జాస్మిన్, శశి ముందంజ
సొంతగడ్డపై ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. జాస్మిన్ (60 కేజీ), శశి చోప్రా (63 కేజీ) ముందంజ వేశారు.
శ్రుతి పరాజయం
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్
దిల్లీ: సొంతగడ్డపై ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. జాస్మిన్ (60 కేజీ), శశి చోప్రా (63 కేజీ) ముందంజ వేశారు. బర్మింగ్హామ్ కామన్వెల్త్ కాంస్య పతక విజేత జాస్మిన్ అయితే 90 సెకన్లలోనే ప్రత్యర్థి పని పట్టింది. తొలి రౌండ్లో బెట్రైస్ ఆంబ్రోస్ (టాంజానియా)ను ఆమె తేలిగ్గా మట్టికరిపించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జాస్మిన్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. పోటీ ఆరంభమైన కొద్దిసేపటికే జాస్మిన్ పంచ్లను బెట్రైస్ తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్ నిలిపేసి భారత బాక్సర్ను విజేతగా ప్రకటించాడు. మరో బౌట్లో శశి 5-0తో టెరెసియా (కెన్యా)ను చిత్తు చేసింది. బలమైన డిఫెన్స్కు తోడు మెరుపు పంచ్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడిన శశి.. ఘన విజయాన్ని అందుకుంది. మరోవైపు శ్రుతి యాదవ్ (70 కేజీ)కు చుక్కెదురైంది. ఆమె 0-5తో జోహుపాన్ (చైనా) చేతిలో ఓడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.