IPL 2024: ఐపీఎల్ ప్రారంభించకపోయుంటే.. బీసీసీఐ ‘అత్యంత చెత్త’ నిర్ణయంగా మిగిలేది: గంభీర్
ఐపీఎల్ (IPL).. దేశవాళీ క్రికెటర్లకు అపార అవకాశాలను కల్పించింది. సంపాదనతోపాటు మ్యాచ్లు ఆడే అవకాశం దక్కింది. ఇలాంటి ఐపీఎల్ను బీసీసీఐ ప్రారంభించడం అభినందనీయమని గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ చరిత్రలో ఐపీఎల్ (IPL) సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆదాయపరంగా, వీక్షణల పరంగా ఎన్నో ఘనతలను ఈ లీగ్ సాధించింది. 2007 పొట్టి ప్రపంచకప్ విజయవంతం కావడంతో బీసీసీఐ కూడా టీ20ల లీగ్ను ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకుంది. తొలిసారి 2008లో ఐపీఎల్ను మొదలు పెట్టింది. చాలామంది దేశవాళీ క్రికెటర్లకు దీనిలో అద్భుతమైన అవకాశాలు లభించాయి. ఒకవేళ ఈ లీగ్ను ప్రారంభించకుండా ఉండుంటే.. బీసీసీఐ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయంగా మిగిలిపోయేదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే కార్యక్రమంలో చేతన్ సకారియా కూడా పాల్గొన్నాడు.
‘‘ఐపీఎల్ భారత క్రికెట్ను మార్చేసింది. దీనిలో యువ క్రికెటర్లకు మంచి అవకాశాలు దక్కాయి. దేశ, విదేశీ సీనియర్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ను మన కుర్రాళ్లు పంచుకున్నారు. అందుకే.. ఐపీఎల్ను ప్రారంభించకుండా ఉంటే.. అది బీసీసీఐ అత్యంత చెత్త నిర్ణయంగా మిగిలేదని భావిస్తున్నా’’ అని గంభీర్ తెలిపాడు. గత సీజన్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ మెంటార్గా వ్యవహరించిన గంభీర్.. వచ్చే సీజన్ కోసం కోల్కతా నైట్రైడర్స్కు మెంటార్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్ను రూ. 24.75 కోట్లు వెచ్చించి మరీ కేకేఆర్ దక్కించుకుంది. యువ బౌలర్ చేతన్ సకారియాను కోల్కతా రూ. 50 లక్షలకు తీసుకుంది.
నిరుత్సాహానికి గురయ్యా.. : చేతన్
ఐపీఎల్ వేలానికి ముందు దిల్లీ క్యాపిటల్స్ వదిలేయడం కాస్త షాక్గా అనిపించలేదని.. కానీ నిరుత్సాహానికి గురైనట్లు చేతన్ సకారియా వ్యాఖ్యానించాడు. ‘‘దిల్లీ తీసుకున్న నిర్ణయం నన్నేమీ షాక్కు గురి చేయలేదు. కానీ, కాస్త నిరుత్సాహపరిచింది. జట్టు తీసుకున్న విధానపర నిర్ణయాల ప్రకారం కరెక్టే. నా స్థాయి ప్రదర్శన చేయలేదనిపించింది. నాకు దక్కిన ధరకు (రూ.4.20 కోట్లు) న్యాయం చేయలేకపోయానేమో. ఆ జట్టులో భారత్కు చెందిన ఇతర బౌలర్లు ఉన్నారు. ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కొనసాగుతున్నారు. దిల్లీ జట్టులో ఉన్నప్పుడు ముస్తాఫిజర్ నుంచి చాలా నేర్చుకున్నా. బంతిని ఎలా సంధించాలనే విషయాలపై పట్టు సాధించా. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నా. మిచెల్ స్టార్క్ వంటి స్టార్ బౌలర్తోపాటు గౌతమ్ గంభీర్ వంటి మెంటార్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నన్ను కేకేఆర్ రూ.50 లక్షలకే కొనుగోలు చేసిందని బాధేమీ లేదు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. ఎక్కువ మ్యాచ్ల్లో అవకాశం ఇచ్చే జట్టులో ఉండటమే ముఖ్యం’’ అని చేతన్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల