సెమీస్లో సింధు, ప్రణయ్
మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సెమీస్లో అడుగుపెట్టారు.
శ్రీకాంత్ ఔట్
మలేసియా మాస్టర్స్
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సెమీస్లో అడుగుపెట్టారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుత పోరాటంతో వీళ్లు ముందంజ వేశారు. శుక్రవారం మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో ఆరో సీడ్ సింధు 21-16, 13-21, 22-20 తేడాతో యీ మన్ జాంగ్ (చైనా)పై గెలిచింది. తొలి గేమ్ ఆరంభంలో 0-5తో వెనుకబడ్డ సింధు ఆ తర్వాత గొప్పగా పుంజుకుని 10-10తో స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి తనదైన శైలిలో రెచ్చిపోయిన ఆమె ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లింది. స్మాష్లు, డ్రాప్లతో పాయింట్లు సాధించి తొలి గేమ్ సొంతం చేసుకుంది. కానీ రెండో గేమ్లో ప్రత్యర్థి నుంచి సింధుకు ఓటమి తప్పలేదు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో పోరు మరోస్థాయికి చేరింది. 17-17తో స్కోరు సమమైన దశలో వరుసగా మూడు పాయింట్లు గెలిచిన సింధు 20-17తో దూసుకెళ్లింది. కానీ జాంగ్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 20-20తో సింధును అందుకుంది. ఆ తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ సింధు వరుసగా రెండు పాయింట్లతో విజేతగా నిలిచింది. శనివారం సెమీస్లో ఏడో సీడ్ మరిస్కా తుంజుంగ్ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో ప్రణయ్ 25-23, 18-21, 21-13తో కెంటా నిషిమోటో (జపాన్)ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్లో ప్రత్యర్థి సవాలును దాటి ప్రణయ్ నిలిచాడు. రెండో గేమ్లో ఓటమి ఎదురైనా.. బలంగా పుంజుకుని మూడో గేమ్లో చెలరేగి గెలుపు ఖాతాలో వేసుకున్నాడు. మరో క్వార్టర్స్లో కిదాంబి శ్రీకాంత్ 21-16, 16-21, 11-21తో క్రిస్టియన్ అడినాటా (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. సెమీస్లో అడినాటానే ప్రణయ్ ఢీకొట్టనున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు