IND vs NZ: కివీస్తో ఇక ధనాధన్
ఇక దంచుడే. వన్డే సిరీస్ క్లీన్స్వీప్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ ఇండియా ఉంటే.. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది.
తొలి టీ20 నేడు
రాత్రి 7.30 నుంచి
ఇక దంచుడే. వన్డే సిరీస్ క్లీన్స్వీప్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ ఇండియా ఉంటే.. ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది. రెండు జట్ల మధ్య తొలి టీ20 నేడే. హార్దిక్ నేతృత్వంలోని టీమ్ఇండియా జోరు కొనసాగిస్తుందా అన్నది చూడాలి.
మరో ఆసక్తికర సమరానికి వేళైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి టీ20 శుక్రవారం జరగనుంది. రోహిత్, కోహ్లి వంటి సీనియర్ల గైర్హాజరీలతో హార్దిక్ నేతృత్వంలోని యువ జట్టు మరోసారి చెలరేగాలని తహతహలాడుతోంది. రాహుల్, షమి, సిరాజ్లకు కూడా ఈ సిరీస్కు విశ్రాంతినిచ్చారు. వన్డే సిరీస్ను 0-3తో కోల్పోయిన కివీస్ ఈ సిరీస్లో ఎలా ప్రతిఘటిస్తుందో చూడాలి.
ఇషాన్, గిల్ ఓపెనింగ్: జోరుమీదున్న టీమ్ఇండియా రెట్టించిన విశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. గిల్ సూపర్ ఫామ్లో ఉండడం భారత్కు గొప్ప సానుకూలాంశం. వన్డే సిరీస్లో అతడు పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. ఇక పొట్టి ఫార్మాట్లో మిస్టర్ 360 సూర్యకుమార్ జోరు తెలిసిందే. వీళ్లతో పాటు రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్య, దీపక్ హుడాలతో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన పృథ్వీ షా ఓ ఓపెనింగ్ ప్రత్యామ్నాయం. అయితే అతడు నిరీక్షించక తప్పదని కెప్టెన్ హార్దిక్ చెప్పాడు. గిల్ ఓపెనింగ్ చేస్తాడని తెలిపాడు. గిల్తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. బ్యాటింగ్లో భారత్ మెరుగ్గానే కనిపిస్తున్నా బౌలింగ్లోనూ పుంజుకోవాల్సివుంది. శ్రీలంకతో సిరీస్లో పేస్ బౌలర్ అర్ష్దీప్ బౌలింగ్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో పుణెలో జరిగిన టీ20లో అతడు కేవలం 2 ఓవర్లలో 37 పరుగులిచ్చాడు. అర్ష్దీప్ మరింత నిలకడగా బౌలింగ్ చేయాలని జట్టు ఆశిస్తోంది. అయితే బౌలింగ్లో భారత్కు ఉత్సాహాన్నిచ్చే అంశం కూడా ఒకటుంది. శ్రీలంకతో సిరీస్లో పొట్టి క్రికెట్ అరంగేట్రం చేసిన పేస్ బౌలర్ శివమ్ మావి ఆకట్టుకున్నాడు. మంచి వేగంతో బౌలింగ్ చేసిన అతడు లంకతో తొలి టీ20లో 22 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతడు ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకుంటాడు. సుందర్తో కలిసి ఎవరు స్పిన్ బాధ్యతలు తీసుకుంటారన్నదే ఆసక్తికరం. చాహల్, కుల్దీప్ మధ్య పోటీ ఉంది. కుల్దీప్కే అవకాశాలు మెండు.
కివీస్ పరిస్థితిలా..: వన్డే సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తుందనడంలో సందేహం లేదు. కానీ విలియమ్సన్, సౌథీ లేకపోవడం ఈ సిరీస్లోనూ ఆ జట్టుకు లోటే. జట్టుకు శాంట్నర్ నాయకత్వం వహించనున్నాడు. ఫిన్ అలెన్, కాన్వే, ఫిలిప్స్, బ్రాస్వెల్ వంటి వారితో కివీస్ బ్యాటింగ్ మెరుగే. ఇండోర్ వన్డేలో కేవలం 100 బంతుల్లో 138 పరుగులు చేసిన కాన్వే జోరుమీదున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల్లో 188 పరుగులు చేసిన బ్రాస్వెల్ పొట్టి ఫార్మాట్లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాడు. అయితే ఫెర్గూసన్ మినహా పేస్ బౌలింగ్లో అనుభవజ్ఞులు లేకపోవడం న్యూజిలాండ్కు సమస్యే. బెన్ లిస్టర్, హెన్రీ షిప్లీ ఈ ఫార్మాట్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. టిక్నర్, డఫీలు ఆడిన టీ20లు తక్కువే. అయితే స్పిన్నర్ ఇష్ సోథికి భారత్లో మంచి రికార్డు ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం.
తుది జట్లు (అంచనా)... భారత్: శుభ్మన్ గిల్, ఇషాన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్, హార్దిక్, దీపక్ హుడా, సుందర్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్, కుల్దీప్;
న్యూజిలాండ్: అలెన్, కాన్వే, చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్, బ్రాస్వెల్, శాంట్నర్, టిక్నర్, ఇష్ సోధి, బెన్ లిస్టర్, ఫెర్గూసన్
‘‘టీ20లు, వన్డేలు రెండింటిలోనూ న్యూజిలాండ్ మంచి జట్టే. ఆ జట్టు ఎప్పుడూ గట్టి సవాలు విసురుతుంది. కివీస్ను ఓడించాలంటే అత్యుత్తమ ప్రదర్శన చేయాలి’’ - హార్దిక్ పాండ్య
పిచ్..
రాంచీలో జరిగిన 25 టీ20 మ్యాచ్ల్లో 16 సార్లు ఛేదించిన జట్లే గెలిచాయి. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు మెండు. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మంచు ప్రభావం ఉంటుంది. ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?