Virat Kohli: బెంగళూరుకు చావోరేవో.. కోహ్లీపైనే అందరి దృష్టి
సన్రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ఐపీఎల్-16లో పేలవ ప్రదర్శనతో ఆ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఈనాడు, హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ఐపీఎల్-16లో పేలవ ప్రదర్శనతో ఆ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇంకా రెండు మ్యాచ్లు ఆడనున్న ఆ జట్టు.. మిగతా జట్ల అవకాశాలను ప్రభావితం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అందులో మొదటగా సొంతగడ్డపై గురువారం బెంగళూరును ఢీకొననుంది. 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 ఓటములతో ఉన్న బెంగళూరుకు ఈ మ్యాచ్లో విజయం సాధించడం అత్యావశ్యకం. ఓడినా ఆ జట్టు రేసులో ఉంటుంది కానీ.. ఆఖరి మ్యాచ్లో గెలవడంతో పాటు మిగతా జట్ల ఫలితాలు కలిసిరావాలి. గుజరాత్ టైటాన్స్ (18 పాయింట్లు) ఇప్పటికే ప్లేఆఫ్స్కు అర్హత సాధించగా.. చెన్నై సూపర్ కింగ్స్ (15), లఖ్నవూ సూపర్ జెయింట్స్ (15), ముంబయి ఇండియన్స్ (14) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సొంతగడ్డపై సన్రైజర్స్ పరువు కోసం పోరాడనుండగా.. బెంగళూరుకు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. తన తర్వాతి రెండు మ్యాచ్ల్లో సన్రైజర్స్, గుజరాత్ టైటాన్స్లపై నెగ్గాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం బెంగళూరు సర్వశక్తులు ఒడ్డుతుందనడంలో సందేహం లేదు. కెప్టెన్ డుప్లెసిస్.. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్వెల్ ఫామ్లో ఉండటం ఆ జట్టుకు అతిపెద్ద సానుకూలాంశం. సీజన్లో అత్యధిక పరుగుల జాబితాలో టాప్-6లో ఇద్దరు బెంగళూరు బ్యాటర్లే. డుప్లెసిస్ (631 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోహ్లి (438) ఆరో స్థానంలో ఉన్నాడు. మ్యాక్స్వెల్ (384) విధ్వంసకర ఇన్నింగ్స్లతో అదరగొడుతున్నాడు. మిడిలార్డర్ కూడా గాడినపడితే బ్యాటింగ్లో బెంగళూరుకు తిరుగుండదు. గత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై భారీ విజయం బెంగళూరులో స్ఫూర్తి నింపింది. ముఖ్యంగా బౌలర్లు పార్నెల్, సిరాజ్, మైకెల్ బ్రాస్వెల్, కర్ణ్శర్మ సమష్టిగా సత్తాచాటి రాజస్థాన్ను 59 పరుగులకే ఆలౌట్ చేయడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే జోరులో సన్రైజర్స్ను చిత్తుచేయాలని బెంగళూరు భావిస్తోంది. ఇక గురువారం విరాట్ కోహ్లి ఆడనుండటం హైదరాబాద్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూతో సన్రైజర్స్ గత మ్యాచ్లో కోహ్లి లేకపోయినా.. అభిమానులు పెద్ద ఎత్తున అతనికి మద్దతుగా నిలిచారు. మ్యాచ్ ఆసాంతం కోహ్లి.. కోహ్లి అంటూ నినాదాలతో హోరెత్తించారు. గురువారం కోహ్లి స్వయంగా ఉప్పల్లో కనిపిస్తుండటంతో అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు