IND vs ENG: ఉప్పల్ గడ్డ.. టీమ్ఇండియా అడ్డా.. టెస్టుల్లో ఓడిపోని చరిత్ర!
ఉప్పల్ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ జట్ల (IND vs ENG) మధ్య తొలి టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది.
ఓ వైపు బజ్బాల్ ఆటతీరుతో టెస్టుల్లో దూసుకెళ్తోన్న ఇంగ్లాండ్. మరోవైపు సంప్రదాయ ఫార్మాట్లో తనదైన ఆటతో సాగిపోతున్న టీమ్ఇండియా. ఇక సొంత గడ్డపై భారత్కు (IND vs ENG) తిరుగే లేదు. ప్రపంచ క్రికెట్లో బలమైన ఈ రెండు జట్ల మధ్య ఇప్పుడు టెస్టు సమరానికి సమయం ఆసన్నమవుతోంది. స్వదేశంలో అయిదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్తో భారత్ తలపడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఈ సిరీస్ టీమ్ఇండియాకు ఎంతో కీలకం. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఈ సిరీస్పై పడింది. తొలి టెస్టు గురువారమే (ఈనెల 25న) హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఆరంభమవుతుంది. ఇక్కడి రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. టీమ్ఇండియాకు పెట్టని కోట. టెస్టుల్లో మన జట్టు ఇక్కడ ఓడిందే లేదు.
అన్నీ భారీ విజయాలే..
2005లో తొలిసారి ఉప్పల్లో వన్డే.. మరో ఐదేళ్ల తర్వాత మొదటి టెస్టు మ్యాచ్ జరిగింది. ఇప్పటివరకూ అయిదు టెస్టులాడిన టీమ్ఇండియా నాలుగు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించింది. ఓ మ్యాచ్ను డ్రా చేసుకుంది.
- 2010లో ఉప్పల్ జరిగిన తొలి టెస్టు (భారత్, న్యూజిలాండ్ మధ్య) డ్రాగా ముగిసింది. హర్భజన్ సింగ్ (111 నాటౌట్) అజేయ సెంచరీ సాధించాడు.
- 2012లో న్యూజిలాండ్పైనే ఇన్నింగ్స్, 115 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సొంతం చేసుకుంది. పుజారా (159) ఈ మ్యాచ్లో మెరిశాడు. మ్యాచ్లో అశ్విన్ 12 వికెట్లు పడగొట్టాడు.
- 2013లో ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్, 135 పరుగుల తేడాతో టీమ్ఇండియా చిత్తు చేసింది. పుజారా (204) డబుల్ సెంచరీ చేశాడు.
- 2017లో బంగ్లాదేశ్తో ఏకైక టెస్టులో 208 పరుగుల తేడాతో భారత్ నెగ్గింది. తొలి ఇన్నింగ్స్లో కోహ్లి (204) డబుల్ సెంచరీతో చెలరేగాడు.
- 2018లో వెస్టిండీస్తో టెస్టులో 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్లో పంత్ (92), రహానె (80), పృథ్వీ షా (70) సత్తా చాటారు. ఉమేశ్ యాదవ్ మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టాడు.
కోహ్లికి ఫేవరెట్..
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉప్పల్ మైదానం ఫేవరెట్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. ఇక్కడ అతని ప్రదర్శనే అందుకు నిదర్శనం. టెస్టుల్లో 5 ఇన్నింగ్స్ల్లో 75.80 సగటుతో 379 పరుగులు చేశాడు. ఓ డబుల్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి తనకు అచ్చొచ్చిన వేదికలో ఈసారి మ్యాచ్ ఆడటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ ఈ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ప్రకటించింది. ఇప్పుడు జట్టులో లేని వెటరన్ టెస్టు బ్యాటర్ పుజారాకు ఇక్కడ గొప్ప రికార్డు ఉంది. 5 ఇన్నింగ్స్ల్లో అతను 127.50 సగటుతో 510 పరుగులు సాధించాడు. అతనూ ఓ ద్విశతకం చేశాడు.
ఇక బౌలింగ్లో చూసుకుంటే ఉప్పల్లో స్పిన్నర్లదే ఆధిపత్యం. ఇప్పటివరకూ టెస్టుల్లో ఇక్కడ అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లలో నలుగురు స్పిన్నర్లే. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ (8 ఇన్నింగ్స్ల్లో 27 వికెట్లు)కు ఇక్కడి పిచ్ తలొంచిందనే చెప్పాలి. ఎలా కావాలంటే అలా బౌలింగ్ చేస్తూ అశ్విన్ వికెట్ల వేట కొనసాగించాడు. ఆ తర్వాత వరుసగా జడేజా (15), ఉమేశ్ యాదవ్ (15), ప్రజ్ఞాన్ ఓజా (9), హర్భజన్ సింగ్ (7) ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్లోనూ హైదరాబాద్లో టీమ్ఇండియా విజయఢంకా మోగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక్కడ తమ ఆటతో అలరించి, ఇంగ్లాండ్ను చిత్తు చేసి, సిరీస్ను ఘనంగా ఆరంభిస్తే హైదరాబాదీలకు అంతకుమించిన ఆనందం ఉండదు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!