Mohammed Siraj: సిరాజ్ గొప్ప ఘనత.. వన్డేల్లో నంబర్ 1గా హైదరాబాదీ పేసర్
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ గొప్ప ఘనతను అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో తొలిసారి నంబర్వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ గొప్ప ఘనతను అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. బౌలర్ల ర్యాంకింగ్స్లో తొలిసారి నంబర్వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన జాబితాలో సిరాజ్ 729 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్ హేజిల్వుడ్ (727), న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (708)లను వెనక్కినెట్టి అతడు ఈ ఘనత సాధించాడు. ఏడాదిగా వన్డే క్రికెట్లో నిలకడగా రాణిస్తోన్న సిరాజ్.. సొంతగడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్లతో సిరీస్లలో అదరగొట్టాడు. మరో బౌలర్ మహ్మద్ షమి 11 స్థానాలు మెరుగై 32వ ర్యాంకు సాధించాడు. వన్డేల్లో వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న శుబ్మన్ గిల్ బ్యాటర్ ర్యాంకింగ్స్లో పురోగతి సాధించాడు. 20 స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లి ఏడో ర్యాంకు సాధించాడు. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్శర్మ రెండు స్థానాలు మెరుగై స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)తో కలిసి సంయుక్తంగా 8వ స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు.
గల్లీ నుంచి..
హైదరాబాద్ గల్లీల్లో తన క్రికెట్ ప్రస్థానాన్ని ఆరంభించిన సిరాజ్.. ఇప్పుడు ప్రపంచ నంబర్వన్ పేసర్గా ఎదిగాడు. పరుగులు ఇవ్వడం తప్ప వికెట్లు పడగొట్టడం లేదంటూ విమర్శలు ఎదుర్కొన్న అతను.. ఇప్పుడు జట్టులో కీలక బౌలర్గా మారాడు. అతనీ స్థాయికి చేరడం వెనుక ఎంతో కష్టం ఉంది. 2019లో వన్డే అరంగేట్రం చేశాక ఈ ఫార్మాట్లో రెండో మ్యాచ్ ఆడేందుకు మూడేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. తొలి మ్యాచ్లో 10 ఓవర్లలో 76 పరుగులిచ్చి, ఒక్క వికెట్ కూడా తీయలేక జట్టులో స్థానం నిలబెట్టుకోలేకపోయాడు. షమి, భువనేశ్వర్, బుమ్రా ప్రధాన పేసర్లుగా కొనసాగుతుండడం, మధ్యలో కరోనా కారణంగా వన్డే జట్టుకు దూరమయ్యాడు. అయినా నిరుత్సాహపడలేదు. ఇలాంటి అడ్డంకులు అతనికి కొత్తమీ కాదు. పేదరికం నుంచి వచ్చి, తండ్రి (ఇప్పుడు లేరు) ప్రోత్సాహంతో ఎదిగిన అతను మరోసారి శ్రమనే నమ్ముకున్నాడు. సాధనకు అధిక సమయం కేటాయించాడు. సరైన ప్రదేశాల్లో కచ్చితమైన లైన్తో బౌలింగ్ చేయడంపై పట్టు సాధించాడు. ఇన్స్వింగ్, ఔట్స్వింగ్ రాబట్టడంలో రాటుదేలాడు. ఇప్పుడు పరిపూర్ణ పేసర్గా ప్రశంసలు అందుకుంటున్నాడు.
టెస్టుల్లో మెరుగైన ప్రదర్శనతో గతేడాది ఫిబ్రవరిలో వన్డేల్లో పునరాగమనం చేశాడు. అప్పటి నుంచి ఆడిన 20 వన్డేల్లో 38 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్తో సిరీస్లో అతని బౌలింగ్ చూస్తేనే.. ఎంతగా పురోగతి సాధించాడో అర్థమవుతోంది. వికెట్ల ఆకలితో, కసిగా బంతులేస్తూ ప్రత్యర్థిని బోల్తా కొట్టిస్తున్నాడు. ఇప్పుడు కపిల్దేవ్, బుమ్రా తర్వాత వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్న మూడో భారత పేసర్గా సిరాజ్ నిలిచాడు. 2022కి గాను ఐసీసీ పురుషుల వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. తరచూ గాయాల కారణంగా బుమ్రా జట్టుకు దూరమవుతుంటే, షమికి నిలకడ లోపించింది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో జట్టుకు ఇప్పుడు సిరాజ్ కీలకంగా మారాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్