ఐపీఎల్కు ఎవరూ దూరం కాకపోవచ్చు
గాయపడుతున్న భారత ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పనిభార నిర్వహణలో భాగంగా ఏ ఆటగాడైనా ఐపీఎల్కు దూరం కావడం అనుమానమేనని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు
చెన్నై: గాయపడుతున్న భారత ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పనిభార నిర్వహణలో భాగంగా ఏ ఆటగాడైనా ఐపీఎల్కు దూరం కావడం అనుమానమేనని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘‘గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తుది జట్టులో ఉండే ఆటగాళ్లను కోల్పోతున్నాం. ఆటగాళ్లకు తమ శరీరాన్ని ఎలా చూసుకోవాలో తెలుసు. ఐపీఎల్లో పని భారం ఎక్కువవుతుందని అనిపిస్తే ఎప్పుడైనా మాతో మాట్లాడొచ్చు. ఒకట్రెండు మ్యాచ్లకు విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ అలా జరగడం అనుమానమే’’ అని చెప్పాడు. ఐపీఎల్ ముగిశాక డబ్ల్యూటీసీ ఫైనల్ (జూన్ 7)కు సిద్ధం కావడానికి భారత ఆటగాళ్లకు కొన్ని రోజుల సమయమే ఉంటుంది. అయితే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్ల పనిభార నిర్వహణకు సంబంధించి ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు టీమ్ మేనేజ్మెంట్ సంకేతాలిచ్చిందని రోహిత్ పేర్కొన్నాడు. ‘‘ఇక ఇప్పుడంతా ఫ్రాంఛైజీల చేతుల్లో ఉంది. ఆటగాళ్లు ఫ్రాంఛైజీల సొంతం. మేం కొన్ని సంకేతాలిచ్చాం. చివరికి నిర్ణయాలు తీసుకోవాల్సింది ఫ్రాంఛైజీలే. ముఖ్యంగా ఆటగాళ్లు తమ శరీరాలను తామే జాగ్రత్తగా చూసుకోవాలి’’ అని చెప్పాడు.
ఆసియాకప్ పాకిస్థాన్లో..భారత్ మ్యాచ్లు యూఏఈలో!
దుబాయ్: ఆసియా కప్లో భారత్ ఆడనుంది. అయితే పాకిస్థాన్లో కాదు. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబరులో పాకిస్థాన్లో ఈ టోర్నీ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఆ దేశ పర్యటనకు బీసీసీఐ ససేమిరా అంటున్న నేపథ్యంలో మధ్యేమార్గంగా టీమ్ఇండియా మ్యాచ్లను మరో దేశంలో నిర్వహించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించినట్లు తెలుస్తోంది. భారత్ మ్యాచ్లకు యూఏఈ ఆతిథ్యం ఇవ్వొచ్చని సమాచారం. ఇంగ్లాండ్, శ్రీలంకలు కూడా వేదికలుగా పరిశీలనలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.