IND vs NZ: భారత్-కివీస్ తొలి సెమీస్.. వీరి ఆటపై ఓ కన్నేయండి!
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) నాకౌట్ దశకు సమయం ఆసన్నమవుతోంది. బుధవారం ముంబయిలోని వాంఖడే వేదికగా తొలి సెమీఫైనల్ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2023) తొలి సెమీస్కు భారత్-న్యూజిలాండ్ (IND vs NZ) జట్లు సన్నద్ధమవుతున్నాయి. అజేయంగా టీమ్ఇండియా నాకౌట్ దశకు చేరుకోగా.. మరో మూడు జట్లతో పోటీపడి మరీ కివీస్ నాలుగో స్థానంతో సెమీఫైనల్ బెర్తును దక్కించుకుంది. లీగ్ దశలో ఇప్పటికే న్యూజిలాండ్ను భారత్ ఓడించిన సంగతి తెలిసిందే. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు అదరగొట్టేస్తున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా పలువురి మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.
రోహిత్ శర్మ VS ట్రెంట్ బౌల్ట్
ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్లో భారత ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శిస్తూ వస్తున్నాడు. వేగంగా పరుగులు చేస్తూ మంచి ఆరంభం ఇవ్వడం వల్ల మిగతా బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించాడు. ఇలానే 9 మ్యాచుల్లో 503 పరుగులు చేసేశాడు. మరోవైపు అతడికి కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. లెఫ్ట్ఆర్మ్ పేసర్ అయిన బౌల్ట్ 13 వికెట్లు తీశాడు. పవర్ప్లేలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేయగలడు. ఇలాంటి బౌల్ట్ను రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభంలో అడ్డుకోగలిగితే చాలు టీమ్ఇండియా ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం.
విరాట్ కోహ్లీ VS మిచెల్ శాంట్నర్
వన్డే ప్రపంచకప్లో టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీ. తొమ్మిది ఇన్నింగ్స్ల్లో 99 సగటుతో 594 పరుగులు చేశాడు. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చే శుభారంభాలను కొనసాగించే బాధ్యతను విరాట్ కోహ్లీ తీసుకుంటున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు, ఐదు అర్ధశతకాలు సాధించాడు. ప్రస్తుతం వన్డేల్లో 49 శతకాలతో కొనసాగుతున్న విరాట్ మరో సెంచరీ బాదేస్తే చూడాలనేది అభిమానుల ఆకాంక్ష. అయితే, కోహ్లీకి కివీస్ లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ నుంచి సవాల్ తప్పదు. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఎడమచేతివాటం బౌలర్ వాండర్ మెర్వ్ బౌలింగ్లోనే కోహ్లీ ఔటయ్యాడు. సెమీస్లో కివీస్ బౌలర్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే శాంట్నర్ 16 వికెట్లు పడగొట్టాడు.
రచిన్ రవీంద్ర VS బుమ్రా
భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. తొమ్మిది మ్యాచుల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఆరంభంలో వికెట్లు తీసి జట్టుకు బ్రేక్ ఇస్తూ వచ్చాడు. ఇక సెమీస్లోనూ ఇదే ప్రదర్శనను అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, కివీస్ ఓపెనర్లు డేవన్ కాన్వే, రచిన్ రవీంద్రను ఎలా అడ్డుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. అత్యధిక పరుగుల జాబితాలో రచిన్ రవీంద్ర 565 పరుగులు సాధించాడు. మూడు సెంచరీలూ ఉన్నాయి. మరో ఓపెనర్ డేవన్ కాన్వే పెద్దగా ఫామ్లో లేకపోయినా.. డేంజరస్ బ్యాటర్ అనడంలో సందేహం లేదు. ఐపీఎల్లో ఆడిన అనుభవమూ అతడి సొంతం.
డారిల్ మిచెల్ VS రవీంద్ర జడేజా
పేసర్లు ఆరంభంలో వికెట్లు తీయగా.. మిడిల్ ఓవర్లలో కుల్దీప్తో కలిసి రవీంద్ర జడేజా వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఈ వరల్డ్ కప్లో ఇప్పటికే 16 వికెట్లు తీశాడు. కీలక భాగస్వామ్యాలను విడగొడుతూ బ్రేక్ ఇస్తూ ఉంటాడు. అయితే, న్యూజిలాండ్ టాప్ ఆర్డర్లో డారిల్ మిచెల్ కీలక ఆటగాడు. దూకుడుగా ఆడుతూ పరుగులు రాబడతాడు. 9 మ్యాచుల్లో 418 పరుగులు నమోదు చేశాడు. మిచెల్ బ్యాటింగ్కు జడేజా స్పిన్ బౌలింగ్ మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. అదేవిధంగా గ్లెన్ ఫిలిప్స్, టామ్ లేథమ్ను కూడా నిలువరించాల్సిన బాధ్యత కుల్దీప్-జడ్డూ స్పిన్ ద్వయం మీదనే ఉంది.
కేఎల్ రాహుల్, శ్రేయస్ VS లాకీ ఫెర్గూసన్
భారత మిడిలార్డర్ ఈ టోర్నీలో అదరగొట్టేస్తోంది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గత మ్యాచ్లో నెదర్లాండ్స్పై శతకాలతో చెలరేగిపోయారు. శ్రేయస్ 9 మ్యాచుల్లో 421 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్ 347 పరుగులు చేశాడు. కానీ, వీరికి కివీస్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. మిచెల్ శాంట్నర్తోపాటు మిడిల్ ఓవర్లలో లాకీ తన పదునైన బౌలింగ్తో బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. ప్రస్తుత వరల్డ్ కప్లో లాకీ ఆరు మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టాడు. నిలకడగా 145 నుంచి 150 కి.మీ వేగంతో బంతులను సంధించగల సత్తా ఫెర్గూసన్ సొంతం.
కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ VS భారత బౌలింగ్
అయితే, కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఏమాత్రం పట్టువదిలినా మొదటికే మోసం వస్తుంది. మిగతా బ్యాటర్లు ఏదో బంతికి ఉత్సాహపడి ఔటయ్యే అవకాశం ఉంది. కానీ, కేన్ మాత్రం ఆరంభం నుంచి ఎలా ఆడతాడో భారీ ఇన్నింగ్స్ తర్వాత కూడానే అదే నింపాదిగా పరుగులు రాబడుతాడు. అయితే, ఎక్కడ గేర్ మార్చాలో బాగా తెలిసిన బ్యాటర్. అతడిని క్రీజ్లో కుదురుకోనీయకుండా చేయాల్సిన కఠిన బాధ్యత భారత బౌలర్లపై ఉంది. ఈ టోర్నీలో ఆడిన మ్యాచ్లు తక్కువే కానీ. క్రీజ్లో పాతుకుపోతే మాత్రం ఓ పట్టాన పెవిలియన్కు చేరడు. కాబట్టి, వన్డౌన్లో వచ్చే కేన్ను త్వరగా ఔట్ చేస్తే మ్యాచ్పై పట్టు సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!