Team India: అతడినే వేలెత్తి చూపడం సరికాదు.. అవకాశాలు ఇవ్వాల్సిందే: గావస్కర్
భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో విఫలం కావడంపై వస్తున్న విమర్శలను మాజీ క్రికెటర్లు కొట్టిపడేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో టెస్టు (SA vs IND) సిరీస్లో భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. మిడిలార్డర్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ రెండు టెస్టుల్లోనూ ప్రభావం చూపించలేదు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. వాటిని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఖండించాడు. కేవలం ఒక్కరినే వేలెత్తి చూపడం సరికాదని హితవు పలికాడు.
‘‘శ్రేయస్ అయ్యర్ మాత్రమే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో విఫలం కాలేదు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపించారు. రోహిత్, శుభ్మన్ గిల్ విఫలమైన సంగతిని గుర్తుపెట్టుకోవాలి. సఫారీ గడ్డపై ఆడటం బ్యాటర్లకు అంత తేలిక కాదు. అందుకే, కేవలం ఒకరినే నిందించడం సరికాదు. సెలక్షన్ కమిటీ కూడా శ్రేయస్ అయ్యర్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే మరింత మెరుగ్గా రాణించేందుకు వీలుంటుంది’’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
మరీ డిఫెన్సివ్గా ఆడటం వల్లే: మంజ్రేకర్
‘‘పేస్ బౌలింగ్కు అనుకూలంగా ఉండే దక్షిణాఫ్రికా పిచ్లపై మరీ డిఫెన్సివ్గా ఆడటం కూడా నష్టం చేస్తుంది. ఫుల్, షార్ట్ పిచ్ బంతులను శ్రేయస్ అడ్డుకొనేందుకు ప్రయత్నించి పెవిలియన్కు చేరాడు. విదేశీ మైదానాల్లో పరుగులు రాబట్టాలంటే దానిపై విపరీతంగా శ్రమించాలి. డిఫెన్స్ ఆడుతూ వికెట్లను సమర్పించుకునే బదులు.. రిస్క్ తీసుకుని దూకుడుగా ఆడేందుకు మొగ్గు చూపాలి. అలాంటప్పుడు బ్యాటింగ్లో స్థిరత్వం ఉండదు. కానీ, కౌంటర్ ఎటాక్ చేయడం వల్ల బౌలర్లు గతి తప్పే అవకాశం ఉంటుంది’’ అని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం