IPL: ఆ ఒక్కటి ఏదీ? తేలేది నేడే..
ఈ ఐపీఎల్ సీజన్లో చివరి ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకునే జట్టు ఏదన్నది నేడు తేలిపోనుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ వరుసగా తొలి మూడు స్థానాలతో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టాయి.
![](https://assets.eenadu.net/article_multiple_images/123090694_21052023-RMR1a.jpg)
ఈ ఐపీఎల్ సీజన్లో చివరి ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకునే జట్టు ఏదన్నది నేడు తేలిపోనుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ వరుసగా తొలి మూడు స్థానాలతో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టాయి. మంగళవారం తొలి క్వాలిఫయర్లో గుజరాత్ను చెన్నై ఢీ కొడుతుంది. బుధవారం ఎలిమినేటర్లో లఖ్నవూతో తలపడే జట్టు ఏదన్నదే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఒకవేళ ముంబయి, బెంగళూరు గెలిస్తే చెరో 16 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్రేట్ ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ఈ రెండు జట్లలో ఒకటి ఓడి.. మరొకటి నెగ్గితే.. ఆ గెలిచిన జట్టు నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ ఈ రెండూ ఓడిపోతే.. అప్పుడు ఆర్సీబీ, రాజస్థాన్, ముంబయి తలో 14 పాయింట్లతో ఉంటాయి. ఇలా జరిగితే మళ్లీ నెట్ రన్రేట్ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.