Gautam Gambhir: అప్పుడు సెలక్టర్ కాళ్లు పట్టుకోలేదని.. జట్టులోకి ఎంపిక చేయలేదు: గంభీర్
ఐపీఎల్ 17వ సీజన్ తొలి క్వాలిఫయర్లో కోల్కతా - హైదరాబాద్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కేకేఆర్ మెంటార్ గంభీర్ తన కెరీర్లో జరిగిన ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడి మరీ ఉన్నతస్థాయికి చేరుకున్నట్లు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తెలిపాడు. భారత జట్టు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గడంలో గంభీర్దీ కీలక పాత్రే. ఓపెనర్గా అద్భుతమైన ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతా ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. మెంటార్గా జట్టును అతడు కేకేఆర్ను మూడోసారి విజేతగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో తన కెరీర్లో ఎదురైన అనుభవాలను వెల్లడించాడు. అండర్ -14 జట్టు ఎంపిక సమయంలో చోటు చేసుకున్న సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
‘‘నాకు అప్పుడు 12 లేదా 13 ఏళ్లు ఉంటాయనుకుంటా. అండర్ -14 టోర్నమెంట్ కోసం చాలా కష్టపడినా నేను ఎంపిక కాలేదు. దానికి కారణం ఏంటో తర్వాత తెలిసింది. నేను సెలక్టర్ కాళ్లు తాకలేదని ఎంపిక చేయలేదు. అప్పటి నుంచే ఎవరి కాళ్లూ పట్టుకోకుండా కెరీర్లో ఉన్నతస్థాయికి ఎదగాలని ప్రతిజ్ఞ చేశా. అలాగే నా కాళ్లనూ ఎవరితోనూ పట్టించుకోకూడదని అనుకున్నా. అండర్ - 16, అండర్-19, రంజీ ట్రోఫీ, భారత జట్టు తరఫున ఆడుతూ విఫలమైనప్పుడల్లా బయట నుంచి చాలా కామెంట్లు వచ్చేవి. ‘నీకేమీ మంచి కుటుంబం నుంచి వచ్చావు. అసలు క్రికెట్ ఆడాల్సిన అవసరమే నీకు లేదు. చాలా ఆప్షన్లు ఉన్నాయి. మీ నాన్న బిజినెస్లను చూసుకుంటావు’ అంటూ వ్యాఖ్యలు చేసేవాళ్లు. అలాంటి వాటితో నా మది అంతా ఆలోచనలతో నిండిపోయేవి. నాకు కుటుంబం కంటే క్రికెట్టే ఎక్కువని ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదో తెలియదు. దానిని అధిగమించేందుకు చాలా శ్రమించేవాడిని. నా జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితి ఏంటంటే ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని నిరూపించుకోవడానికి ప్రయత్నించడమే’’ అని గంభీర్ తెలిపాడు.
షారుఖ్తో అనుబంధం..
‘‘గతంలోనే షారుఖ్ గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నాకు తెలిసి అత్యుత్తమ ఫ్రాంచైజీ ఓనర్ అంటే షారుఖ్. జట్టు ఆటగాళ్లను పూర్తిగా నమ్మడంతోపాటు వారికి కావాల్సిన స్వేచ్ఛ ఇస్తాడు. నేను మళ్లీ తిరిగి రావడానికి ఇదే ప్రధాన కారణం కాకపోవచ్చు. నా ఏడేళ్ల కెప్టెన్ కాలంలో క్రికెట్ గురించి మేమిద్దరం 70 సెకన్లు కూడా మాట్లాడుకోని ఉండము. ఒక్క ప్రశ్న కూడా అతడు నన్న అడగలేదు. ఇది అస్సలు ఊహించి ఉండరు కదా..’’ అని కేకేఆర్ మెంటార్ వెల్లడించాడు. కెప్టెన్గా కోల్కతాను గంభీర్ రెండుసార్లు ఛాంపియన్గా నిలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!