IND vs AFG: కోహ్లీ-నవీనుల్ సంభాషణ.. దిల్లీ క్రికెట్ ప్రేక్షకులకు ఒకటే చెబుతున్నా: గౌతమ్ గంభీర్
దాదాపు ఆరు నెలల నుంచి విరాట్ అభిమానులకు నవీనుల్ హక్కు సోషల్ మీడియా వేదికగా జరిగిన ట్రోలింగ్కు శుభం కార్డు పడింది. వరల్డ్ కప్ మ్యాచ్లో (ODI World Cup 2023) భారత్ - అఫ్గాన్ మ్యాచ్ సందర్భంగా విరాట్, నవీనుల్ సరదాగా ముచ్చటించుకొన్నారు. ఈ సంఘటనపై గౌతమ్ గంభీర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2023) అఫ్గాన్పై భారత్ విజయం సాధించింది. రోహిత్ శర్మ (131) మెరుపు శతకం సాధించాడు. అయితే, వీటన్నింటికి మించి మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అఫ్గాన్ పేసర్ నవీనుల్ హక్ సరదాగా ముచ్చటించుకొన్నారు. నవీనుల్ను ఉద్దేశించి దిల్లీ మైదానంలోని కొందరు ప్రేక్షకులు వ్యాఖ్యలు చేయడాన్ని కోహ్లీ (Virat Kohli) సున్నితంగా మందలించాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తాజాగా ఈ సంఘటనపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఐపీఎల్లో గంభీర్-కోహ్లీ-నవీనుల్ హక్ మధ్యనే వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్-అఫ్గాన్ మ్యాచ్కు గంభీర్ కామెంట్రీ చెప్పాడు.
‘‘మైదానంలో పోరాడాలి. మైదానం బయట కాదు. ప్రతి ఒక్క ఆటగాడికి తమ జట్టు విజయం కోసం పోరాడే హక్కు ఉంటుంది. గౌరవం కోసం పోరాడే అధికారం ఉంది. అది ఏ దేశమనేది సంబంధం లేదు. నువ్వు ఎంత అద్భుత ఆటగాడివనేది అనవసరం. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, నవీనుల్ హక్ను ఇలా చూడటం చాలా బాగుంది. ఎట్టకేలకు ఐపీఎల్ ఫైట్కు శుభం కార్డు పడినట్లే. ఇదే సమయంలో క్రికెట్ అభిమానులకు కూడా ఓ విజ్ఞప్తి. మైదానంలోకానీ, సోషల్ మీడియా వేదికల్లోనైనా ఏ ఆటగాడినైనా సరే సరదా కోసం కూడా ట్రోలింగ్ చేయడం సరికాదు. జాతీయ జట్టు తరఫున ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. దాని కోసం ఎంతో శ్రమించి ఇక్కడి వరకు వస్తారు. ఇక నవీనుల్ హక్ అఫ్గాన్ వంటి దేశం నుంచి ఐపీఎల్ మెగా టోర్నీలో ఆడటం గొప్ప విషయం’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
గత ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీనుల్ హక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరుజట్ల ఆటగాళ్లూ కల్పించుకుని సర్దుబాటు చేశారు. ఆ తర్వాత నవీనుల్ హక్ తన సోషల్ మీడియా వేదికగా కోహ్లీని ఉద్దేశించి పోస్టులు చేశాడు. దీంతో కింగ్ అభిమానుల ట్రోలింగ్కు గురయ్యాడు. ఇప్పుడు వీరిద్దరూ మైదానంలో చిరునవ్వులు చిందించడంతో గత సంఘటనకు ముగింపు పలికినట్లయిందని అభిమానులు సంబరపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ