IPL 2023 : ఈ ఆటగాళ్లకు ఇదే చివరి ఐపీఎల్ సీజనా..?
పలువురి ఆటగాళ్లకు ఈ ఐపీఎల్(IPL 2023) చివరి సీజన్ అయ్యే అవకాశం ఉంది. వీరిలో ధోనీ(MS Dhoni) పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా.. మిగతా ఆటగాళ్లెవరో తెలుసుకుందామా..
ఇంటర్నెట్డెస్క్ : ఈ ఐపీఎల్(IPL 2023) సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్కు ఉత్కంఠ పెంచుతూ.. అసలుసిసలు క్రికెట్ మజాను పంచుతోంది. ఇక ఆయా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన చూసి.. వారి అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. మరోవైపు పలువురు ఆటగాళ్ల రిటైర్మెంట్ వార్తలు.. అభిమానులను కలవరపెడుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల ప్రతి సీజన్కు ముందు చెన్నై సారథి ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.
ఈ వార్తల వెనక ప్రధాన కారణం.. ఆటగాళ్ల వయసు. వయసు పెరుగుతున్న కొద్దీ.. వారికి ఫిట్నెస్తోపాటు.. మునుపటి ఫామ్ను కొనసాగించడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ధోనీతోపాటు ఇదే చివరి ఐపీఎల్ అయ్యే అవకాశమున్న పలువురు ప్రముఖ ఆటగాళ్లపై ఓ లుక్కేస్తే..
- ఎంఎస్ ధోనీ (MS Dhoni).. భారత క్రికెట్ చరిత్రలో ఈ పేరే ఓ సంచలనం. ఇటు ఐపీఎల్లోనూ నాలుగు ట్రోఫీలు తన జట్టుకు అందించి ఉత్తమ సారథిగా కొనసాగుతున్నాడు. గత సీజనే చివరిదంటూ వార్తలు వచ్చాయి. అయితే.. 41 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్గా ఉండి, అద్భుతమైన వ్యూహాలతో చెన్నై జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. వయసు రీత్యా.. ఇదే చివరి ఐపీఎల్ అంటూ పలువురు మాజీలు పేర్కొంటున్నారు. అయితే.. ధోనీ లేని చెన్నై జట్టును ఊహించుకోవడం అభిమానులకు కష్టమే.
- అమిత్ మిశ్రా(Amit Mishra).. బంతులను సుడులు తిప్పుతూ.. బ్యాటర్లను ఇబ్బంది పెట్టే లెగ్ స్పిన్నర్లలో అమిత్ మిశ్రా ఒకరు. ప్రస్తుత సీజన్లో లఖ్నవూకు ఆడుతున్న అమిత్.. అద్భుత ప్రదర్శనలు ఎన్నోసార్లు ఇచ్చాడు. ఇప్పటి వరకూ 156 మ్యాచ్ల్లో 169 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో మూడు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఏ జట్టుకు ఆడినా.. మంచి ప్రదర్శనే ఇస్తాడు. ప్రస్తుతం 40 ఏళ్లకు చేరిన మిశ్రాకు ఇదే చివరి ఐపీఎల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
- దినేశ్ కార్తిక్(Dinesh Karthik).. ఈ ఐపీఎల్ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నప్పటికీ.. గత సీజన్లలో మంచి ప్రదర్శనే ఇచ్చాడు బెంగళూరు వికెట్ కీపర్, బ్యాట్స్మన్ దినేశ్ కార్తిక్. ఫినిషర్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. కోల్కతా జట్టుకు కెప్టెన్గా కూడా కొంత కాలం వ్యవహరించాడు. 37 ఏళ్ల ఈ ఆటగాడు వచ్చే సీజన్ నుంచి ఆడకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వ్యాఖ్యాతగా మారిన డీకే.. అదే కొనసాగించే అవకాశాలు లేకపోలేదు.
- ఇషాంత్ శర్మ(Ishant Sharma).. దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడైన ఇషాంత్ శర్మ.. చివరి సారిగా ఆ జట్టుకు 2021 సీజన్లో ఆడాడు. ఆ తర్వాత కూడా అతడు దిల్లీ జట్టులో భాగమైనప్పటికీ.. తుది జట్టులోకి మాత్రం రావడం లేదు. గత సీజన్లో అతడిని రూ.50 లక్షలకు వేలంలో దక్కించుకుంది. ఇప్పటి వరకూ 93 మ్యాచ్లు ఆడిన ఇషాంత్.. 72 వికెట్లు పడగొట్టాడు. బహుశా ఈ సీజనే అతడికి ఆఖరిదయ్యే అవకాశం ఉంది.
- అంబటి రాయుడు(Ambati Rayudu).. అద్భుతమైన ప్రదర్శనలతో చెన్నైకి ఎన్నో విజయాలను అందించాడు అంబటి రాయుడు. 180 ఇన్నింగ్స్లు ఆడి నాలుగు వేలకుపైగా పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, 22 అర్ధ శతకాలు ఉన్నాయి. గత ఐపీఎల్ సీజన్లోనే తన రిటైర్మెంట్పై ట్వీట్ చేసి.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే.. అతడి మదిలో రిటైర్మెంట్పై ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం అతడి ప్రదర్శన చూస్తుంటే.. ఈ సీజనే అతడికి ఆఖరిది కానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్లు. రాజకీయరంగ ప్రవేశం చేస్తాడనే వార్తలూ వచ్చాయి. అయితే వీటిపై రాయుడు అధికారికంగా స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్