రోహిత్ కోరితేనే విశ్రాంతి
కెప్టెన్ రోహిత్శర్మకు విశ్రాంతి అవసరం లేదని భావిస్తున్నట్లు ముంబయి ఇండియన్స్ చీఫ్ కోచ్ మార్క్ బౌచర్ అన్నాడు. అతను కోరితేనే ఒకటి, రెండు మ్యాచ్లకు విశ్రాంతినిస్తామని బౌచర్ చెప్పాడు. ‘
ముంబయి: కెప్టెన్ రోహిత్శర్మకు విశ్రాంతి అవసరం లేదని భావిస్తున్నట్లు ముంబయి ఇండియన్స్ చీఫ్ కోచ్ మార్క్ బౌచర్ అన్నాడు. అతను కోరితేనే ఒకటి, రెండు మ్యాచ్లకు విశ్రాంతినిస్తామని బౌచర్ చెప్పాడు. ‘‘రోహిత్ జట్టు కెప్టెన్. అతను విశ్రాంతి తీసుకోకూడదనే ఆశిస్తున్నా. అయితే ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉంటాం. సారథిగా, ఆటగాడిగా అతను అత్యుత్తమంగా రాణిస్తే ఆనందమే. అలాంటి సమయంలో ఒకటి, రెండు మ్యాచ్ల్లో విశ్రాంతి కావాలని కోరితే నాకెలాంటి అభ్యంతరం లేదు. పనిభారం గురించి చాలా చర్చలు జరగుతున్నాయి. మా షెడ్యూల్ పరిశీలిస్తే మధ్యలో కావాల్సినంత విశ్రాంతి ఉంది. కాబట్టి ఐపీఎల్లో పనిభారం సమస్యగా కనిపించడం లేదు. టీ20 క్రికెట్లో పనిభారం గురించి కొన్నిసార్లు మీడియా, జనాలు అతిగా స్పందిస్తారు. టెస్టులు, వన్డే క్రికెట్తోనే దేహంపై ఎక్కువ భారం పడుతుంది. టీ20 క్రికెట్ చాలా చిన్నది. పనిభారం గురించి మాట్లాడుకోకూడదని కోరుతున్నా. సూర్యకుమార్ యాదవ్ మంచి లయలోనే ఉన్నాడు. ఒక ఆటగాడు తొలి బంతిని ఎలా ఆడుతున్నాడన్నదాని ఆధారంగా అతని ఫామ్ను అంచనా వేయలేం. ఐపీఎల్లో సూర్య మొదటి బంతిని ఎదుర్కొన్నప్పుడు ప్రేక్షకులంతా ఆనందిస్తారు. అతను మళ్లీ పరుగులు రాబడతాడు’’ అని బౌచర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు