సంక్షిప్త వార్తలు (6)
టీమ్ఇండియా యువ పేసర్ అర్ష్దీప్సింగ్ కౌంటీ క్రికెట్లో ఆడనున్నాడు. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సలహా మేరకు సుదీర్ఘ ఫార్మాట్పై పట్టుసాధించడం కోసం అర్ష్దీప్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు.
కెంట్కు ఆడనున్న అర్ష్దీప్
కెంట్: టీమ్ఇండియా యువ పేసర్ అర్ష్దీప్సింగ్ కౌంటీ క్రికెట్లో ఆడనున్నాడు. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సలహా మేరకు సుదీర్ఘ ఫార్మాట్పై పట్టుసాధించడం కోసం అర్ష్దీప్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. రానున్న ఇంగ్లిష్ కౌంటీ సీజన్లో కెంట్ తరఫున అతను అయిదు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడతాడు. ‘‘ఇంగ్లాండ్లో సుదీర్ఘ ఫార్మాట్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నా. నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తా. గొప్ప చరిత్ర కలిగిన క్రికెట్ క్లబ్ కెంట్ అని ద్రవిడ్ నాతో అన్నారు’’ అని అర్ష్దీప్ తెలిపాడు. ఐపీఎల్ తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కోసం టీమ్ఇండియా.. ఇంగ్లాండ్కు వెళ్తుంది. ఆ సమయంలో అర్ష్దీప్ అక్కడే ఉండనున్నాడు.
న్యూజిలాండ్ 155/2
వెల్లింగ్టన్: శ్రీలంకతో రెండో టెస్టును న్యూజిలాండ్ మెరుగ్గా ఆరంభించింది. తొలి రోజు, శుక్రవారం ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (78) రాణించాడు. లేథమ్ (21)తో తొలి వికెట్కు అతడు 87 పరుగులు జోడించాడు. విలియమ్సన్ (26), నికోల్స్ (18) క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా మొదటి రోజు 48 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఉదయం సెషన్లో ఒక్క బంతి కూడా పడలేదు.
ఐర్లాండ్ పర్యటనకు భారత్
డబ్లిన్: భారత్తో మూడు టీ20ల సిరీస్కు ఐర్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. డబ్లిన్ వేదికగా ఈ ఆగస్టులో ఈ సిరీస్ జరగనుంది. ఆగస్టు 18-23 మధ్య ఈ మూడు మ్యాచ్ల సిరీస్ జరగనుంది. హార్దిక్ పాండ్య సారథ్యంలోని భారత జట్టు గతేడాది ఐర్లాండ్లో రెండు టీ20ల సిరీస్ ఆడి 2-0తో నెగ్గింది.
ఐఎస్ఎల్ ఫైనల్ నేడు
ఏటీకే × బెంగళూరు
రాత్రి 7.30 నుంచి
మార్గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ ఫైనల్కు వేళైంది. తొలిసారి టైటిల్ ఆశిస్తున్న ఏటీకే మోహన్ బగాన్.. ఇప్పటికే ఒకసారి ఈ ట్రోఫీ నెగ్గిన బెంగళూరు ఎఫ్సీతో శనివారం పోటీకి సిద్ధమైంది. ఫైనల్ చేరే క్రమంలో చివరిగా ఆడిన అయిదు మ్యాచ్ల్లో ఏటీకే అజేయంగా నిలిచింది. స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి బెంగళూరుకు పెద్ద బలం. గత నాలుగు మ్యాచ్ల్లో కీలక సమయాల్లో సబ్స్టిట్యూట్గా వచ్చి గోల్స్ కొట్టాడతను. గత ఆరు ఐఎస్ఎల్ మ్యాచ్ల్లో బెంగళూరు ఒక్కసారి మాత్రమే ఏటీకే మోహన్ బగాన్ను ఓడించింది. 2018-19 సీజన్లో బెంగళూరు ఐఎస్ఎల్ టైటిల్ నెగ్గగా.. గత సీజన్లో మూడో స్థానంలో నిలవడమే ఇప్పటిదాకా మోహన్ బగాన్కు ఉత్తమ ప్రదర్శన.
ఉత్తమ హాకీ క్రీడాకారులుగా హార్దిక్, సవిత
దిల్లీ: హాకీ ఇండియా 2022 ఏడాది ఉత్తమ క్రీడాకారులుగా పురుషుల్లో హార్దిక్ సింగ్, మహిళల్లో సవిత పునియా ఎంపికయ్యారు. సీనియర్లు మన్ప్రీత్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్లను వెనక్కినెట్టి హార్దిక్ ఈ అవార్డు గెలుచుకున్నాడు. సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్లో హార్దిక్ సత్తా చాటాడు. గతేడాది డిసెంబర్లో భారత మహిళల జట్టు నేషన్స్ కప్ విజయంలో గోల్కీపర్ సవిత ప్రధానభూమిక పోషించింది.
క్రికెట్కు పైన్ వీడ్కోలు
హోబర్ట్: ఆస్ట్రేలియా టెస్టు జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ ఆటకు వీడ్కోలు పలికాడు. శుక్రవారం టాస్మానియా, క్వీన్స్లాండ్ మధ్య షెఫీల్డ్ షీల్డ్ దేశవాళీ ఫస్ట్క్లాస్ మ్యాచ్ అనంతరం అతడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 2018 నుంచి 2021 వరకు 23 టెస్టుల్లో పైన్ ఆసీస్కు సారథ్యం వహించాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ ట్యాంపరింగ్ వివాదం అనంతరం స్టీవ్ స్మిత్పై వేటుపడటంతో అతని స్థానంలో పైన్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అయితే 2021 చివర్లో క్రికెట్ టాస్మానియా మాజీ ఉద్యోగినికి అసభ్యకర సందేశాలు పంపినట్లు తేలడంతో పైన్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆసీస్ తరఫున పైన్ 35 టెస్టులు, 35 వన్డేలు, 12 టీ20లు ఆడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్