క్వార్టర్స్లో సింధు, శ్రీకాంత్
స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్లు క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21-14, 21-16తో కుసుమ వర్దని (ఇండోనేసియా)పై నెగ్గింది.
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్లు క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21-14, 21-16తో కుసుమ వర్దని (ఇండోనేసియా)పై నెగ్గింది. గాయం నుంచి కోలుకున్నాక ఫామ్ను అందుకోలేక ఇబ్బంది పడుతున్న సింధు క్వార్టర్స్ చేరుకోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. మ్యాచ్లో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఆమె మొదటి గేమ్ను ఏకపక్షంగా ముగించింది. 8-1తో మొదలుపెట్టిన ఆమె చూస్తుండగానే 21-14తో తొలి గేమ్ గెలుచుకుంది. రెండో గేమ్ ప్రథమార్ధం వరకు హోరాహోరీగా సాగింది. సింధు, కుసుమ 8 పాయింట్ల వరకు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. 15-13 స్కోరు వరకు ప్రత్యర్థి పోటీలో నిలిచింది. ఆ తర్వాత గేరు మార్చిన సింధు వరుసగా 4 పాయింట్లతో ముందంజ వేసింది. 19-13తో గేమ్కు చేరువైన సింధు.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-16తో రెండో గేమ్ను, మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఆకర్షి కశ్యప్ 13-21, 8-21తో నట్సుకీ (జపాన్) చేతిలో.. అస్మిత 15-21, 15-21తో యెజియా (ఇండోనేషియా) చేతిలో ఓడారు. మారిన్ (స్పెయిన్)తో పోరును మాల్విక వాకోవర్ ఇచ్చింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్ 21-15, 21-12తో సహచర ఆటగాడు సాయి ప్రణీత్పై గెలుపొందాడు. ప్రియాంశు రజావత్ 14-21, 15-21తో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో.. కిరణ్ జార్జ్ 17-21, 12-21తో మాగ్నస్ జొహానెసెన్ (డెన్మార్క్) చేతిలో.. సమీర్వర్మ 15-21, 14-21తో సనెయమా (జపాన్) చేతిలో ఓడారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సిక్కిరెడ్డి-ఆర్తి 12-21, 13-21తో హిరోకమి-యునా కాటో (జపాన్) చేతిలో తలొంచగా.. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో అర్జున్-ధ్రువ్ 16-21, 20-22తో మెజాకి-నిషిడా (జపాన్) చేతిలో ఓడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్లో మ్యాచ్ విన్నర్.. దినేశ్ కార్తిక్కు గోల్డెన్ ఛాన్స్: అంబటి రాయుడు
ఐపీఎల్-17 సీజన్లో అదరగొడుతున్న దినేశ్ కార్తిక్ (Dinesh Karthik)ను 2024 టీ20 ప్రపంచకప్ (T20 WorldCup 2024)లో చివరిసారిగా భారత్ తరఫున ఆడేందుకు ఎంపిక చేయాలని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు కోరాడు. -
IPL: ఐపీఎల్.. ఈ సీజన్లో లాంగెస్ట్ సిక్సర్ బాదిన దినేశ్ కార్తిక్.. వీడియో చూశారా!
ఐపీఎల్ 17లో భాగంగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో విజయం సాధిచింది. తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగుల రికార్డు స్కోరు చేసింది. ఈ లక్ష్యఛేదనలో బెంగళూరు 262/7కు పరిమితమైంది. దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) (83; 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్లు) వీరోచితంగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో నటరాజన్ వేసిన 15.1 ఓవర్కు డీకే భారీ సిక్సర్ బాదాడు. అది స్టేడియం రూఫ్కు తగిలింది. ఇది 108 మీటర్ల సిక్సర్. ఈ సీజన్లో అత్యధిక దూరం వెళ్లిన సిక్స్ ఇదే. ఆ వీడియోను మీరూ చూసేయండి!
-
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
ఆర్సీబీని విక్రయించాలంటున్న టెన్నిస్ స్టార్.. బ్యాటర్ల విధ్వంసంపై సచిన్ ఆసక్తికర పోస్టు
ప్రతి ఏడాది మాదిరిగానే ఆర్సీబీ (RCB) ఈ సారి కూడా అభిమానులను నిరాశపరుస్తోంది. తాజాగా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. -
హైదరాబాద్ దండయాత్ర.. రికార్డులే రికార్డులు..
ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ అదరగొడుతోంది. రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తోంది. -
‘మరో ఆటగాడిని తీసుకోవాలని చెప్పా’.. ఐపీఎల్ నుంచి మ్యాక్స్వెల్ బ్రేక్
Glenn Maxwell: ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ టోర్నీ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. తన స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయాలని జట్టు యాజమాన్యానికి స్వయంగా చెప్పాడు. -
వరుస ఓటములు జట్టును కుంగదీశాయి: బెంగళూరు కెప్టెన్
Bengaluru X Hyderabad: చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు, హైదరాబాద్ జట్లు సోమవారం తలపడ్డాయి. ఎస్ఆర్హెచ్ రికార్డు స్కోరు నమోదు చేసింది. దీంతో ఆర్సీబీ మరో ఓటమి మూటగట్టుకుంది. మ్యాచ్ అనంతరం దాని కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఓటమికి గల కారణాలను వివరించాడు. -
నేనూ బ్యాటర్ అయితే బాగుండే: కమిన్స్
Bengaluru X Hyderabad: సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరుపై హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు అత్యధిక స్కోరు నమోదు చేసింది. -
277 పోయె.. 287 వచ్చె!
2024 మార్చి 27.. ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందనుకున్న తేదీ. కానీ ఆ తేదీకి తాను ఆపాదించిన ప్రత్యేకతను తనే తుడిచేసింది సన్రైజర్స్ హైదరాబాద్. ఆ రోజు ముంబయి బౌలింగ్ను ఊచకోత కోస్తూ ఏకంగా 277 పరుగులు చేసి, పదకొండేళ్ల పాటు నిలిచిన ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును తిరగరాసిన హైదరాబాద్. -
ఒత్తిడికి చిత్తవుతున్నాడా?
హార్దిక్ పాండ్య.. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆల్రౌండర్లలో ఒకడు. ముంబయి ఇండియన్స్ ఒకప్పుడు టైటిళ్ల మీద టైటిళ్లు గెలవడంలో అతడి పాత్ర కీలకం. ఇక రెండేళ్ల ముందు కెప్టెన్గా కూడా ఐపీఎల్పై తనదైన ముద్ర వేశాడీ బరోడా ఆటగాడు. -
నది నుంచి స్టేడియంలోకి!
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను స్టేడియంలో కాకుండా ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సన్నద్ధమవుతోంది. ఫ్రాన్స్ నగరంలో ప్రవహించే సెన్ నది ఈ ప్రారంభోత్సవ వేడుకలకు వేదిక కానుంది. -
అలెక్నా ప్రపంచరికార్డు
డిస్కస్ త్రోలో లిత్వేనియా అథ్లెట్ మికోలాస్ అలెక్నా నయా రికార్డు సృష్టించాడు. ఒక్హోమా సిరీస్ టోర్నమెంట్లో డిస్క్ను 74.35 మీటర్ల దూరం విసిరిన అలెక్నా స్వర్ణం గెలుచుకున్నాడు. -
మరో సింధుని అవుతా
పి.వి.సింధునే తనకు స్ఫూర్తి అని ఆమెలాగే తానూ ఛాంపియన్ ప్లేయర్గా ఎదగాలని కోరుకుంటున్నానని యువ షట్లర్ తన్విశర్మ చెప్పింది. 15 ఏళ్ల తన్వి.. ఈ నెల చైనాలో జరిగే ఉబర్కప్లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలు. -
నకమురపై విదిత్ విజయం
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతి సత్తా చాటాడు. తొమ్మిదో రౌండ్లో అతడు రెండో సీడ్ హికరు నకముర (అమెరికా)పై విజయం సాధించాడు. -
పోలీసుల రిమాండ్లో ఆసీస్ మాజీ క్రికెటర్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత మైకెల్ స్లేటర్ను పోలీసులు రిమాండ్లోకి తీసుకున్నారు. దాడి చేయడం, వెంబడించడం అభియోగాలతో అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. -
సంక్షిప్త వార్తలు (5)
హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియంలో నిర్వహించే రెండు ఐపీఎల్ మ్యాచ్లు హైబ్రిడ్ పిచ్పై జరగనున్నాయి. మే 5న పంజాబ్-చెన్నై, మే 9న పంజాబ్-బెంగళూరు మ్యాచ్ల్లో ఈ ప్రయోగం చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అలవాట్లతో.. స్పెర్మ్ డీఎన్ఏకు ముప్పు!
-
కార్పొరేట్ ఉద్యోగం వదిలి.. ‘సివిల్స్’ టాపర్గా నిలిచి.. శ్రీవాస్తవ జర్నీ ఇదీ!
-
బ్యాలెట్ ఓటింగ్తో ఏం జరిగిందో మాకు తెలుసు: సుప్రీంకోర్టు
-
లోక్సభ ఎన్నికల వేళ.. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
-
టీ20 ప్రపంచకప్లో మ్యాచ్ విన్నర్.. దినేశ్ కార్తిక్కు గోల్డెన్ ఛాన్స్: అంబటి రాయుడు
-
డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దు: ఈసీ