ODI WC 2011: అందరూ మా గురించే మాట్లాడతారు.. కానీ అతడే అసలైన హీరో: గౌతమ్ గంభీర్
రెండోసారి భారత్ వన్డే ప్రపంచకప్ విశ్వవిజేతగా నిలిచిన జట్టులో గౌతమ్ గంభీర్ సభ్యుడు. అయితే, టీమ్ఇండియ విజయం వెనుక మరొక కీలక ఆటగాడు ఉన్నాడని గంభీర్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: తొలి వన్డే ప్రపంచ కప్ను (1983) నెగ్గిన 28 ఏళ్లకు కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత్ రెండో టైటిల్ను (2011) తన ఖాతాలో వేసుకుంది. ధోనీ కెప్టెన్సీ, యువరాజ్ సింగ్ ఆల్రౌండ్ ప్రదర్శనతోపాటు గౌతమ్ గంభీర్ కీలక ఇన్నింగ్స్లతో భారత్ విజేతగా నిలిచింది. అయితే, టీమ్ఇండియా విజేతగా నిలవడం వెనుక మరొకరు ఉన్నారని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ఆసియా కప్లో భారత్ - నేపాల్ మ్యాచ్ అనంతరం ఓ క్రీడా ఛానల్లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ అభిమానులందరూ ఎక్కువగా ధోనీ, యువీతోపాటు తన ఇన్నింగ్స్ల గురించి మాట్లాడుతుంటారని.. అయితే జహీర్ ఖాన్ కీలక పాత్ర పోషించడం వల్లే భారత్ విజేతగా నిలిచిందని పేర్కొన్నాడు.
‘‘యువ్రాజ్ ఆల్రౌండ్ ప్రదర్శన.. ఫైనల్లో ఎంఎస్ ధోనీతోపాటు నా ఇన్నింగ్స్లు గురించి అంతా మాట్లాడుతూ ఉంటారు. కానీ, టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలవడంలో టోర్నీ ఆసాంతం కీలక పాత్ర పోషించిన మరొక ఆటగాడు జహీర్ ఖాన్. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన స్పెల్తో ఆండ్రూ స్ట్రాస్ను ఔట్ చేశాడు. దీంతో మ్యాచ్ ఓడిపోకుండా టై చేయగలిగాం. ఫైనల్లోనూ మంచి స్పెల్ వేశాడు. అందుకే, టోర్నీలో జహీర్ ఖాన్ పాత్ర అద్భుతం. వచ్చే వరల్డ్ కప్లోనూ బుమ్రా ఇలాంటి పాత్రనే పోషించాలి. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలి’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఆసియాకప్లో పాకిస్థాన్తో మ్యాచ్ సందర్భంగా గౌతమ్ గంభీర్ ప్రేక్షకులకు మధ్య వేలిని చూపించాడు. ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడు స్పందించాడు. ప్రేక్షకుల్లో ఒక వర్గం భారత వ్యతిరేక నినాదాలు చేసినందునే తాను వేలు చూపెట్టానని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే