Virat Kohli: టీ20ల్లో నా పనైపోయిందనుకున్నారు: విరాట్‌ కోహ్లి

ఐపీఎల్‌లో ఏడో సెంచరీతో సత్తాచాటిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి విమర్శకులపై మండిపడ్డాడు. టీ20ల్లో తన పనైపోయిందని కొందరు అనుకున్నారని చెప్పాడు.

Updated : 23 May 2023 06:51 IST

బెంగళూరు: ఐపీఎల్‌లో ఏడో సెంచరీతో సత్తాచాటిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి విమర్శకులపై మండిపడ్డాడు. టీ20ల్లో తన పనైపోయిందని కొందరు అనుకున్నారని చెప్పాడు. ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో తాను అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నానని అన్నాడు. ‘‘ఇప్పుడు నాకు గొప్పగా అనిపిస్తోంది.  నా టీ20 ఆట క్షీణించిందని చాలామంది అనుకున్నారు. నాకు మాత్రం అలా అనిపించట్లేదు. మళ్లీ  అత్యుత్తమ టీ20 క్రికెట్‌ ఆడుతున్నానని అనుకుంటున్నా. ఆటను ఆస్వాదిస్తున్నా. టీ20 క్రికెట్‌ ఇలాగే ఆడతా. ఖాళీల్లో ఎక్కువగా బౌండరీలు బాదుతా. పరిస్థితి అనుకూలిస్తే ఆఖర్లో భారీషాట్లు కొడతా. ప్రస్తుతం నా ఆటతీరు పట్ల సంతృప్తిగా ఉన్నా’’ అని కోహ్లి తెలిపాడు. కోహ్లి ఆదివారం గుజరాత్‌పై 61 బంతుల్లో 101తో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయినా ఆర్సీబీ మ్యాచ్‌లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. టోర్నీలో విరాట్‌ 639 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో డుప్లెసిస్‌ (730), శుభ్‌మన్‌ గిల్‌ (680) తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని