MS Dhoni: రాయుడు, జడేజాకు ట్రోఫీ.. అందరినీ ఆకట్టుకున్న అతడి చర్య..
కెప్టెన్గా ధోని తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు. ఐపీఎల్-16 ట్రోఫీ అందుకునే సమయంలో అతడి చర్య అందరినీ ఆకట్టుకుంది. ట్రోఫీ తాను అందుకోకుండా ఆఖర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జడేజా, ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రాయుడులను అందుకోవాలని కోరాడు.
కెప్టెన్గా ధోని తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు. ఐపీఎల్-16 ట్రోఫీ అందుకునే సమయంలో అతడి చర్య అందరినీ ఆకట్టుకుంది. ట్రోఫీ తాను అందుకోకుండా ఆఖర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జడేజా, ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రాయుడులను అందుకోవాలని కోరాడు. జడేజా, రాయుడు.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ నుంచి ట్రోఫీని స్వీకరించారు. ధోని.. బిన్నీ పక్కన నిలబడ్డాడు. తర్వాత అతడు జడేజా, రాయుడులతో పాటు ట్రోఫీని పట్టుకున్నాడు.
అతడు అలా గుర్తుండిపోతాడు.. ధోని: ఫైనల్లో కేవలం 8 బంతుల్లో 19 పరుగులు చేసిన రాయుడు చెన్నై విజయంలో తన వంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అతడు మైదానంలో ఉన్నప్పుడు నూరు శాతం శ్రమిస్తాడని ఫైనల్ అనంతరం ధోని వ్యాఖ్యానించాడు. ‘‘రాయుడులో ప్రత్యేకత ఏంటంటే.. అతడు మైదానంలో ఉంటే నూరుశాతం శ్రమిస్తాడు. ఇంకో విషయం ఏంటంటే.. అతడు జట్టులో ఉంటే నేనెప్పుడూ ఫెయిర్ ప్లే అవార్డు గెలవను. ఎందుకంటే రాయుడు చాలా త్వరగా స్పందిస్తాడు. కానీ అతడో మంచి క్రికెటర్గా నాకు గుర్తుండిపోతాడు. ఎప్పుడూ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాడు. మేం భారత్-ఎకు ఆడే రోజుల నుంచి చూస్తున్నా.. అతడు స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్లను సమర్థంగా ఎదుర్కోగలడు’’ అని అన్నాడు.
రాయుడు బై బై: అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ఫైనల్ అనంతరం రాయుడు ప్రకటించాడు. ‘‘అన్ని రకాల భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. చిన్నప్పుడు ఇంటి వద్ద క్రికెట్ బ్యాట్ పట్టుకున్నప్పుడు టెన్నిస్ బంతితో ఆడేవాణ్ని. ఈ అద్భుత ప్రయాణం మూడు దశాబ్దాలు సాగుతుందని ఊహంచలేదు’’ అని రాయుడు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ‘‘అండర్-15 నుంచి అత్యున్నత స్థాయి వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. తొలిసారి 2013లో టీమ్ఇండియా క్యాప్ అందుకోవడం నాకిప్పటికీ గుర్తుంది’’ అని చెప్పాడు. తనకిదే చివరి ఐపీఎల్ అని రాయుడు ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే