన్తో తలపడనుంది. తొలిసారి ప్రపంచకప్ను అందుకొన్న జట్టులో సభ్యుడైన రోహిత్ శర్మ.. ఈసారి కెప్టెన్గా వ్యవహరిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు లేకపోవడం భారత్కు కాస్త ఇబ్బందిగాకరంగా మారే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడున్న జట్టులో స్టార్లకు కొదవేంలేదు. 2007 టీ20 ప్రపంచకప్ విజేత జట్టుతో పోలిస్తే ప్రస్తుత స్క్వాడ్ కాస్త పైచేయి సాధిస్తుంది. కానీ, ధోనీ నాయకత్వంలోని జట్టుకు.. ఇప్పటి రోహిత్ సేనకు మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటే కప్ను సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
అప్పట్లో అలా..
రోహిత్ సేనలో అంతా స్టార్లే..
తొలి టీ20 ప్రపంచకప్ను నెగ్గిన తర్వాత 2008లో భారత టీ20 లీగ్ వచ్చాక.. ఈ ఫార్మాట్లో కొత్త స్టార్లు పుట్టుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా లీగుల్లోనే పెద్ద సంఖ్యలో మ్యాచ్లను ఆడేశారు. టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొనే ఈ ఏడాది రోహిత్ నాయకత్వంలో భారీగా పొట్టి మ్యాచ్లను ఆడటం విశేషం. టీ20 ప్రపంచకప్-2022కు వేదిక ఆస్ట్రేలియా. ఫాస్ట్ పిచ్లతోపాటు బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా ఉంటాయి. దీంతో రోహిత్, రాహుల్, విరాట్, సూర్యకుమార్, దినేశ్ కార్తిక్, రిషభ్ పంత్, దీపక్ హుడా.. వంటి హిట్టర్లతోపాటు హార్దిక్ పాండ్య, అశ్విన్, అక్షర్ పటేల్ ఆల్రౌండర్లతో టీమ్ఇండియా బరిలోకి దిగుతోంది. అయితే ప్రదర్శనలో నిలకడలేమి ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. స్థిరంగా టోర్నీ ఆద్యంతం ఆడేది ఒకరిద్దరు మాత్రమే. మిగతావారు ఎప్పుడు ఎలా ఆడతారో అంచనా వేయడం కష్టం.
బౌలింగ్లో ప్రధాన తేడా అదే..
మరిప్పుడో..
ప్రస్తుత టీమ్ఇండియా జట్టుకు ఏకైక ఫోబియా.. 19వ ఓవర్.. ఇన్నింగ్స్లోని అన్ని ఓవర్లను అద్భుతంగా వేసే స్టార్ బౌలర్లు సైతం ఈ ఓవర్ వచ్చేసరికి ఎందుకో ధారాళంగా పరుగులు ఇచ్చేస్తారు. అది బుమ్రా, సిరాజ్, హర్షల్, భువనేశ్వర్, అర్ష్దీప్ అయినా సరే బాదుడు మాత్రం తప్పడంలేదు. ఈ ప్రపంచకప్నకు బుమ్రా దూరం కాగా.. పేస్ బౌలింగ్ దళం హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్, షమీ/సిరాజ్ చేతుల మీదుగా దాడి చేయనుంది. వీరంతా మ్యాచ్ విన్నర్లే.. కానీ, 19వ ఓవర్ వేయనంతవరకే సుమా.. ఎందుకంటే ఇటీవల ఆసియా కప్ నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ల వరకు పరిశీలిస్తే నిజమేనని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. డెత్ ఓవర్ల సమస్యను అధిగమిస్తేనే భారత్ కప్ వేటలో ముందుండే అవకాశం ఉంది. మరి ఆ బౌలర్ ఎవరు అవుతారో తెలియాలంటే వేచి చూడాలి. అంతేకాకుండా ఇటీవల నోబాల్స్ వేయడం యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్కు పరిపాటిగా మారింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లో ఒకే ఓవర్లో రెండు నోబాల్స్ వేయడం గమనార్హం.
ఫీల్డింగ్లో మెరు‘పులులే’..
‘‘శ్రీశాంత్ పట్టింది కేవలం క్యాచ్ మాత్రమే కాదు.. టీమ్ఇండియాకు ప్రపంచకప్’’ ఇవి ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలు..
ఘోర వైఫల్యం.. కోహ్లీనే నయం..?
గత కొన్ని మ్యాచ్లను పరిశీలిస్తే రోహిత్ నాయకత్వంలోని టీమ్ఇండియా ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి. చురుగ్గా ఉండే రవీంద్ర జడేజా దూరం కావడం భారత్ను మరింత కష్టాల్లో నెట్టినట్లే. యువ ఆటగాళ్లు కూడా బంతిని ఆపడంలో బాగా వెనుకబడిపోయారు. తొలి పొట్టి ప్రపంచకప్ జట్టుతో పోలిస్తే ఇప్పుడున్న ఆటగాళ్ల సగటు వయసును ఊహించలేం. ఎందుకంటే అప్పుడు సగటు కేవలం 23 ఏళ్లు మాత్రమే. అందులో ఒక్కరు కూడా 30 ఏళ్లు దాటిన ఆటగాడు లేకపోవడం గమనార్హం. కానీ, ఈసారి మాత్రం ఐదుగురు తప్పితే మిగతా అందరి వయసు 30కిపైనే. మొదటి టీ20 ప్రపంచకప్లో సభ్యులైన రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. దినేశ్ కార్తిక్ హార్డ్ హిట్టర్.. టీమ్ఇండియా సగటు వయసును చూస్తే ఆశ్చర్య పోవడం మీ వంతవుతుంది. ఎందకంటారా..? అది 30.6 కావడం విశేషం. అయితే ఇందులో ఫిట్నెస్పరంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ మాత్రమే ముందుంటారు. అందుకే గత ‘మెరుపులు’.. ఈసారి మాత్రం పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అక్కడ ధోనీ ఉన్నాడు..
దూకుడు ఉన్నా.. నిర్ణయాల్లో కనిపించదు!
ఇటీవల రోహిత్ శర్మ మైదానంలో ప్రవర్తించే తీరును చూస్తే.. సగటు అభిమాని కూడా కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నాడు. ఎందుకంటే సొంత జట్టు సభ్యులపైనే అసహనం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఏదైనా క్యాచ్ను వదిలిపెట్టినా.. ఫీల్డింగ్లో, డీఆర్ఎస్ తీసుకోవడంలో తప్పిదం జరిగినా.. వెంటనే తన ముఖ కవళికలు మారిపోతున్నాయి. ఇటీవల ఆసియా కప్లో అర్ష్దీప్ క్యాచ్ డ్రాప్ ఘటననే తీసుకొందాం.. వెంటనే తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్గా మారింది. కీలకమైన క్యాచ్ అయినప్పటికీ.. అలా ప్రవర్తిస్తే సదరు ఆటగాడి ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫెరెన్స్లో అర్ష్దీప్పై జరిగిన ట్రోలింగ్ను తప్పుబడుతూ.. యువ బౌలర్కు మద్దతుగా నిలిచాడు. ప్రత్యర్థులపై దూకుడుగా ఉంటే ఫర్వాలేదు కానీ.. సొంత ఆటగాళ్లపై ఇలా కస్సుబుస్సులాడితే మాత్రం జట్టు ప్రదర్శనపైనే ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్