Sachin - Razzak: వీరే డేంజరస్ బ్యాటర్లు.. సచిన్కు రెండో ర్యాంక్.. అతడిదే తొలి స్థానం: రజాక్
భారత్, పాకిస్థాన్ మ్యాచ్లో తమ జట్టే పైచేయి సాధించాలని అభిమానులు ఆశిస్తుంటారు. అలాగే ఆటగాళ్లూ పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగి విజయం సాధించాలని కోరుకుంటారు. ఇరువైపులా అత్యుత్తమ ఆటగాళ్లు ఉంటే.. ఆ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం. పాక్ బౌలింగ్ను భయపెట్టిన క్రికెట్ దిగ్గజాల్లో సచిన్, సెహ్వాగ్ తప్పక ఉంటారు.
ఇంటర్నెట్ డెస్క్: దాయాదుల పోరంటే.. భారత బ్యాటర్లకు పాకిస్థాన్ బౌలర్లకు మధ్య జరిగే రసవత్తరమైన సంగ్రామం. సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడ్.. వంటి దిగ్గజాలను వసీం అక్రమ్, వకార్ యూనిస్, అక్తర్, అబ్దుల్ రజాక్, సక్లయిన్ ముస్తాక్, షాహిద్ అఫ్రిది తమ బౌలింగ్తో అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ఐసీసీ టోర్నమెంట్లలో పాక్పై భారత్ ఆధిపత్యం ప్రదర్శించగా.. ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం దాయాది దేశానిదే ఆధిక్యం. ప్రపంచ స్థాయి బౌలర్లను వణికించిన భారత బ్యాటర్ ఎవరంటే మాత్రం ఠక్కున సచిన్ పేరును చెబుతారు. కానీ, పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ మాత్రం సచిన్కు రెండో స్థానం కేటాయించాడు. మరి, పాక్ బౌలర్లకు డేంజరస్ బ్యాటర్గా మారిన ఆటగాడు మాత్రం వీరేంద్ర సెహ్వాగ్ అట. తాను ఆడిన సమయంలో మిడిలార్డర్లో యువరాజ్ సింగ్ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని రజాక్ పేర్కొన్నాడు.
‘‘పాకిస్థాన్ జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ అత్యంత ప్రమాదకారి. అతడి తర్వాత సచిన్ తెందూల్కర్. వీరిద్దరిని ఔట్ చేయడం కోసం పాక్ బౌలర్లు ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్ధం చేసుకొనేవారు. వీరద్దరిని త్వరగా ఔట్ చేస్తే మ్యాచ్ను మేం గెలిచినట్లే. ఇక బౌలింగ్లో జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ను ఎదుర్కోవడంలో మా బ్యాటర్లు పక్కా ప్లాన్తో బరిలోకి దిగేవారు. అయితే, భారత మిడిలార్డర్లో యువరాజ్ సింగ్ డేంజరస్. సచిన్ - సెహ్వాగ్ జోడీ తర్వాత యువీ కీలకం. వీరిని ఔట్ చేసిన రోజు.. ఇవాళ కీలక వికెట్లు తీశాం అని అనుకొనేవాళ్లం. వారిని త్వరగా పెవిలియన్కు చేర్చడానికి పాక్ మేనేజ్మెంట్ సీరియస్గా దృష్టిపెట్టేది. ఎలా బౌలింగ్ చేయాలి.. ఫీల్డింగ్ను ఏ విధంగా సెట్ చేయాలి..? అనే అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేసుకొని బరిలోకి దిగేవాళ్లం. ఇలాగే జహీర్, భజ్జీ, ఇర్ఫాన్ను ఎదుర్కోవడానికి మా బ్యాటర్లు సమయాత్తమయ్యేవారు’’ అని రజాక్ తెలిపాడు.అబ్దుల్ రజాక్ పాక్ తరఫున 46 టెస్టులు, 286 వన్డేలు, 32 టీ20 మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో 5వేలకుపైగా పరుగులు.. 250కిపైగా వికెట్లు తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?