సంక్షిప్త వార్తలు (3)
స్విస్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ డబుల్స్ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీకి చుక్కెదురైంది.
గాయత్రి జోడీకి చుక్కెదురు
లక్ష్యసేన్ కూడా ఔట్
శ్రీకాంత్ ముందంజ
బాసెల్: స్విస్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ డబుల్స్ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీకి చుక్కెదురైంది. ఆల్ ఇంగ్లాడ్ ఛాంపియన్షిప్లో సెమీఫైనల్ ప్రదర్శనతో అదరగొట్టిన గాయత్రి- ట్రీసా జంటకు స్విస్ ఓపెన్లో తొలి రౌండ్లోనే పరాజయం ఎదురైంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి- ట్రీసా జోడీ 14-21, 14-21తో రెండో సీడ్ అప్రియాని- రమధంతి (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలయింది. సిక్కిరెడ్డి- ఆరతి 12-21, 14-21తో సయాక- షిజు (జపాన్) చేతిలో, అశ్విని- శిఖ 17-21, 12-21తో సుపిసర- సుపజిరకుల్ (థాయ్లాండ్) చేతిలో ఓడారు. పురుషుల సింగిల్స్లో అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. అతను 21-16, 15-21, 21-18తో చైనా ఆటగాడు వెంగ్ హాంగ్ను ఓడించాడు. మరో టాప్ షట్లర్ లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతను 18-21, 11-21తో యియు లీ (హాంకాంగ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మిథున్ మంజునాథ్ 21-8, 21-17తో జొరాన్ క్వీకెల్ (నెదర్లాండ్స్)పై నెగ్గి ప్రిక్వార్టర్స్ చేరుకున్నాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సాత్విక్ సాయిరాజు- చిరాగ్శెటి జోడీ ప్రిక్వార్టర్స్ చేరుకుంది. తొలి రౌండ్లో సాత్విక్- చిరాగ్ జోడీ 21-15, 21-18తో బూన్ యువాన్- వాంగ్ తీన్ (మలేసియా) జంటపై విజయం సాధించింది. కృష్ణప్రసాద్- విష్ణువర్ధన్గౌడ్ 16-21, 14-21తో షొహిబుల్- మౌలానా (ఇండోనేసియా) చేతిలో, అర్జున్- ధ్రువ్ 21-17, 18-21, 11-21తో అకిర- తాయ్చి (జపాన్) చేతిలో ఓడారు.
శరబ్జోత్కు స్వర్ణం
భోపాల్: ఐఎస్ఎస్ఎఫ్ పిస్టల్/రైఫిల్ ప్రపంచ కప్లో భారత షూటర్లు శరబ్జోత్సింగ్, వరుణ్ తోమర్ సత్తాచాటారు. శరబ్జోత్ స్వర్ణం, వరుణ్ కాంస్య పతకాలతో మెరిశారు. పురుషుల ఎయిర్ పిస్టల్ స్వర్ణ పతక పోరులో శరబ్జోత్ 16-0తో రుస్లాన్ లునెవ్ (అజర్బైజాన్)పై విజయం సాధించాడు. ఇదే విభాగంలో కాంస్యం నెగ్గిన వరుణ్ వరుసగా రెండో ప్రపంచకప్ పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. మహిళల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు మను బాకర్, దివ్య సుబ్బరాజు, రిథమ్ సాంగ్వాన్ నిరాశ పరిచారు. దివ్య ర్యాంకింగ్ రౌండ్ చేరుకోగా.. మను, రిథమ్ క్వాలిఫయింగ్లోనే వెనుదిరిగారు.
మూడో స్థానానికి సిరాజ్
దుబాయ్: టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచ నంబర్వన్ ర్యాంకు కోల్పోయాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ వన్డే బౌలింగ్ జాబితాలో సిరాజ్ రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంకు సాధించాడు. 702 పాయింట్లతో సిరాజ్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. హేజిల్వుడ్ (713- ఆస్ట్రేలియా) ప్రథమ, ట్రెంట్ బౌల్ట్ (708- న్యూజిలాండ్) ద్వితీయ ర్యాంకులు సాధించారు. హేజిల్వుడ్ నంబర్వన్ స్థానంలో నిలవడం అతని కెరీర్లో ఇదే తొలిసారి. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో శుభ్మన్ గిల్ 5, విరాట్ కోహ్లి 7, రోహిత్శర్మ 9వ స్థానాల్లో కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్