IPL 2024: ఐపీఎల్ ప్రారంభించకపోయుంటే.. బీసీసీఐ ‘అత్యంత చెత్త’ నిర్ణయంగా మిగిలేది: గంభీర్
ఐపీఎల్ (IPL).. దేశవాళీ క్రికెటర్లకు అపార అవకాశాలను కల్పించింది. సంపాదనతోపాటు మ్యాచ్లు ఆడే అవకాశం దక్కింది. ఇలాంటి ఐపీఎల్ను బీసీసీఐ ప్రారంభించడం అభినందనీయమని గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ చరిత్రలో ఐపీఎల్ (IPL) సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆదాయపరంగా, వీక్షణల పరంగా ఎన్నో ఘనతలను ఈ లీగ్ సాధించింది. 2007 పొట్టి ప్రపంచకప్ విజయవంతం కావడంతో బీసీసీఐ కూడా టీ20ల లీగ్ను ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకుంది. తొలిసారి 2008లో ఐపీఎల్ను మొదలు పెట్టింది. చాలామంది దేశవాళీ క్రికెటర్లకు దీనిలో అద్భుతమైన అవకాశాలు లభించాయి. ఒకవేళ ఈ లీగ్ను ప్రారంభించకుండా ఉండుంటే.. బీసీసీఐ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయంగా మిగిలిపోయేదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే కార్యక్రమంలో చేతన్ సకారియా కూడా పాల్గొన్నాడు.
‘‘ఐపీఎల్ భారత క్రికెట్ను మార్చేసింది. దీనిలో యువ క్రికెటర్లకు మంచి అవకాశాలు దక్కాయి. దేశ, విదేశీ సీనియర్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ను మన కుర్రాళ్లు పంచుకున్నారు. అందుకే.. ఐపీఎల్ను ప్రారంభించకుండా ఉంటే.. అది బీసీసీఐ అత్యంత చెత్త నిర్ణయంగా మిగిలేదని భావిస్తున్నా’’ అని గంభీర్ తెలిపాడు. గత సీజన్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ మెంటార్గా వ్యవహరించిన గంభీర్.. వచ్చే సీజన్ కోసం కోల్కతా నైట్రైడర్స్కు మెంటార్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్ను రూ. 24.75 కోట్లు వెచ్చించి మరీ కేకేఆర్ దక్కించుకుంది. యువ బౌలర్ చేతన్ సకారియాను కోల్కతా రూ. 50 లక్షలకు తీసుకుంది.
నిరుత్సాహానికి గురయ్యా.. : చేతన్
ఐపీఎల్ వేలానికి ముందు దిల్లీ క్యాపిటల్స్ వదిలేయడం కాస్త షాక్గా అనిపించలేదని.. కానీ నిరుత్సాహానికి గురైనట్లు చేతన్ సకారియా వ్యాఖ్యానించాడు. ‘‘దిల్లీ తీసుకున్న నిర్ణయం నన్నేమీ షాక్కు గురి చేయలేదు. కానీ, కాస్త నిరుత్సాహపరిచింది. జట్టు తీసుకున్న విధానపర నిర్ణయాల ప్రకారం కరెక్టే. నా స్థాయి ప్రదర్శన చేయలేదనిపించింది. నాకు దక్కిన ధరకు (రూ.4.20 కోట్లు) న్యాయం చేయలేకపోయానేమో. ఆ జట్టులో భారత్కు చెందిన ఇతర బౌలర్లు ఉన్నారు. ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కొనసాగుతున్నారు. దిల్లీ జట్టులో ఉన్నప్పుడు ముస్తాఫిజర్ నుంచి చాలా నేర్చుకున్నా. బంతిని ఎలా సంధించాలనే విషయాలపై పట్టు సాధించా. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నా. మిచెల్ స్టార్క్ వంటి స్టార్ బౌలర్తోపాటు గౌతమ్ గంభీర్ వంటి మెంటార్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నన్ను కేకేఆర్ రూ.50 లక్షలకే కొనుగోలు చేసిందని బాధేమీ లేదు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. ఎక్కువ మ్యాచ్ల్లో అవకాశం ఇచ్చే జట్టులో ఉండటమే ముఖ్యం’’ అని చేతన్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్