Virender Sehwag: పృథ్వీ షా, శుభ్మన్ గిల్ నాతో ఆరు గంటలున్నా..
ఇటీవల ఓ యాడ్ షూటింగ్ సందర్భంగా పృథ్వీ షా, శుభ్మన్ గిల్ ఆరు గంటలు తనతో ఉన్నా ఇద్దరిలో ఎవరూ క్రికెట్ గురించి మాట్లాడలేదని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.
దిల్లీ: ఇటీవల ఓ యాడ్ షూటింగ్ సందర్భంగా పృథ్వీ షా, శుభ్మన్ గిల్ ఆరు గంటలు తనతో ఉన్నా ఇద్దరిలో ఎవరూ క్రికెట్ గురించి మాట్లాడలేదని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. ‘‘పృథ్వీ నాతో కలిసి ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నాడు. శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. ఇద్దరిలో ఒక్కరూ ఒక్కసారి కూడా నాతో క్రికెట్ గురించి మాట్లాడలేదు. మేమక్కడ ఆరు గంటలు ఉన్నాం. మనం ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే చొరవ చూపాల్సింది మనమే’’ అని అన్నాడు. ఒకప్పుడు సునీల్ గావస్కర్తో మాట్లాడాలనుకున్న తాను, అతణ్ని ఎలా సంప్రదించాడో చెప్పాడు సెహ్వాగ్. ‘‘అప్పుడు నేను జట్టులో కొత్త. సన్నీ భాయ్ (గావస్కర్)తో మాట్లాడాలనుకున్నా. ‘నేనింకా కొత్త ఆటగాణ్ని. సన్నీ భాయ్ నన్ను కలుస్తాడో లేదో. కానీ మీరు నాకోసం ఆయనతో సమావేశం ఏర్పాటు చెయ్యాలి’ అని జాన్ రైట్తో చెప్పా. దాంతో రైట్ 2003-04లో నాకోసం డిన్నర్ ఏర్పాటు చేశాడు. నా ఓపెనింగ్ భాగస్వామి ఆకాశ్ చోప్రా కూడా వస్తాడని, బ్యాటింగ్ గురించి సన్నీ భాయ్తో మాట్లాడతామని చెప్పా. సన్నీ భాయ్ వచ్చాడు. మాతో కలిసి డిన్నర్ చేశాడు. నేను చెప్పేదేంటంటే.. ఎవరినైనా కలవాలనుకుంటే మనమే చొరవ చూపాలి. సెహ్వాగ్ లేదా చోప్రాతో మాట్లాడడానికి గావస్కర్ ముందుకు రాడు. మాట్లాడమని మనమే అతడికి విజ్ఞప్తి చేయాలి’’ అని చెప్పాడు. పేలవ దశలో ఉన్న ఆటగాడు సీనియర్ ఆటగాడి దగ్గరకు వెళ్లి మాట్లాడితే బాగుంటుందని వీరూ అన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో పేలవ ఫామ్తో సతమతమవుతున్న పృథ్వీ (దిల్లీ క్యాపిటల్స్) బుధవారం పంజాబ్ కింగ్స్పై చక్కని అర్ధశతకం సాధించిన సంగతి తెలిసిందే. ‘‘గావస్కర్ మాతో చాలా సేపు మాట్లాడాడు. సలహాలు ఇచ్చాడు. ఆ సంభాషణతో మేమెంతో లాభపడ్డాం. కానీ సీనియర్తో మాట్లాడాలంటే మనమే చొరవ చూపాలి. గావస్కరే వచ్చి మనతో మాట్లాడడు. పృథ్వీ షా కూడా ప్రయత్నిస్తే ఎవరో ఒకరు అతడితో మాట్లాడేవాళ్లు’’ అని సెహ్వాగ్ అన్నాడు. క్రికెట్లో ఎంత ప్రతిభ ఉన్నా.. మానసికంగా ఫిట్గా లేకపోతే ప్రయోజనం లేదని అతడు చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్