కోచ్ కానందుకు బాధ లేదు
భారత క్రికెట్ జట్టు కోచ్ కానందుకు బాధగా లేదని.. విరాట్ కోహ్లి తనను సంప్రదించకపోతే అసలు ఈ పదవికి దరఖాస్తే చేసేవాడిని కాదని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
దిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచ్ కానందుకు బాధగా లేదని.. విరాట్ కోహ్లి తనను సంప్రదించకపోతే అసలు ఈ పదవికి దరఖాస్తే చేసేవాడిని కాదని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. 2017లో కోచ్గా అనిల్ కుంబ్లే వారసుడిని వెతికే క్రమంలో వీరూని బోర్డు సంప్రదించింది. కానీ చివరికి రవిశాస్త్రికి అవకాశం దక్కింది. ‘‘అప్పటి కెప్టెన్ కోహ్లి, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి సంప్రదించకపోతే కోచ్ పదవికి దరఖాస్తు కూడా చేసేవాడిని కాదు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత అనిల్ కుంబ్లే పదవి కాలం ముగిసిపోతుందని.. కోచ్ పదవికి ఎంపిక చేయబోతున్నామని త్వరలో జరిగే వెస్టిండీస్ పర్యటనకు బాధ్యతలు స్వీకరించాలని కోహ్లి, అమితాబ్ చెప్పారు. కానీ కోచ్ పదవి రాకపోయినా నాకెలాంటి బాధా లేదు. టీమ్ఇండియా తరఫున ఎన్నో సాధించా. ఒక రైతు కుటుంబంలో పుట్టి దేశానికి ఆడే అవకాశాన్ని అందుకున్నా. అభిమానుల విశేష ఆదరణ పొందా. భారత్కు కెప్టెన్గా ఉన్నా కూడా ఇంతటి గౌరవం దక్కేది కాదేమో’’ అని వీరూ అన్నాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి తర్వాత అనిల్ కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు