Dinesh Karthik: టీమ్ఇండియాలో అతడే కీలక ప్లేయర్.. కోహ్లీ, రోహిత్కు నో ఛాన్స్
ప్రపంచకప్లో టీమ్ఇండియాకు కీలకంగా మారే ఆటగాడి పేరుని దినేశ్ కార్తిక్ వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే తమ ఇళ్లకు చేరుకున్న టీమ్ఇండియా ఆటగాళ్లు.. ఐపీఎల్-16 సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఆర్సీబీ శిబిరంలో చేరిపోయాడు. మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్.. దాదాపు రెండు నెలలపాటు జరగనుంది. ఈ ఏడాదే ప్రపంచకప్ కూడా జరగనుండటంతో కీలక ఆటగాళ్ల పనిభార నిర్వహణపై టీమ్ఇండియా దృష్టిపెట్టింది. ఈ విషయంలో ఫ్రాంచైజీలకు సూచనలు చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రధాన ఆటగాళ్లను కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉంచేలా బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలిచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్లో టీమ్ఇండియాకు కీలకంగా మారే ఆటగాడి పేరుని దినేశ్ కార్తిక్ వెల్లడించాడు. అయితే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలలో ఒక్కరి పేరును కూడా డీకే చెప్పలేదు. ఇంతకీ దినేశ్ కార్తిక్ చెప్పిన ఆటగాడు ఎవరో తెలుసా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.
‘టీమ్ఇండియా లైనప్లో హార్దిక్ పాండ్య నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైన ఆటగాడు. ఎందుకంటే అతడు బ్యాటింగ్, బౌలింగ్లో రాణించగలడు. మీడియం పేసర్గా ఉంటూ బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఉండటం చాలా కష్టం. జట్టులో ఇద్దరు, ముగ్గురు స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను పొందడం చాలా కష్టం. హార్దిక్ మిడిల్ ఆర్డర్లో బాగా బ్యాటింగ్ చేస్తాడు. బౌలింగ్ విషయానికొస్తే వికెట్లు రాబట్టడానికి ప్రణాళిక రూపొందించుకున్నట్లు కనిపిస్తోంది. అతడు బౌలింగ్ చేసే విధానం గమనిస్తే ఎప్పుడూ షార్ట్ బంతుల కోసం ప్రయత్నిస్తాడు. కానీ ఫుల్ లెంగ్త్ బౌలింగ్ చేయడం ఎప్పుడైతే ప్రారంభించాడో బ్యాటర్ తన భారమంతా బ్యాక్ ఫుట్పై పెట్టి షార్ట్ బంతుల కోసం చూస్తుంటాడు. ఆ సమయంలో నిదానంగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. హార్దిక్ పాండ్య టీమ్ఇండియాకు కీలకం. అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే దానిపై జట్టు నిర్మాణం ఆధారపడి ఉంటుంది. ఫామ్లో ఉంటే హార్దిక్ టీమ్ఇండియాకు కీలక ఆటగాడు’ అని డీకే వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్