మరొక్క అడుగే
పొచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో భారత్ టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది.
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్
ఇంగ్లాండ్తో టైటిల్ పోరు
పొచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో భారత్ టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం సెమీస్లో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ను యువ భారత్ 107/9కు పరిమితం చేసింది. బౌలర్ల ధాటికి నిలవలేకపోయిన పోయిన న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పార్షవి చోప్రా (3/20) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఆమెతో పాటు మన్నత్, తితాస్, షెఫాలీ, అర్చన తలో వికెట్ పడగొట్టారు. జార్జియా (35), ఇసాబెలా (26) పోరాడకపోతే కివీస్ ఆమాత్రం స్కోరు కూడా చేసేది కాదు. లక్ష్యాన్ని భారత్ 14.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఫామ్లో ఉన్న శ్వేత సెహ్రావత్ (61 నాటౌట్; 45 బంతుల్లో 10×4) మరోసారి అదరగొట్టింది. కెప్టెన్ షెఫాలీ వర్మ (10), సౌమ్య తివారి (22) వెనుదిరిగినా శ్వేత ఆఖరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. మరో సెమీస్లో ఇంగ్లాండ్ 3 పరుగుల స్వల్ప తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి భారత్తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. మొదట ఇంగ్లాండ్ 19.5 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌట్ కాగా.. ఛేదనలో ఆసీస్ 18.4 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే