అదరగొట్టిన శ్రీజ
తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంచలనం ఆకుల శ్రీజ అదరగొట్టింది. మహిళల సింగిల్స్లో జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు మరో రెండు స్వర్ణాలు, ఓ కాంస్యం ఖాతాలో వేసుకుంది.
సింగిల్స్లో రెండోసారి జాతీయ ఛాంపియన్
మరో రెండు స్వర్ణాలు, కాంస్యం కైవసం
జమ్ము: తెలంగాణ టేబుల్ టెన్నిస్ సంచలనం ఆకుల శ్రీజ అదరగొట్టింది. మహిళల సింగిల్స్లో జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు మరో రెండు స్వర్ణాలు, ఓ కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఆర్బీఐ తరపున బరిలో దిగిన ఆమె.. టీమ్, మహిళల డబుల్స్లోనూ బంగారు పతకాలు పట్టేసింది. మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం సొంతం చేసుకుంది. పోటీపడిన అన్ని విభాగాల్లోనూ ఆమె పతకాలు గెలవడం విశేషం. సోమవారం సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 9-11, 14-12, 11-7, 13-11, 6-11, 12-10 తేడాతో సుతీర్థ (పశ్చిమ బెంగాల్)పై నెగ్గింది. తొలి గేమ్లో ఓటమితో పోరును మొదలెట్టిన ఆమె.. ఒత్తిడిని అధిగమించి బలంగా పుంజుకుంది. వరుసగా మూడు గేమ్లు గెలిచి టైటిల్కు చేరువైంది. కానీ అయిదో గేమ్లో ఓటమి ఎదురైనా.. ఆరో గేమ్లో పోరాడి నెగ్గిన శ్రీజ వరుసగా రెండో సారి జాతీయ సీనియర్ ఛాంపియన్గా నిలిచింది. మహిళల డబుల్స్ తుదిపోరులో శ్రీజ- దియా జోడీ 11-7, 11-7, 8-11, 14-12తో స్వస్థిక- శ్రుతి (మహారాష్ట్ర) జంటపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ సెమీస్లో మానుష్- శ్రీజ 9-11, 10-12, 12-10, 5-11తో మానవ్- అర్చన చేతిలో ఓడి కంచుకే పరిమితమయ్యారు. మహిళల టీమ్ విభాగంలో ఇప్పటికే ఆర్బీఐ 3-2తో తమిళనాడుపై గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు పురుషుల డబుల్స్లో తెలంగాణ జోడీ.. మహమ్మద్ అలీ- వాన్ష్ సింఘాల్ రజతం నెగ్గారు. ఫైనల్లో ఈ జంట 6-11, 7-11, 6-11తో జీత్చంద్ర- అంకుర్ (పశ్చిమ బెంగాల్) చేతిలో ఓడింది. సింగిల్స్ టైటిల్ను సత్యన్ సొంతం చేసుకున్నాడు. నిరుడు కామన్వెల్త్ క్రీడల మిక్స్డ్ డబుల్స్లో శరత్ కమల్తో కలిసి ఛాంపియన్గా నిలిచిన శ్రీజ నిలకడగా రాణిస్తోంది. ఈ ఏడాది జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్స్లో ఆమె బరిలో దిగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్