క్వార్టర్స్లో సింధు, శ్రీకాంత్
స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్లు క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21-14, 21-16తో కుసుమ వర్దని (ఇండోనేసియా)పై నెగ్గింది.
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్లు క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21-14, 21-16తో కుసుమ వర్దని (ఇండోనేసియా)పై నెగ్గింది. గాయం నుంచి కోలుకున్నాక ఫామ్ను అందుకోలేక ఇబ్బంది పడుతున్న సింధు క్వార్టర్స్ చేరుకోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. మ్యాచ్లో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఆమె మొదటి గేమ్ను ఏకపక్షంగా ముగించింది. 8-1తో మొదలుపెట్టిన ఆమె చూస్తుండగానే 21-14తో తొలి గేమ్ గెలుచుకుంది. రెండో గేమ్ ప్రథమార్ధం వరకు హోరాహోరీగా సాగింది. సింధు, కుసుమ 8 పాయింట్ల వరకు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. 15-13 స్కోరు వరకు ప్రత్యర్థి పోటీలో నిలిచింది. ఆ తర్వాత గేరు మార్చిన సింధు వరుసగా 4 పాయింట్లతో ముందంజ వేసింది. 19-13తో గేమ్కు చేరువైన సింధు.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-16తో రెండో గేమ్ను, మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఆకర్షి కశ్యప్ 13-21, 8-21తో నట్సుకీ (జపాన్) చేతిలో.. అస్మిత 15-21, 15-21తో యెజియా (ఇండోనేషియా) చేతిలో ఓడారు. మారిన్ (స్పెయిన్)తో పోరును మాల్విక వాకోవర్ ఇచ్చింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్ 21-15, 21-12తో సహచర ఆటగాడు సాయి ప్రణీత్పై గెలుపొందాడు. ప్రియాంశు రజావత్ 14-21, 15-21తో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో.. కిరణ్ జార్జ్ 17-21, 12-21తో మాగ్నస్ జొహానెసెన్ (డెన్మార్క్) చేతిలో.. సమీర్వర్మ 15-21, 14-21తో సనెయమా (జపాన్) చేతిలో ఓడారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సిక్కిరెడ్డి-ఆర్తి 12-21, 13-21తో హిరోకమి-యునా కాటో (జపాన్) చేతిలో తలొంచగా.. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో అర్జున్-ధ్రువ్ 16-21, 20-22తో మెజాకి-నిషిడా (జపాన్) చేతిలో ఓడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్