ODI WC 2011: అందరూ మా గురించే మాట్లాడతారు.. కానీ అతడే అసలైన హీరో: గౌతమ్ గంభీర్
రెండోసారి భారత్ వన్డే ప్రపంచకప్ విశ్వవిజేతగా నిలిచిన జట్టులో గౌతమ్ గంభీర్ సభ్యుడు. అయితే, టీమ్ఇండియ విజయం వెనుక మరొక కీలక ఆటగాడు ఉన్నాడని గంభీర్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: తొలి వన్డే ప్రపంచ కప్ను (1983) నెగ్గిన 28 ఏళ్లకు కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత్ రెండో టైటిల్ను (2011) తన ఖాతాలో వేసుకుంది. ధోనీ కెప్టెన్సీ, యువరాజ్ సింగ్ ఆల్రౌండ్ ప్రదర్శనతోపాటు గౌతమ్ గంభీర్ కీలక ఇన్నింగ్స్లతో భారత్ విజేతగా నిలిచింది. అయితే, టీమ్ఇండియా విజేతగా నిలవడం వెనుక మరొకరు ఉన్నారని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ఆసియా కప్లో భారత్ - నేపాల్ మ్యాచ్ అనంతరం ఓ క్రీడా ఛానల్లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ అభిమానులందరూ ఎక్కువగా ధోనీ, యువీతోపాటు తన ఇన్నింగ్స్ల గురించి మాట్లాడుతుంటారని.. అయితే జహీర్ ఖాన్ కీలక పాత్ర పోషించడం వల్లే భారత్ విజేతగా నిలిచిందని పేర్కొన్నాడు.
‘‘యువ్రాజ్ ఆల్రౌండ్ ప్రదర్శన.. ఫైనల్లో ఎంఎస్ ధోనీతోపాటు నా ఇన్నింగ్స్లు గురించి అంతా మాట్లాడుతూ ఉంటారు. కానీ, టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలవడంలో టోర్నీ ఆసాంతం కీలక పాత్ర పోషించిన మరొక ఆటగాడు జహీర్ ఖాన్. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన స్పెల్తో ఆండ్రూ స్ట్రాస్ను ఔట్ చేశాడు. దీంతో మ్యాచ్ ఓడిపోకుండా టై చేయగలిగాం. ఫైనల్లోనూ మంచి స్పెల్ వేశాడు. అందుకే, టోర్నీలో జహీర్ ఖాన్ పాత్ర అద్భుతం. వచ్చే వరల్డ్ కప్లోనూ బుమ్రా ఇలాంటి పాత్రనే పోషించాలి. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలి’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఆసియాకప్లో పాకిస్థాన్తో మ్యాచ్ సందర్భంగా గౌతమ్ గంభీర్ ప్రేక్షకులకు మధ్య వేలిని చూపించాడు. ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడు స్పందించాడు. ప్రేక్షకుల్లో ఒక వర్గం భారత వ్యతిరేక నినాదాలు చేసినందునే తాను వేలు చూపెట్టానని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!