Sreesanth-Gambhir: సహచరులతో గొడవపడతాడు.. సీనియర్లకు గౌరవం ఇవ్వడు: గంభీర్పై శ్రీశాంత్
‘లెజెండ్ లీగ్ క్రికెట్’లో ఇద్దరు మాజీల మధ్య కవ్వింపు ఘటన చోటు చేసుకొంది. వారిద్దరూ భారత జట్టు మాజీలే కావడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: తాజాగా లెజెండ్ లీగ్ క్రికెట్ (LLC)లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ మధ్య చిన్నపాటి కవ్వింపు ఘటన చోటు చేసుకొంది. ఈ లీగ్లో జరిగిన ఓ మ్యాచ్లో శ్రీశాంత్ బౌలింగ్లో గంభీర్ అద్భుతమైన షాట్లు కొట్టాడు. ఈ క్రమంలో గంభీర్ వైపు శ్రీశాంత్ తీక్షణంగా చూశాడు. అయితే, గంభీర్ కూడా ఏమాత్రం వెనక్కితగ్గకుండా ఏంటన్నట్లు సైగ చేశాడు. దీంతో మ్యాచ్ అనంతరం గంభీర్పై శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు.
‘‘మిస్టర్ ఫైటర్తో మ్యాచ్ సందర్భంగా ఏం జరిగిందో చెప్పేందుకు వచ్చా. కారణం లేకుండానే సహచరులతో ఎప్పుడూ గొడవ పడుతుంటాడు. కనీసం తన సీనియర్లకు కూడా గౌరవం ఇవ్వడు. తాజాగా లెజెండ్ లీగ్ క్రికెట్ మ్యాచ్లోనూ నేను కవ్వించకపోయినా పరుష పదజాలం ప్రయోగించాడు. ఈ ఘటనలో నా తప్పేమీ లేదు. మైదానంలో అతడి మాటలు, చేతలు ఆమోదయోగ్యం కాదు. నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఎన్నో కష్టాలు పడ్డారు. అభిమానుల మద్దతుతో పోరాడుతున్నా. అయితే, కొందరు అకారణంగా నన్ను కిందికి లాగాలని అనుకుంటున్నారు. అతడు (గంభీర్) అనకూడని మాటలు మైదానంలో అన్నాడు.
సహచరులకే గౌరవం ఇవ్వని వారు ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం వల్ల ఏంటి ప్రయోజనం? ఏదైనా కామెంట్రీ సెక్షన్లోనూ విరాట్ గురించి అడిగితే దానిని గురించి మాట్లాడడు. ఇతర విషయాలపై స్పందిస్తాడు. అయితే, మరీ లోతుగా వెళ్లాలని అనుకోవడం లేదు. ఈ మ్యాచ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు నన్ను, నా కుటుంబాన్ని బాధించాయి. నాకు మద్దతుగా నిలిచే వారినీ బాధించింది. నేను మాత్రం అతడిని ఒక్క చెడు పదం కూడా అనలేదు. అతడు ఎప్పట్లానే స్పందించాడు. నేను ఒక్క పదమూ తప్పుగా మాట్లాడలేదు. ‘‘నువ్వు ఏమంటున్నావు?’ అని మాత్రమే అడిగా. అప్పుడు అతడు ‘‘ఫిక్సర్, నువ్వు ఫిక్సర్’’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో విరక్తిగా నవ్వుతూ నిలబడిపోయా. వారిని బౌలింగ్లో కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా నన్ను ఫిక్సర్గా పిలిచాడు’’ అని శ్రీశాంత్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఆస్ట్రేలియా విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు