అంతర్జాతీయ క్రికెట్కు విజయ్ వీడ్కోలు
టీమ్ఇండియా మాజీ టెస్టు ఓపెనర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల విజయ్.. చివరగా 2018 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో పెర్త్లో టెస్టు మ్యాచ్ ఆడాడు.
చెన్నై: టీమ్ఇండియా మాజీ టెస్టు ఓపెనర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల విజయ్.. చివరగా 2018 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో పెర్త్లో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన విజయ్.. మళ్లీ టీమ్ఇండియా తలుపు తట్టలేకపోయాడు. 2008-09 సీజన్లో అరంగేట్రం చేసిన విజయ్.. 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో అతను 38.28 సగటుతో 3982 పరుగులు చేశాడు. అందులో 12 శతకాలు, 15 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 167. ‘‘ప్రపంచ క్రికెట్లో, వ్యాపారపరంగా నేను కొత్త అవకాశాల వైపు వెళ్లాలనుకుంటున్నా. ఇక ముందూ ఆటలో కొనసాగుతూ సరికొత్త వాతావరణాల్లో నాకు నేను సవాలు విసురుకోవాలని అనుకుంటున్నా. ఇది క్రికెటర్గా నా తర్వాతి అడుగు. నా జీవితంలో కొత్త అధ్యాయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నాకు అవకాశాలు కల్పించిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ సంఘం, చెన్నై సూపర్కింగ్స్లకు కృతజ్ఞుడిని. తోడ్పాటు అందించిన సహచర ఆటగాళ్లు, కోచ్లకు ధన్యవాదాలు. నా కుటుంబం, స్నేహితులు లేకుంటే నేనింత దూరం వచ్చేవాడిని కాదు’’ అని విజయ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.