Sehwag: విండీస్ పతనానికి కారణమదే: సెహ్వాగ్
ప్రాంతీయ రాజకీయాలే వెస్టిండీస్ క్రికెట్ను దెబ్బ తీశాయని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ‘‘వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోవడం సిగ్గు చేటు.
దిల్లీ: ప్రాంతీయ రాజకీయాలే వెస్టిండీస్ క్రికెట్ను దెబ్బ తీశాయని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ‘‘వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించలేకపోవడం సిగ్గు చేటు. నైపుణ్యం ఉంటే సరిపోదు. రాజకీయాలకు అతీతంగా ఒక జట్టును నడిపించాలనడానికి విండీస్ మంచి ఉదాహరణ. రాజకీయాలే ఆ జట్టును దెబ్బ తీశాయి. ఇంతకుమించి పడిపోవడానికి విండీస్కు ఇంకేమి మిగల్లేదు’’ అని వీరూ ట్వీట్ చేశాడు. ‘‘వన్డే ప్రపంచకప్కు విండీస్ అర్హత సాధించలేకపోవడం చూస్తే బాధ కలుగుతోంది. వాళ్లకు టీ20లు అంటేనే ఆసక్తి ఉంది. దేశానికి ఆడడాన్ని గర్వకారణంగా భావించట్లేదు’’ అని 1982 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు మదన్లాల్ అన్నాడు. విండీస్ బలంగా పుంజుకుంటుందని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘విండీస్ అంటే నాకెంతో ఇష్టం. ప్రపంచ క్రికెట్లో నంబర్వన్ జట్టుగా నిలిచే సత్తా వారికి ఉందని ఇప్పటికీ నమ్ముతున్నా’’ అని గౌతి ట్వీట్ చేశాడు.
ఈ పతనం ఇప్పటిది కాదు: వెస్టిండీస్ క్రికెట్ పతనం ఇప్పటిది కాదని.. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లు ఆటలోకి రాకముందు నుంచే మొదలైందని వెస్టిండీస్ మాజీ పేసర్ ఇయాన్ బిషప్ అన్నాడు. ‘‘నెమ్మది నెమ్మదిగా జరిగిన పతనమిది. ప్రస్తుత జట్టు క్రికెట్ మొదలుపెట్టక ముందే వెస్టిండీస్ పతనం మొదలైంది. దాదాపు పదేళ్లుగా మా జట్టు వన్డేల్లో అగ్ర జట్లపై సరైన ప్రదర్శన చేయట్లేదు. టీ20ల్లో మాత్రమే రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్లు అయ్యాం. ఆ తర్వాత ఇంకా మెరుపులు లేవు. పతనం వేగంగా సాగింది. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినట్లుగా మా జట్టు ఇప్పుడు లేదు. మిగిలిన జట్లు రోజు రోజుకు బలపడితే విండీస్ బలహీనంగా మారింది. సుదీర్ఘ ఫార్మాట్ ఆడే నైపుణ్యం ఆటగాళ్లలో తగ్గిపోయింది. కరీబియన్ బోర్డు ఆర్థిక సంక్షోభం కూడా ఇందుకు కారణం. అయితే ఆర్థిక పరిస్థితులే పతనానికి కారణమని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంతకంటే దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న జింబాబ్వే.. వేగంగా కోలుకుంది. ఇప్పుడు ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో సత్తా చాటుతోంది. ప్రస్తుత విండీస్కు ఇంతకు మించి ప్రదర్శన చేసే సత్తా ఉందని నమ్ముతున్నా. కెప్టెన్, కోచ్లు మారారు. వారికి కుదురుకునే సమయం ఇవ్వాలి. తక్కువ వనరులతోనే జింబాబ్వే అదరగొడుతుంటే.. వెస్టిండీస్ ఎందుకు మెరుగుకాకూడదూ?’’ అని బిషప్ ప్రశ్నించాడు.
ఆ ఆలోచన మార్చుకోవాలి: భిన్న ప్రాంతాలకు చెందిన వాళ్లమనే ఆలోచనను మార్చుకుని ఒకే జట్టుగా ఆడాలని వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ సహచరులకు సలహా ఇచ్చాడు. విండీస్ వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించని నేపథ్యంలో అతడిలా అన్నాడు. ‘‘క్రికెట్ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన క్రికెటర్లు జట్టుగా ఏర్పడి కలిసి ఆడే ఆట. ఒక బృందంగా ఎలా ముందుకెళ్లాలో ఆలోచించాలి. క్వాలిఫయర్ టోర్నీలో స్కాట్లాండ్ చేతిలో ఓటమి.. విండీస్ పతనంలో అత్యంత అధ్యాన్న స్థితి. ఈ టోర్నీలో ఏదైనా సానుకూలత ఉందంటే అది పూరన్ బ్యాటింగే. విండీస్ పుంజుకోవాలంటే సమయం పడుతుంది. దిగువ స్థాయి నుంచి ప్రక్షాళన జరగాలి. ప్రతిభావంతులను వెలికి తీసి సానబట్టాలి. దేశవాళీ టోర్నీలను మరింత మెరుగుపరచాలి. సీనియర్ స్థాయికి వచ్చేసరికి యువ ఆటగాళ్లకు మంచి పునాది పడాలి. ఒకటి రెండేళ్లలో జట్టు బలంగా మారుతుందని ఆశిస్తున్నా’’ అని హోల్డర్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ వార్షిక జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఎప్పటిలానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు