IND vs PAK: ఇదేం పద్ధతి.. ఓడిపోతే సంబరాలు చేసుకోవడమా?: భారత్-పాక్ దిగ్గజాల అసహనం
దాయాదుల మధ్య (IND vs PAK) పోరంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. కానీ, ఇరు జట్లు వేరే టీమ్లతో ఆడి ఓడిపోయినా ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం వింతగా అనిపిస్తోందని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2023) భారత్ ఫైనల్లో ఓటమిని చవిచూసింది. దాయాది దేశం పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. భారత్-పాకిస్థాన్ (IND vs PAK) మధ్య మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తే ఆ జట్టు అభిమానులు సంబరాలు చేసుకోవడం మామూలే. కానీ, భారత్ ఇతర జట్టుపై ఓడిపోతే పాక్ అభిమానులు.. అలాగే పాక్ ఓడితే భారత్లోని కొందరు అభిమానులు సంబరాలు చేసుకోవడంపై దాయాది దేశాల క్రికెట్ దిగ్గజాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ అభిమానులు కౌంటర్లు ఇచ్చుకోవడమూ సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇలా ఫ్యాన్స్ పోట్లాడుకోవడం మంచి పద్ధతి కాదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, పాక్ మాజీ స్టార్ వసీమ్ అక్రమ్ సూచించారు.
‘ఇక్కడ నేను ఎవరి పేరును ప్రత్యేకంగా చెప్పట్లేదు. కానీ, ఇరు దేశాల నుంచి పలువురు ప్రముఖులు మాత్రం అవాకులు, చెవాకులు పేలారు. వారి వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఎవరి దేశంపై వారికి భక్తి ఉండటం సహజం. ప్రతి ఒక్కరూ కొన్ని సమయాల్లో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటప్పుడు అవమానపరిచినట్లు ప్రవర్తించడం సరైంది కాదు. గేమ్ను గేమ్లానే చూడాలి’’ అని వసీమ్ అక్రమ్ వ్యాఖ్యానించాడు.
ఇదంతా నెగెటివ్ యాటిట్యూడ్: గంభీర్
పాక్ క్రికెట్ దిగ్గజం చేసిన వ్యాఖ్యలకు గౌతమ్ గంభీర్ మద్దతు తెలిపాడు. ‘‘మీ అభిమాన జట్టు విజయం సాధించినప్పుడు చేసే సంబరాలపై దృష్టిపెట్టాలి. అంతేకానీ, ఇతర జట్లు ఓడిపోయినా దానిని సెలబ్రేట్ చేసుకోవడం మంచి పద్ధతి కాదు. పక్క జట్టు ఓటమిని కూడా ఎంజాయ్ చేయాలనుకోవడం సంస్కారం కాదు. భారత్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత పాక్లోని కొందరు ఆనంద పడ్డారు. అలానే పాక్ లీగ్లోనే ఇంటిముఖం పట్టినప్పుడు భారత్లోనూ పలువురు సంబరాలు చేసుకున్నారు. ఇదంతా నెగెటివ్ యాటిట్యూడ్. ఇలాంటి విధానం మారాలి. కనీసం క్రీడలకు సంబంధించిన వ్యవహారాల్లోనైనా మినహాయింపు ఇవ్వాలి.
మన గెలుపును ఆస్వాదించాలి. ఇతరుల ఓటమిని కాదు. దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? క్రీడాస్ఫూర్తితో ఉండే ఎవరూ దానిని ప్రోత్సహించరు. కొంతమంది కేవలం సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికే ఇలా చేస్తుంటారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. మరోసారి భారత్- పాకిస్థాన్ జట్లు తలపడేందుకు అవకాశం ఉంది. ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారు. అప్పుడు సంబరాలు చేసుకుంటే ఓ అర్థముంటుంది. కానీ, ఇతర జట్లపై ఓడినా ఎంజాయ్ చేస్తామంటే సరికాదు’’ అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు