IND vs NZ: కివీస్తో ఇక ధనాధన్
ఇక దంచుడే. వన్డే సిరీస్ క్లీన్స్వీప్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ ఇండియా ఉంటే.. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది.
తొలి టీ20 నేడు
రాత్రి 7.30 నుంచి
ఇక దంచుడే. వన్డే సిరీస్ క్లీన్స్వీప్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ ఇండియా ఉంటే.. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది. రెండు జట్ల మధ్య తొలి టీ20 నేడే. హార్దిక్ నేతృత్వంలోని టీమ్ఇండియా జోరు కొనసాగిస్తుందా అన్నది చూడాలి.
మరో ఆసక్తికర సమరానికి వేళైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి టీ20 శుక్రవారం జరగనుంది. రోహిత్, కోహ్లి వంటి సీనియర్ల గైర్హాజరీలతో హార్దిక్ నేతృత్వంలోని యువ జట్టు మరోసారి చెలరేగాలని తహతహలాడుతోంది. రాహుల్, షమి, సిరాజ్లకు కూడా ఈ సిరీస్కు విశ్రాంతినిచ్చారు. వన్డే సిరీస్ను 0-3తో కోల్పోయిన కివీస్ ఈ సిరీస్లో ఎలా ప్రతిఘటిస్తుందో చూడాలి.
ఇషాన్, గిల్ ఓపెనింగ్: జోరుమీదున్న టీమ్ఇండియా రెట్టించిన విశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. గిల్ సూపర్ ఫామ్లో ఉండడం భారత్కు గొప్ప సానుకూలాంశం. వన్డే సిరీస్లో అతడు పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. ఇక పొట్టి ఫార్మాట్లో మిస్టర్ 360 సూర్యకుమార్ జోరు తెలిసిందే. వీళ్లతో పాటు రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్య, దీపక్ హుడాలతో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన పృథ్వీ షా ఓ ఓపెనింగ్ ప్రత్యామ్నాయం. అయితే అతడు నిరీక్షించక తప్పదని కెప్టెన్ హార్దిక్ చెప్పాడు. గిల్ ఓపెనింగ్ చేస్తాడని తెలిపాడు. గిల్తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. బ్యాటింగ్లో భారత్ మెరుగ్గానే కనిపిస్తున్నా బౌలింగ్లోనూ పుంజుకోవాల్సివుంది. శ్రీలంకతో సిరీస్లో పేస్ బౌలర్ అర్ష్దీప్ బౌలింగ్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో పుణెలో జరిగిన టీ20లో అతడు కేవలం 2 ఓవర్లలో 37 పరుగులిచ్చాడు. అర్ష్దీప్ మరింత నిలకడగా బౌలింగ్ చేయాలని జట్టు ఆశిస్తోంది. అయితే బౌలింగ్లో భారత్కు ఉత్సాహాన్నిచ్చే అంశం కూడా ఒకటుంది. శ్రీలంకతో సిరీస్లో పొట్టి క్రికెట్ అరంగేట్రం చేసిన పేస్ బౌలర్ శివమ్ మావి ఆకట్టుకున్నాడు. మంచి వేగంతో బౌలింగ్ చేసిన అతడు లంకతో తొలి టీ20లో 22 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతడు ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకుంటాడు. సుందర్తో కలిసి ఎవరు స్పిన్ బాధ్యతలు తీసుకుంటారన్నదే ఆసక్తికరం. చాహల్, కుల్దీప్ మధ్య పోటీ ఉంది. కుల్దీప్కే అవకాశాలు మెండు.
కివీస్ పరిస్థితిలా..: వన్డే సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తుందనడంలో సందేహం లేదు. కానీ విలియమ్సన్, సౌథీ లేకపోవడం ఈ సిరీస్లోనూ ఆ జట్టుకు లోటే. జట్టుకు శాంట్నర్ నాయకత్వం వహించనున్నాడు. ఫిన్ అలెన్, కాన్వే, ఫిలిప్స్, బ్రాస్వెల్ వంటి వారితో కివీస్ బ్యాటింగ్ మెరుగే. ఇండోర్ వన్డేలో కేవలం 100 బంతుల్లో 138 పరుగులు చేసిన కాన్వే జోరుమీదున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల్లో 188 పరుగులు చేసిన బ్రాస్వెల్ పొట్టి ఫార్మాట్లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాడు. అయితే ఫెర్గూసన్ మినహా పేస్ బౌలింగ్లో అనుభవజ్ఞులు లేకపోవడం న్యూజిలాండ్కు సమస్యే. బెన్ లిస్టర్, హెన్రీ షిప్లీ ఈ ఫార్మాట్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. టిక్నర్, డఫీలు ఆడిన టీ20లు తక్కువే. అయితే స్పిన్నర్ ఇష్ సోథికి భారత్లో మంచి రికార్డు ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం.
తుది జట్లు (అంచనా)... భారత్: శుభ్మన్ గిల్, ఇషాన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్, హార్దిక్, దీపక్ హుడా, సుందర్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్, కుల్దీప్;
న్యూజిలాండ్: అలెన్, కాన్వే, చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్, బ్రాస్వెల్, శాంట్నర్, టిక్నర్, ఇష్ సోధి, బెన్ లిస్టర్, ఫెర్గూసన్
‘‘టీ20లు, వన్డేలు రెండింటిలోనూ న్యూజిలాండ్ మంచి జట్టే. ఆ జట్టు ఎప్పుడూ గట్టి సవాలు విసురుతుంది. కివీస్ను ఓడించాలంటే అత్యుత్తమ ప్రదర్శన చేయాలి’’ - హార్దిక్ పాండ్య
పిచ్..
రాంచీలో జరిగిన 25 టీ20 మ్యాచ్ల్లో 16 సార్లు ఛేదించిన జట్లే గెలిచాయి. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు మెండు. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మంచు ప్రభావం ఉంటుంది. ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
ఐపీఎల్-2024లో లఖ్నవూ ఐదో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. -
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్